తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:53

వినేశ్‌.. పంట పండింది!

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌ వ్యాల్యూ కూడా భారీగా పెరిగింది. ప్యాకేజింగ్‌ ఫుడ్‌, హెల్త్‌, న్యూట్రిషన్‌, జ్యుయెలరీ, బ్యాంకింగ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా పలు రంగాలకు చెందిన కంపెనీలు అథ్లెట్లతో ఒప్పందాలు చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.

పారిస్‌కు ముందు ఫొగట్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు రూ. 25 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగిందని ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పాడు. పతకం నెగ్గకపోయినా.. ఆమె చూపిన ధైర్యం, హుందాతనం అందరి హృదయాలను గెలుచుకొందన్నాడు. విశ్వక్రీడల్లో 50 కిలోల విభాగం ఫైనల్‌ ముందు 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందనే కారణంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. నైకీ, కంట్రీ డిలైట్‌తో ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందే అగ్రిమెంట్‌ చేసుకొంది. ఇక, రజతం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్‌ మను భాకర్‌కు కూడా భారీ డిమాండ్‌ నెలకొంది. చోప్రా బ్రాండ్‌ వాల్యూ 30 నుంచి 40 శాతం దాకా పెరిగి.. సుమారు రూ. 330 కోట్లకు చేరుకొందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో క్రికెటర్ల తర్వాత చోప్రాకే ఎక్కువ పాపులారిటీ అనడంలో సందేహం లేదు. నీరజ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు గతంలో రూ. 3 కోట్లు ఉంటే.. మెగా క్రీడల తర్వాత రూ. 4 నుంచి 4.5 కోట్లకు పెరిగిందట. మరోవైపు యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకొన్న భాకర్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకొనేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. గతంలో ప్రకటనల కోసం ఏడాదికి రూ. 25 లక్షలు మను తీసుకునేది. అయితే, అదిప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి రూ. 1.5 కోట్లకు చేరిందని టాక్‌.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:49

సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు. రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నర్సింహాస్వామిని వేడుకున్నానన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదన్నారు.

రైతు భీమా, రైతు బంధు, చెరువులు నింపిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..? ప్రశ్నించారు. ‘‘పోలీసులను హెచ్చరిస్తున్న.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు’’ అని అన్నారు. చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫి చేయిస్తామని స్పష్టం చేశారు. మోసం రేవంత్ రెడ్డి ది, పాపం కాంగ్రెస్ పార్టీది అంటూ హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రులవి తలోమాట అన్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేక గందరగోళం ఏర్పడిందన్నారు.

రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఒట్టేసి ప్రమాణాలు చేసిన సీఎం మాట తప్పారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ అందేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే 40% రుణమాఫీ అందుతుందన్నారు. తాము రైతుబంధు పథకంలో 72వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రుణమాఫీ విషయంలో తాము కాంగ్రెస్ నాయకులలాగా హామీలు ఇవ్వలేదన్నారు. ఇంకా 22లక్షల మంది రైతులకు రుణమాఫీ అందేవరకు వానాకాలం రైతు భరోసా పంటలు కోతకు వచ్చినప్పుడు ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:45

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకు సీబీఐ సంచలన రిపోర్ట్‌

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది.

రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సీజేఐ డివై చంద్ర చూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. లోకల్ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు.

సీబీఐ అందజేసిన సీల్డ్ కవర్ స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరుఫున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 15:32

రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ..

రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది

రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది.

రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 15:26

అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని.. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు.. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. అయితే ఒకే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని.. భద్రతపై పరిశ్రమలు, కార్మిక శాఖలు, అగ్నిమాపక విభాగంతోపాటు సంబంధిత విభాగాలన్నీ సమన్వయ సమావేశం నిర్వహించి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు గాయపడినవారు కోలుకునే వరకూ ఆర్థికసాయం అందించాలన్నారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం జగన్‌ పరిశీలిస్తారని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. అక్కడ వైద్యం కొనసాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్యుతాపురం వెళుతున్నారు.

మరోవైపు ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 106(1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు. ఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయగా.. నిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి అంశాలపై సెక్షన్లు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడినవారికి ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగుతోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు మరికాసేపట్లో అనకాపల్లి జిల్లాకు వెళ్లబోతున్నారు. అక్కడ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.. గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 12:50

చెరువులు వెలవెల.... చేపల పంపిణీ ఎలా..?

నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి...

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు ముగుస్తున్నప్పటికీ చెరువులు నిండకపోవడంతో మత్స్య రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఆందోళన గురవుతున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు భారీ వర్షాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇప్పటికే జలకళ ఉండాల్సిన చెరువులు వెలవెల పోతున్నాయి. చేపల పంపిణీ సందిగ్ధంలో పడింది.. ఇలా ఉంటే ఇప్పటికే టెండర్ పూర్తయి చేపల సరఫరా చేసే కార్యక్రమం దాదాపు పూర్తి కావాల్సి ఉండే..... కానీ ఉమ్మడి జిల్లాలో టెండర్ వేశారు కానీ వాటిని ఓపెన్ చేయలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా చేప పిల్లలు పంపిణీ చేసే చెరువులు సుమారు 2484 ఉన్నాయి. అందులో దాదాపు 12 కోట్లకు పైగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మూడు జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 700 చెరువులు, నల్గొండ జిల్లాలో 1163 చెరువులు, 621 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రెండు రకాల చేప పిల్లలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది అందులో 80-100 ఎంఎం, 35 నుంచి 40 ఎంఎం ఉన్నాయి... ప్రతి ఏటా కూడా ఈ సైజు చేప పిల్లలే పంపిణీ చేస్తుంటారు

చెరువులలో సరఫరా చేయడానికి ప్రతి ఏటా కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆయా జిల్లాల స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మూడు జిల్లాలో జూలై నుంచి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం వరకు టెండర్ దాఖలు దశ ముగిసింది. దరఖాస్తులను ఓపెన్ చేయలేకపోవడం ఒకటే మిగిలింది. అయితే నల్గొండ జిల్లాలో సుమారు 6 కోట్ల చేప పిల్లలు సరఫరా చేయడానికి కేవలం నలుగురు కాంట్రాక్టర్లు, సూర్యాపేటలో 3.41కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఐదుగురు కాంట్రాక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు మాత్రమే టెండర్ దాఖలు చేశారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జూన్ జూలై మాసాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ వర్షం జాడే కనిపించకుండా పోయింది.ఆగస్టులోనే భారీ వర్షాలు ఉన్నాయని భావించారు కానీ అది జరగలేదు. ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా నాగార్జున సాగర్,మూసీకి జలకళ వచ్చింది. మిగతా ప్రాంతాల్లో ఉన్న చెరువులు నీటి జాడ కనిపించలేదు. ప్రస్తుతం చెరువులో ఉన్న మీరు కూడా సాగునీటి కోసం వాడితే ఆ మాత్రం నీరు కూడా మిగలదు. గతంలో చేపల కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డ కాంట్రాక్టర్లు ఈసారి చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం గతంలో చేసిన కాంట్రాక్టుకు బిల్లులు రాకపోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేప పిల్లల సరఫరాకు చెల్లించి ధర గిట్టుబాటు కావడం లేదని కారణమని సమాచారం..ఏది ఏమైనా ఈసారి ఉచిత చేపల పంపిణీ అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 12:43

బతుకమ్మకుంటను బతికిస్తాం...

అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు.

అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. బతుకమ్మకుంట స్థలాన్ని రక్షించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ కార్పొరేటర్‌ జ్ఞానేశ్వర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కమిషనర్‌ బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు లేఅవుట్‌, చుట్టుపక్కల కాలనీలు తదితరాంశాలను తెలుసుకున్నారు. బతుకమ్మకుంట చెరువు, రికార్డులు, కోర్టు కేసులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే చర్యలు చేపడతామని కమిషనర్‌ వివరించారు.

త్వరలో వచ్చే బతుకమ్మ పండుగ లేదా వచ్చే ఏడాది నాటికి బతుకమ్మకుంట చెరువును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గోల్నాక డివిజన్‌ హుస్సేన్‌సాగర్‌ నాలా బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, పార్టీ నేతలు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న భవనాలను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. నార్సింగి మున్సిపల్‌ పరిధిలోని విజయనగర్‌ కాలనీలో ఓ నిర్మాణదారుడు నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకొని ఆరు అంతస్తులు నిర్మించాడు. సమాచారం అందుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అలాగే మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో రెండోరోజు కూల్చివేతలు కొనసాగాయి. మంగళవారం పాక్షికంగా కూల్చిన భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతోపాటు మరోమూడు విల్లాలను బుధవారం కూల్చివేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 12:34

కృష్ణా వరదలకు అమరావతి మునిగిపోతుందా ? వరల్డ్ బ్యాంక్ ప్రశ్నకు సర్కార్ సమాధానమిదే..!

ఏపీ రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న వేశాయి. రెండు రోజులుగా అమరావతి రాజధానిలో పర్యటిస్తున్న ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు పలు విషయాలను సీఆర్డీఏ అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కీలక ప్రశ్నను వారికి సంధించాయి. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని అమరావతి వంటి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతంలో కట్టడం సరికాదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పేవారు. చివరికి అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. చివరికి అది కాస్తా కోర్టుల పరిధిలోకి వెళ్లిపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో తిరిగి అమరావతిలోనే రాజధాని నిర్మాణం కోసం పావులు కదులుతున్నాయి. అయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా అదే ప్రశ్న వేసింది.

అమరావతికి కృష్ణావరదలతో ఉన్న ముప్పును వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏడీబీ ప్రతినిధులు ప్రశ్నించారు. కృష్ణానది వరదల వల్ల రాజధానికి ముంపు ముప్పు ఉందా అని సీఆర్డీఏ అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి వారు నేరుగా స్పందించలేదు. కరకట్టలు అయితే పటిష్టంగా ఉన్నాయని, ఎప్పుడూ ముంపు సమస్య ఎదురుకాలేదని మాత్రం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారుల చెప్పారు. దీనిపై వారు సంతృప్తి చెందారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో ఎలాగో తేలిపోనుంది.

గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాక వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ అనుకూల రైతులు.. ఇక్కడ రాజధాని కడితే కృష్ణావరదలకు మునిగిపోతుందని ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతికి రుణం అక్కర్లేదని చెప్పేయడంతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అప్పట్లో తమ నిర్ణయాలను సవరించుకున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 10:10

లక్షల కార్లు షోరూమ్‌ల్లోనే..

ప్రయాణికుల వాహనాల అమ్మకాలు నీరసించాయి. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67

దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67 రోజుల అమ్మకాలకు సరిపడా నిల్వలు ఉంటే, ఇప్పుడది 70-75 రోజులకు చేరింది. కంపెనీలు ఎడాపెడా ఉత్పత్తి పెంచేయడం, అధిక వడ్డీరేట్లు ఇందుకు ప్రధాన కారణమంటున్నారు.

సాధారణంగా డీలర్ల వద్ద కార్ల నిల్వలు నెల రోజులకు సరిపడా ఉంటాయి. ఇప్పుడది 70-75 రోజులకు పెరిగి పోయింది. దీంతో డీలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. వర్కింగ్‌ కాపిటల్‌ అవసరాలు పెరిగిపోయి వడ్డీల భారం పెరిగి పోతోంది. ఈ పరిణామంతో కొంత మంది డీలర్లు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని ఫాడా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్ల కంపెనీలు రిటైల్‌ అమ్మకాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి వ్యూహం మార్చుకుని సరఫరాలు తగ్గిస్తే, ఈ పరిస్థితి నుంచి కొంత వరకు బయట పడవచ్చని డీలర్లు చెబుతున్నారు.

పరిస్థితి నుంచి బయట పడేందుకు కార్ల కంపెనీలే తమను ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు. నెల రోజులకు మించి ఉండే నిల్వల నిర్వహణకు అయ్యే వర్కింగ్‌ కాపిటల్‌ వడ్డీ ఖర్చులైనా కంపెనీలు భరించాలని కోరుతున్నారు. లేకపోతే ప్రస్తుత కష్టాల నుంచి బయట పడడం డీలర్లకు కష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు పేరుకుపోయిన వాహన నిల్వల అమ్మకాల కోసం కంపెనీలు ప్రత్యేక పథకాలు, డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రవేశ పెట్టాలని డీలర్లు కోరుతున్నారు.

డీలర్లు ఇన్ని కష్టాల్లో ఉన్నా కార్ల కంపెనీల నుంచి పెద్దగా స్పందన లేదు. నిల్వలు పేరుకుపోవడం పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. ఇటువంటి ఆటోపోట్లు ఏర్పడుతూనే ఉంటాయని తేలికగా తీసిపారేసింది. అయితే డీలర్లు ఆర్థికంగా బాగుండడం, కంపెనీలకే మంచిదని మాత్రం అంగీకరించింది. డీలర్ల వద్ద పేరుకు పోయిన వాహనాల నిల్వలను వదిలించేందుకు ఆయా కంపెనీలే బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం మంచిదని సియామ్‌ తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 10:05

హైదరాబాద్‌లో వందెకరాల భూమి, ఆఫీసులు అమ్మేస్తున్న ఐటీ దిగ్గజం.. వందల కోట్ల డీల్.. గండిమైసమ్మ దగ్గర ఇంత రేటా?

భారత దిగ్గజ ఐటీ సంస్థలకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆఫీసులు, భూములు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కొన్ని కొన్ని సార్లు చేతులు మారుతుంటాయి. అంటే క్రయవిక్రయాలు జరుపుతుంటాయి. ఇప్పుడు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు చెందిన 103 ఎకరాల విస్తీర్ణంలోని భూమి చేతులు మారనుంది. ఇందుకోసం రూ. 535 కోట్లకు డీల్ కుదుర్చుకుంది.

హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్ అడ్డా అని చెప్పొచ్చు. ఈ విశ్వనగరంలో కొంతకాలంగా భూములు, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్ని తలదన్నేలా ఇక్కడ డీల్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. గతేడాది కోకాపేటలో ఎకరం రూ. వంద కోట్లు పలికిన సంగతి తెలిసిందే. అప్పుడు దేశమంతా హైదరాబాద్ వైపు చూసింది. ఆ తర్వాత ఇంకెన్నో వందల కోట్ల డీల్స్ జరిగాయి. ఇది తర్వాత్తర్వాత సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ .. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఇక ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో దిగ్గజ ఐటీ సంస్థ అతిపెద్ద డీల్ చేసుకుంది.

హైదరాబాద్ గండిమైసమ్మ దగ్గర్లోని బహదూర్‌పల్లిలోని 103 ఎకరాల మేర విస్తరించి ఉన్న భూమిని టెక్ మహీంద్రా రూ. 535 కోట్లకు విక్రయించేందుకు డీల్ చేసుకుంది. ఇందులోనే సుమారు 1.26 మిలియన్ చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న 17 బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆగస్ట్ 20న దీనికి సంబంధించి ఒప్పందం ఖరారైంది. ఇక డీల్‌ను మహీంద్రా యూనివర్సిటీతోనే కుదుర్చుకోవడం విశేషం.

రూ. 535 కోట్లకు అదనంగా టాక్సులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, కన్వర్షన్ ఛార్జీలు, ఇంకా వర్తించే ఏవైనా ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇక ఈ మొత్తాన్ని ఏకకాలంలో కాకుండా.. నాలుగేళ్లలో చెల్లించేలా ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు ఇరుపార్టీలు అంగీకరించాయి. వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వడ్డీ రేటుతో చెల్లించేందుకు ఒప్పుకున్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా.. ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.మహీంద్రా యూనివర్సిటీని సమాజ అభివృద్ధిపై దృష్టి సారించే స్వయం ప్రతిపత్త సంస్థగా ఏర్పాటు చేయడమే ఈ విక్రయం వెనుక లక్ష్యమని టెక్ మహీంద్రా తెలిపింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్- 2018 అనుగుణంగా స్థాపించిన విశ్వవిద్యాలయం మహీంద్రా యూనివర్సిటీ. ఇక దీనికి మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పాన్సరింగ్ బాడీగా ఉంది. ఈ డీల్ నేపథ్యంలోనే టెక్ మహీంద్రా షేరు ఇటీవల పుంజుకుంది. ఆగస్ట్ 20న 2 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం రూ. 1600 లెవెల్స్‌లో ఉంది. మార్కెట్ విలువ రూ. 1.57 లక్షల కోట్లు కాగా.. స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 1633.65 గా ఉంది.