నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 16:11

ప్రజా భవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

ప్రజాభవన్‌ వద్ద ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు.

పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్మికులు తరలివచ్చారు.

కాగా, ప్రజావాణి కార్య క్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్ల వారుజాము నుంచే ప్రజా భవన్‌ వద్ద బారులు తీరారు.

ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 16:07

ఓడిన మేము ప్రజల వెంటే ఉంటాం : ఎమ్మెల్యే హరీష్ రావు

ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు

మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హ‌రీష్ రావు.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిం చుకోవడం చాలా సంతోషం గా ఉందన్నారు.ఇక కాంగ్రెస్ నేత‌ల తీరును ఎండ‌గ‌డు తూ, కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నా రని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవే ర్చాలన్నారు.

బీఆర్‌ఎస్ చేసిన అభివృ ద్ధిని కక్షతో అడ్డుకుంటు న్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని తేల్చి చెప్పారు..

తెలంగాణ కెసిఆర్ తేవ‌డం వ‌ల్లే ప‌థ‌కాలు వ‌చ్చా యి..నీళ్లు వ‌చ్చాయి..

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని అన్నారు..

కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్‌ను తెలం గాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామాలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది,

రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్‌ అని గుర్తు చేశారు.

ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతామని పేర్కొ న్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెం బ్లీలో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.

ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:56

నేడు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.

పార్టీ సమావేశాలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఈ రోజు రాత్రి లోపు సమావేశం కాను న్నారు.

అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నా రు. ఆదివారం ఉదయం భారత్ జోడ్ న్యాయ్ యాత్రలో పాల్గొంటారు.

స్విట్జర్లాండ్ లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొంటారు. పది రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నారు

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:54

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health ministry) శుక్రవారం వెల్లడించింది..

ప్రస్తుతం దేశంలో 3,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,446) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:52

భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు

మధ్యప్రదేశ్ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పునిచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఈ మేరకు జస్టిస్ షీల్ నాగ్, వినయ్ సరాఫ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ తీర్పును వెల్లడించింది...

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:49

నేటినుండి తెలంగాణ స్కూళ్లకు సెలవులు

తెలంగాణలో నేటి నుండి సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి.

కాగా.. జనవరి 13వ తేదీ 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వచ్చాయి.

మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది.

అలాగే.. ఈనెలలో జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోరెండు రోజులు వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి...

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 11:14

వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు

చర్చనీయ వంశంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి.

శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈరోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. సినిమా విడుదల ఆగి పోవడం వల్ల కోట్ల రూపా యల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.

ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపి వేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే...

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 11:13

తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని 16 నెంబరు మూలమలుపు వద్ద ఈరోజు ఉదయం ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సు డీ కొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది.

మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి గా పోలీసులు గుర్తించారు.

ఈరోజు తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహ నంలో త్రిబుల్ రైడింగ్ తో వస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం.జరిగినట్టు తెలిసింది.

తీవ్ర గాయాలైన జ్యోతి అనే మహిళ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించ గా.పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 11:11

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పండంటి బిడ్డను ప్రసవించిన సంఘటన గురువారం కర్నాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా బాగేపల్లి గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షయల్ పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు.

కడుపులో నొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా కడుపులో బిడ్డ ఉందని గుర్తించడంతో పాటు ఎనిమిది నెలల అని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

నొప్పులు ఎక్కువ కావ డంతో మగ బిడ్డకు బాలిక జన్మనిచ్చింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సీనియర్ విద్యార్థి పేరు చెప్పింది.

సదరు విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను కాదని చెప్పడంతో మరో విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించారు.

బాలిక చెబుతున్న మాటల్లో నిలకడలేకపోవడంతో విచార చేసి బాధ్యులిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాధి కారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వార్డెన్ ను సస్పెండ్ చేశారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 10:02

తెలంగాణలో కొనసాగుతున్న అవిశ్వాస తీర్మానాల పర్వం

రాష్ట్రంలో అధికారం మారడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు తమ పద వులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుతు న్నారు.

ప్రతి జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో రాజకీయం వేడెక్కింది. పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం సభ్యులు మద్దతు తెలుపడంతో అవిశ్వాసం వీగిపోయింది.

జెడ్పీటీసీలు. గత ఏడాది డిసెంబర్ 28న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మెజార్టీ జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. అయితే నిన్న ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీ టీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరగా.. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

మెజార్టీ సభ్యుల అసమ్మ తితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపా లిటీలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీ నామా చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఛైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతకే మద్దతు తెలపాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిసైడ్‌ అయ్యారు. దీంతో అవిశ్వా స తీర్మానం వీగిపోనుంది.

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై 11 మంది సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వి.వెంకటా యపాలెం సొసైటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు కూరాకుల నాగ భూషణం. సహకార శాఖ అధికారికి అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశారు.

సహకార సంఘం చట్టం ప్రకారం సహకార సంఘంలో ఉన్న సభ్యులకు నోటీసులు ఇచ్చి సొసైటీ ఛైర్మన్ఎన్ని కలు నిర్వహిస్తామన్నారు...