VijayaKumar

Jun 28 2024, 16:59

భువనగిరి పట్టణంలో 8వ వార్డులో నీటి వసతి కల్పించిన కౌన్సిలర్ పంగరెక్క స్వామి

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి థియేటర్ నందగుట్ట దగ్గర 8వ వార్డు లో పనిచేయని బోరు ను వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి దగ్గరుండి కొత్త మోటార్ వేపించి ప్రజలకు నీరు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా ఉండకూడదని వేరే మోటార్ వేయించమని తెలియజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శంకరయ్య పాపయ్య కృష్ణ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 28 2024, 16:38

భువనగిరి: జూలై 1 నుంచి అమలయ్యే కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని భువనగిరి బార్ అసోసియేషన్ ముందు నిరసన

ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నూతనంగా వచ్చే క్రిమినల్ మేజర్ చట్టాల ద్వారా హక్కులను కోల్పోతున్నామని జులై 1 నుండి అమలయే నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని భారశిక్ష అధ్యక్షులు బబ్బురి హరినాథ్ ఐలు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డిలు డిమాండ్ చేశారు భువనగిరి బార్ అసోసియేషన్ ముందు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలు న్యాయ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వెంటనే అమలు చేయ తలపెట్టిన నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు అన్ని బార్ అసోసియేషన్లలో,జడ్జీలతో, ప్రజలతో, విస్తృతంగా చర్చ జరపాలని వారు అన్నారు అలాగే రేపు 29-06-24 రోజున బార్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులకు న్యాయవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు *ఈ కార్యక్రమంలో గజ్జల రవీందర్ రెడ్డి, గోదా వెంకటేశ్వర్లు, బొబ్బల కేశవరెడ్డి,బొల్లెపల్లి కుమార్ ఐలు జిల్లా సహాయ కార్యదర్శి బొమ్మ వెంకటేష్ సురకంటి జంగారెడ్డి జి లింగం సురేష్ చింతల రాజుతదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 28 2024, 12:58

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా మారగోని

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు,గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డికి, నియామకానికి సహకరించిన సౌత్ ఇండియా చైర్మన్ రావులపల్లి తిరుపతయ్య, తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇటికాల మాధవి, ఎండి. సమిమ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడుతానని తెలిపారు.

VijayaKumar

Jun 27 2024, 19:49

వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర పై PD , యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ..తన వ్యక్తిగత అవసరాల కోసం స్థానిక కాంట్రాక్టర్ లను, ప్రభుత్వ ఉద్యోగులను , మహిళల ను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ బెదిరింపులకు SC /ST కేసులు పెడితనని బెదిరింపులకు పాల్పడుతున్న వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేందర్ (43 ) అనే వ్యక్తి పై ప్రివెంటివ్ డిటెన్షన్ ( PD) యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు పాల్పడుతూ వారి వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ SC /ST కేసులు పెడుతనాని బెదిరింపులకు పాల్పడుతూ , మహిళలను మానసికంగా, శారీరకంగా బెదిరిపింపులకు పాల్పడుతున్నడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి పై కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించించిన పోలీసులు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నిందితునిపై PD నెంబర్ 6/PD -Cell / RCKD/2024 యాక్ట్ వలిగొండ మండలం వేముల కొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి పై PD చట్టాన్ని ప్రయోగించిన రాచకొండ పోలీసులు... * *నిందితున్ని నల్గొండ సబ్ జైల్ నుండి చర్లపల్లి జైల్ కు తరలించిన రాచకొండ పోలీసులు పోలీసులు.

VijayaKumar

Jun 27 2024, 17:57

వలిగొండ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి వేముల నాగరాజు SFI జిల్లా ఉపాధ్యక్షులు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ వినతిపత్రం వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలన్నారు ఒక పాఠశాలలో ఒక రేటుగా అంగట్లో సరుకుల ఏ స్కూలుకు తోసిన ఫీజు ఆ స్కూలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు వెంటనే ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేసి పేద మధ్య తరగతి తల్లిదండ్రులని ఆదుకోవాలని అన్నారు మరియు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్లో ద్వారా ఫీజు నిర్ణయాలు చేయాలన్నారు పాఠశాల యజమాన్యం వాళ్ళు ఇష్టానుసారమైన ఫీజులు నిర్వహించడం తల్లిదండ్రులు కట్టడం కాకుండా పేరెంట్స్ మీటింగ్లో వారు కట్టే స్తోమత తగిన ఫీజులు నిర్ణయం చేయాలన్నారు అదేవిధంగా మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలుగా పుస్తకాల పేరుతో స్టేషనరీ వ్యాపారం నడిపిస్తున్నారన్నారు ప్రభుత్వ మాత్రం చోద్యం చూస్తున్నట్టు విహరిస్తామన్నారు అని వారు విమర్శించారు మండల విద్యాధికారి వెంటనే అన్ని పాఠశాలలు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్ముతున్న పాఠశాలను సీజ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ ఏసోఫ్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 17:49

ఆదర్శమూర్తి, అసాధారణ ప్రతిభాశాలి హెల్లెన్ కెల్లర్; ధరణికోట నరసింహ VHPS జిల్లా అధ్యక్షులు

చిన్న తనం నుంచే మూడు రకాల వైకల్యాలను జయించి, అసాధారణ ప్రతిభను కనబర్చిన హెల్లన్ కెల్లర్ జీవితం మనకు ఆదర్శం కావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులధరణికోట నర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో జరిగిన "హెల్లన్ కెల్లర్" 144 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్లన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు,మూగ, అంధత్వం కల్గి ఉన్నా, అధైర్య పడకుండా ఆమె వికలాంగుల, మహిళల హక్కుల కోసం కృషి చేసారని ఆయన అన్నారు. హెల్లన్ కెల్లర్ రచయితగా, సంఘసంస్కర్త గా చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జాగిళ్ళపురం అయిలయ్య, నాయకులు వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 15:59

వలిగొండ: హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం డిమాండ్

వలిగొండ తొర్రూర్ డబుల్ రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటుచేసిన డివైడర్ కు ఎలాంటి హెచ్చరికల బోర్డులు,స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ వలిగొండ నుండి తిరుమలగిరి వరకు నిర్మించిన డబల్ రోడ్డు నిర్మాణం లో భాగంగా వలిగొండ అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన డివైడర్ ముగింపులో ఎలాంటి హెచ్చరికల బోర్డు మరియు స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఒక టాటా ఏసీ బండి డివైడర్ పైకి ఎక్కిన పరిస్థితి ఉందన్నారు పాఠశాల ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వెళ్తుంటారని స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం ఉందని వెంటనే రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డివైడర్ ముగింపులో హెచ్చరిక బోర్డును మరియు పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం,మండల నాయకులు రాధారపు మల్లేశం, కొండూరు సత్తయ్య,రంగారెడ్డి, సలిగంజి మురళీ కృష్ణ,నర్సింహ,ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 14:17

భువనగిరి: రైలు కిందపడి బస్వాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత పాండు మద్యానికి బానిస అయినందున, కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

VijayaKumar

Jun 27 2024, 14:13

చౌళ్ళ రామారం లో కల్వర్టు, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమిటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామంలో జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం & స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల నుండి కల్వర్టు మరియు సిసి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, అడ్డ గూడూరు జడ్పిటిసి శ్రీమతి శ్రీరాముల జ్యోతి అయోధ్య , ఎంపీపీ శ్రీ దర్శనాల అంజయ్య , BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 20:07

భువనగిరి పట్టణంలో ఎనిమిదో వార్డులో శానిటేషన్ పనులు పరిశీలించిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో కౌన్సిలర్ పంగరెక్క స్వామి బుధవారం శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డులో  గల డ్రైనేజీ కాలువల చుట్టూ ఉన్న చెత్తని మున్సిపల్ సిబ్బంది తో తీయించారు. వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారం శుభ్రం చేయించారు. వర్షాకాలంలో సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



.