చట్టసభల్లో మహిళల వాటా సాధిద్దాం ఐద్వా
•జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ టౌన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఐద్వా రాష్ట్ర పిలుపుమేరకు ఒకరోజు సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాజకీయ కుట్రను ఎదిరిస్తాం.
పోరాటాల ద్వారా హక్కులను సాధించుకొని అన్ని రంగాలలో ముందుకు వస్తుంటే, ఏదో ఒక రకంగా మహిళలను అనేక రూపాలలో కులం మతం పేరుతో అనగదొక్కటానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనటానికి మహిళలు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ సాధించుకోవాలన్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంతోషకరమైన విషయం కానీ, ఆరు మూల మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు ఈ అవకాశం అందటం లేదు.
అలాగే మహిళలకు అన్ని బస్సుల్లో కూడా అవకాశం కల్పిస్తే ఉంటుందన్నారు. అలాగే మిగతా అన్ని పథకాలు ప్రభుత్వం వెంటనే అమలుపరచాలన్నారు. ఈ సభ్యత్వం లో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ అలాగే పెరిగిన నిత్యవసర ధరల గురించి నిరసనలు ధర్నాలు చేస్తుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల పద్మ భూతం అరుణకుమారి పాల్గొన్నారు.


























Jan 08 2024, 17:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.4k