నిజంనిప్పులాంటిది

May 07 2023, 17:13

పాట్నా హైకోర్టు స్టే బీసీలను కించపరచడమే...

--- బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్.

బీహార్‌లో కుల గణాంకాలపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీల మనోభావాలను కించపరచడమేనని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్ మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2021 సంవత్సరంలో జరగాల్సిన వెనకబడిన కులాల జనాభా లెక్కల సేకరణ కరోనా మహ్మమారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపక్షాలతో ప్రధాని మోదీని కలిసి కులగణాంకన జరపాలని విన్నవించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నేటికీ కులగణన చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయించారని, దీనిపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం భాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

1931లో నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన జనాభా గణన కులాల వారీగా చేశారని, కానీ అప్పటి నుంచి నేటి వరకు కులగణన జరగలేదని వివరించారు. మండల కమీషన్ సిఫారసులో భాగంగా ఎస్సీ, ఎస్టీ తరహాలో ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

ఓబీసీలకు జరిగే అన్యాయంపై రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీసీలు ఏకమై... బీసీ జనాభగణనపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 17:03

Bihar | పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు జరిపిన సర్పంచ్ భర్త..

పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఓ సర్పంచ్ భర్త తుపాకీతో హల్ చల్ చేశాడు. పెళ్లి వేదికపై అటు ఇటు తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు..

పాట్నా దిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని నక్తా దియారా సర్పంచ్ భర్త విమల్ రాయ్.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక ఆ వేదికపై కొంత మంది మహిళలు డ్యాన్సులు చేస్తుండగా, విమల్ రాయ్ తన చేత్తో తుపాకీ పట్టుకుని హల్‌చల్ చేశాడు. గాల్లోకి మూడు, నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు.

అయితే అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. గతంలోనూ విమల్ రాయ్ ఇలాంటి ఘటనలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 17:01

NEET Exam 2023: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభం..

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ప్రారంభమైంది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది..

తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40వేల మంది పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 16:58

సినీ డైరెక్టర్​గా మారిన తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారి

•శ్రియ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’ను తెరకెక్కించిన బియ్యాల పాపారావు

•తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ నెల 12న విడుదల

•నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్

సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ప్రకాష్ రాజ్, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఉంది. దీన్ని మాజీ ఐఏఎస్ బియ్యాల పాపారావు తెరకెక్కించడం విశేషం.

ఏపీ, తెలంగాణలో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన దర్శకుడిగా మారి ఈ సినిమాను తీశారని తెలిసి ఆశ్చర్యపోయానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చాలామందిలో బయటికి కనిపించని ప్రతిభ ఉంటుందని, అలాంటి వారిని మనం ప్రోత్సహించాలనే సందేశంతో ఈ చిత్రం తీసిన పాపారావుకు అభినందనలు తెలిపారు. ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ఈవెంట్ వేదికగా తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నానని కోరారు.

వెంటనే స్పందించిన ఇళయరాజా ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే తాను రెండు వందల మంది ఇళయరాజాలను తయారుచేస్తానని చెప్పారు. ఐఏఎస్‌గా పనిచేసిన తర్వాత మెగా ఫోన్ పట్టుకోవడం తనకు చాలా కొత్తగా అనిపించిందని పాపారావు అన్నారు. పదకొండు పాటలు కావాలని ఇళయరాజా దగ్గరకు వెళ్తే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఆయన మ్యూజిక్ చేయనంటే ఈ సినిమా ఉండేది కాదని పాపారావు చెప్పారు.

నిజంనిప్పులాంటిది

May 07 2023, 16:54

పదోతరగతి ఫలితాల్లో ఆరోతరగతి విద్యార్థి తన సత్తా చాటింది

ప్రతిభ ఉంటే తరగతితో సంబంధం లేదంటూ ఆ చిన్నారి నిరూపించింది. ఏకంగా ఆరో తరగతి చదువుతూనే, పదోతరగతి పరీక్షలు రాసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ముప్పల హేమ శ్రీ చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుంది.

దీంతో ఈమె టాలెంట్‌కు ఫిదా అయిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు. దీంతో శనివారం వెలువడిన ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాల్లో హేమ శ్రీ తన సత్తాచాటింది. 488 మార్కులతో ఔరా అనిపిస్తుంది. దీంతో ఈ చిన్నారి తెలివి తేటలు చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 14:00

Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌..

HYD..

రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ..

ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు..

కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు..

వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం

చేసుకున్నారు..

కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు..

మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు..

యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..

నిజంనిప్పులాంటిది

May 07 2023, 13:58

ప్రకాశం ముండ్లమూరులో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారంనాడు ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..

రెండు సెకన్ల పాటు భూమి కంపించింది..

భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 13:57

కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు..

ఢిల్లీ..

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 2380 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,69,630 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 27,212 కు చేరింది..

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 21 మంది చనిపోయారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 13:53

సిద్దిపేట జిల్లాలో మంత్రుల పర్యటన

సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం పర్యటించారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులో నూతన పశువైద్య కళాశాల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొననున్నారు.అంతేకాకుండా పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 13:51

గూండాయిజం చేసినట్లు ప్రూవ్ చేస్తావా.. ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్

తాను గుండాయిజం చేసినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ప్రూవ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు.

ఈ మేరకు పాడి కౌషిక్ రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసురుతున్నా.. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?’ చెప్పాలని సవాల్ చేశారు. ఆరోపణలు చేయడం తగదని, తాను ఏం గూండాయిజం చేశానో చెప్పాలన్నారు. ‘‘నేను ఎవరినైనా కొట్టిన్నా? ఎవరినైనా తిట్టిన్నా? ఎవరి ల్యాండ్ అయిన కబ్జా చేసిన్నా? ఏం చేసినా? అని మండిపడ్డారు. తాను అక్కడ సెక్రటరీని తిట్టినట్లు ఒప్పుకున్నాడు.

ఎందకు తిట్టారంటే జూపాక విలేజ్‌లో మోరీ ప్రాబ్లం ఉందని ఒక ఐదారు సార్లు చెప్పిన.. పని చేయకపోతే ఏమంటారు? అని అన్నారు. పేద ప్రజలు, పేద మహిళలు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పని చేయండని మంచిగా చెప్పాను అతను వినలేదన్నారు. వినకపోతే గట్టిగా చెప్పాలా వద్ద.. గట్టిగా చెప్పిన తర్వాతనే పరిష్కారం అయ్యిందన్నారు. సమస్య పరిష్కారం అవ్వడంతో నేడు జూపాక ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని పేర్కొన్నారు.

SB NEWS

SB NEWS