చింతపల్లి ఎస్ఐ పై సస్పెండ్ వేటు
నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్,
చింతపల్లి పీఎస్ పరిధి లోని పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని, భూ సంబంధిత వ్యవహారంలో చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి జోక్యం చేసుకొని చావబాదినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు.
ఎస్సై దాడితో సూర్య నాయక్ అక్కడిక్కడే మృతి చెందగా హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం ను అడ్డుకొని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నిన్న జరగగా, నేడు ఎస్సై సతీష్ రెడ్డి పై సస్పెండ్ వేటు పడింది.
భూ వివాదంలో తలదూర్చి అతి ఉత్సాహం చూపించిన ఎస్సై ని ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.



నల్లగొండ: ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలలో పాల్గొనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా.. నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎన్నికయ్యాడని, ఎం.జి.యూ ఫిజికల్ డైరెక్టర్ మురళి మరియు శ్రీనివాసరెడ్డి లకు క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపాడు.







Dec 11 2023, 22:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.1k