బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తాం: బిఎస్పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా:
నార్కట్ పల్లి మండలం లో ఎన్నికల ప్రచారాన్ని బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ప్రారంభించారు. నార్కట్ పల్లి మండలం కొండకిందిగూడెం, కొండపాకగూడెం, పోతినేనిపల్లి గ్రామాల్లో గడప గడప కు బొట్టు పెట్టుకుంటూ, ఈ సారి ఏనుగు గుర్తుకు ఓట్ వేసి తనను గెలిపించి అసెంబ్లీ కి పంపిచాలని కోరారు.
ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని చెబుతున్నారు.
ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. ఈ సారి నకిరేకల్ గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీట్ తుమ్హరా.. నహీ ఛలేగా’ అంటున్నారు. బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, శేఖర్, వనజ, సంతోష,రమేష్,శేఖర్, మస్తాన్,మహేష్, యోగి, ఉదయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA












Oct 30 2023, 10:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.6k