నిర్బంధ అరెస్టులు మాకు కొత్తేమి కాదు: ఈటల రాజేందర్
నిర్బంధించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తమకు అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని గురువారం ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.
ప్రతిసారీ అధికార పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షాలుగా తమపై ఉందన్నారు.
కానీ కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ను ప్రజలు మార్చడం ఖాయమని హెచ్చరించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు....











Jul 20 2023, 13:24
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.6k