Jun 27 2024, 15:59
వలిగొండ: హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం డిమాండ్
వలిగొండ తొర్రూర్ డబుల్ రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటుచేసిన డివైడర్ కు ఎలాంటి హెచ్చరికల బోర్డులు,స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ వలిగొండ నుండి తిరుమలగిరి వరకు నిర్మించిన డబల్ రోడ్డు నిర్మాణం లో భాగంగా వలిగొండ అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన డివైడర్ ముగింపులో ఎలాంటి హెచ్చరికల బోర్డు మరియు స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఒక టాటా ఏసీ బండి డివైడర్ పైకి ఎక్కిన పరిస్థితి ఉందన్నారు పాఠశాల ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వెళ్తుంటారని స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం ఉందని వెంటనే రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డివైడర్ ముగింపులో హెచ్చరిక బోర్డును మరియు పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం,మండల నాయకులు రాధారపు మల్లేశం, కొండూరు సత్తయ్య,రంగారెడ్డి, సలిగంజి మురళీ కృష్ణ,నర్సింహ,ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Jun 28 2024, 16:59