తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 21:19

నమ్మించి ముంచిన రియల్ రంగం ఐన జనని పుడమి

జనని, పుడమి పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి, వేలాదిమంది ప్రజల వద్ద 200 కోట్లు రూ. మోసం చేసిన వారి నుండి మోసపోయిన బాధితులను ప్రభుత్వం రక్షించాలి_ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అభ్యర్థన

 ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిట్యాల, బొమ్మలరామారం, యాదాద్రి తదితర చోట్ల జనని, పుడమి పేర్లతో వెంచర్లను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి డిపాజిట్ చేస్తే 3 రూపాయలు ఇస్తామని అంటే 5 లక్షలు డిపాజిట్ చేస్తే 15 లక్షలు అవుతుందని నమ్మాజుపి 200 కోట్ల రూ. జమ చేసుకొని జననిని ఎత్తివేసిన వారి నుండి ప్రజలను పోలీసు శాఖ రక్షించాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

 ఈరోజు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో జనని, పుడమి సంస్థల ద్వారా మోసపోయిన బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ప్రస్తుతం పుడమి పేరుతో నూతన వ్యాపారం సాగిస్తున్న రియాల్టర్ల వ్యవహారంపై గత మూడు మాసాల క్రితం పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించిందని, వారి యొక్క పరిశీలనను, విచారణను పూర్తి చేసి, అమాయక ప్రజల వద్ద వసూలు చేసిన 2 వందల కోట్ల రూపాయలను ప్రజలకు ఇచ్చి వేసే విధంగా పోలీసు శాఖ వ్యవహరించాలి. మోసం చేసిన రియల్టర్ల యొక్క ఆస్తులను, వారి యొక్క బినామీల పేరు మీద ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసి, వెంటనే అమాయకులైన బాధితులను రక్షించాలన PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు

 బాధితులంతా మూకుమ్మడిగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ను ముట్టడించడం, జిల్లా కలెక్టర్, జిల్లా SP కి మరియు రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారాన్ని అందజేసి న్యాయం పొందే వరకు సమైక్యంగా పోరాడాలని ఆయన కోరారు.

 పంతంగి గ్రామంలో జరిగిన బాధితుల సమావేశంలో BSP రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 20:21

కేంద్రం నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ సీరియస్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్త చేశారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం సన్నహాలు చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్‌లో భేటీలో 40 సవరణలు ప్రతిపాదించిందని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

తాము బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బిల్లుపై లీకులిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు.

కాగా, వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు.

వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉందని అన్నారు.

వారికి హిందూత్వ అజెండా ఉందని.. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో వక్ఫ్ బోర్డును చాలా చోట్ల దర్గాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారని అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 20:16

గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు.

భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టులో గవర్నర్ల అంశంపై ప్రస్తుతం నడుస్తున్న కేసులు విచారకరం అని పేర్కొన్నారామె.

తాజాగా బెంగళూరులో జరిగిన NLSIU-PACT సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న కీలక అంశాలపై ప్రసంగించారు. గవర్నర్ల తటస్థత గురించి రాజ్యాంగ సభ చర్చలలో జి దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను ఉటంకించిన జస్టిస్ నాగరత్న.. ‘గవర్నర్‌ను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత. పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదు’ అని అన్నారు.

గవర్నర్ల తీరుపై జస్టిస్ నాగరత్న ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో నల్సార్ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసంలోనూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ఒక రాష్ట్రానికి సంబంధించి బిల్లులను ఆమోదించడంలో లేదా వాటిపై అభిప్రాయాన్ని తెలియజేయడంలో గవర్నర్లు ఆలస్యం వహిస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తున్నారనే వ్యాజ్యాలు కోర్టుల్లో అధికమవుతున్నాయి.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాలి. తద్వారా న్యాయస్థానాల్లో ఇలాంటి వ్యాజ్యాలు తగ్గుతాయి. రాజ్యాంగం ప్రకారం వారి విధులను వారు నిర్వర్తించాలని చెప్పే సమయం ఆసన్నమైంది’ అని జస్టిస్ నాగరత్న అన్నారు.

పలు రాష్ట్రాల శాసన సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలిపేందుకు నిరాకరించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇటీవల కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ గవర్నర్‌లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలుపడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

వీటిని స్వీకరించిన ధర్మాసం.. నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు సంబంధించిన మరో పిటిషన్‌లో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు మినహాయింపు పరిధిని పరిశీలించడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గవర్నర్లు బిల్లులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని గతంలో సుప్రీంకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్‌పై కూడా సుప్రీంకోర్టు ఫైర్ అయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 15:20

మనందరినీ ఏకం చేసే ఒక కల.. న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది.

ఇవాళ న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. "కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను.

ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు.

మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

న్యూయార్క్‌ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి.

కాగా, ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు.

సీఎం పర్యటనలో భాగంగా ఇవాళ (సమయం 3:00 గంటలకు) న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణ ప్రజలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 15:18

మెట్రో రైలుకు బ్రేక్‌మరో అడ్డంకి

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కేలాలేదు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో మోనో రైలు నడుపుతామంటూ ప్రగల్భాలు పలికింది. అంతకు ముందు ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రివైజ్‌ చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరితే...నాలుగేళ్లు దానిని తొక్కి పెట్టి ఎన్నికల ముందు సమర్పించింది. దానిని పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. తాజాగా రాజ్యసభలో ఓ ఎంపీ విశాఖపట్నం మెట్రో రైలు పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దానికి దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. ప్రాజెక్టుకు రివైజ్డ్‌ డీపీఆర్‌ అయితే పంపించారు గానీ దానికి జత చేసిన కాంప్రెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ)కి కాలదోషం పట్టిందని, కొత్తది పంపాల్సి ఉందని తేల్చి చెప్పింది.

ఏమిటీ మొబిలిటీ ప్లాన్‌?

విశాఖ నగరంలో జనాభా, ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు, రహదారుల సంఖ్య, వాటి విస్తీర్ణం, వాహనాల సంఖ్య, వార్షిక పెరుగుదల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, మెట్రో రైలు ప్రాజెక్టుతో వాటికి అనుసంధానం ఎలా?...అనే వివరాలు సమర్పించేదే మొబిలిటి ప్లాన్‌

తెలుగుదేశం పార్టీ 2017లో విశాఖపట్నం మెట్రో రైలును ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2108లో అధ్యయనం చేసి మొబిలిటీ ప్లాన్‌ తయారుచేసింది. మొత్తం 42.54 కి.మీ. పొడవున ట్రాక్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అప్పట్లో రూ.8,300 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సమకూర్చాల్సిన రూ.4,200 కోట్లను దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని భావించారు. టెండర్లు పిలిచారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,300 కోట్లకు చేరింది. మొబిలిటీ ప్లాన్‌ కాల పరిమితి ఐదేళ్లు. 2018లో రూపొందించినది కాబట్టి దాని గడువు 2023తో ముగిసిపోయింది. ఈ ప్రాజెక్టు ఇంకా డీపీఆర్‌ పరిశీలనలో ఉన్నందున కొత్త మొబిలిటీ ప్లాన్‌ సమర్పించాలని కేంద్రం సూచించింది

ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్‌ సజావుగా సాగడానికి 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించగా జాతీయ రహదారుల సంస్థ వాటికి ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటికి టెండర్లను పిలిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున, ఆ ఫ్లైఓవర్లు, మెట్రో రైలు స్షేషన్లను ఇంటిగ్రేట్‌ చేస్తూ కొత్త ప్లాన్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు మెట్రో రైలు అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ల నిర్మాణం మంచిదా?, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తే మంచిదా? ఆలోచించి తనకు చెప్పాలని కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయాలని సూచించారు.

అంటే కేంద్రం కోరిన మొబిలిటీ ప్లాన్‌ కూడా ఇందులో కీలకం కానుంది. నగరంలో బీఆర్‌టీఎస్‌ రహదారులు, వాహనాల సంఖ్య, ఏయే జంక్షన్లలో ఎంతెంత ట్రాఫిక్‌ ఉంటున్నదీ కొత్తగా అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా మెట్రో రైళ్ల సంఖ్య, వాటికి బస్సుల అనుసంధానం వంటివి సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ పరిశీలించాకే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. అప్పుడు పీపీపీలో చేయడానికి ఎవరు ముందుకు వస్తారనేది తేలుతుంది. ఆ తరువాతే ప్రాజెక్టు ముందుకు వెళుతుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 15:16

పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కొంతమంది పింఛన్‌దారులు ఉపాధి లేదా ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే నివశిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారంతా ఒకటో తేదీ వస్తోందంటే పింఛన్ కోసం తిరిగి సొంతూర్లకు రావాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

లబ్ధిదారులు ప్రస్తుతం తాము నివసిస్తున్న లేదా తమకు కావాల్సిన చోటుకే పింఛన్లను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలో పెన్షన్ల బదిలీ ఆప్షన్‌ను ప్రస్తుతం ఓపెన్ చేశారు. దీనివలన పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసేందుకు వీలవుతుంది. అయితే పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో పింఛన్ ఐడీతో పాటుగా ఎక్కడికైతే బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర గుర్తింపు కార్డులు అవసరం అవుతాయని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4000 పింఛన్ అందిస్తోంది. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల కూడా ఆగస్ట్ ఒకటో తేదీనే 95 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక అంశాలు సహా ఇతరత్రా కారణాలతో ఒకటో తేదీ పంపిణీ చేయలేని వారికి రెండో రోజు అందజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒకటో తేదీనే అటు పింఛన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెప్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 12:41

ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్‌రావు.. తిహార్ జైలులో కవితతో ములాఖత్

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం కేటీఆర్, హరీష్‌రావు కలవనున్నారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం కేటీఆర్, హరీష్‌రావు కలవనున్నారు.

ఈ మేరకు వారిద్దరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా..

ఇప్పటిక చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. బలమైన సాక్షాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది.

కాగా, ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ల‌పై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

SB news

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 12:37

రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో తగలబడిన కోర్బా- విశాఖ రైలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా నుంచి వచ్చిన రైల్లో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ7 ఎం1 బోగీలు పూర్తిగా బూడిదకాగా...

రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణనష్టం జరగలేదు. ఈ రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా కడపకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనలో మొత్తం నాలుగు భోగీలు మంటల్లో కాలిపోయినట్టు అధికారులు తెలిపారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో దట్టంగా పొగలు కుమ్ముకున్నాయి.

దీంతో ప్రయాణికులను బయటకు పంపిన అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పుతున్నారు. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌‌కు ఉదయం చేరుకున్న రైలు.. నాలుగో నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై ఉండగా మంటలు చెలరేగాయి.

కాగా, ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరి వెళ్లనుంది. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. నిలిపి ఉన్న రైల్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఎటువంటి ప్రాణనస్టం జరగలేదు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. ప్రమాదంలో నాలుగు ఏసీ బోగీలు తగలబడినట్టు చెప్పారు. మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాాణికులను కిందకు దింపేసినట్టు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి చిన్న గాయం కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు.

దగ్ధమైన నాలుగు భోగీలను రైలు ఇంజిన్ నుంచి వేరుచేసి.. ట్రాక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. బెడ్ షీట్లు, ధర్మాకోల్, బెర్తులు కాలిపోయినట్టు వివరించారు. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు.. కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని అన్నారు. అయితే, మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ షర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

రైల్వే సిబ్బంది, విశాఖ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను అదుపుచేస్తూ.. మిగతా బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిని వెంటనే వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను పూర్తిగా అదుపుచేశారు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 12:35

వృద్ధుడి దారుణ హత్య.. రాళ్లు, కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు.

పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి..

ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో కొట్టడంతో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పాతకక్షలే కారణమని స్థానికులు అంటున్నారు. గ్రామంలో ఉద్రిక్తతగా ఉండటంతో పోలీస్ బలగాలు మోహరించాయి. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు.

SB news

SB news

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 12:32

కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని పాలకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలకు పనులు చేయాలంటే ఎంతో కొంత డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.

తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ఓ రైతు పహాణీ పత్రం కోసం వెళితే తహసీల్దార్ పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కాడం తిరుపతి అనే రైతు ఇటీవల తాను కొనుగోలు చేసిన భూమిని తండ్రి మల్లయ్య పేరిట పట్టా చేసుకోవడానికి పలుమార్లు తహసీల్దార్ జాహేద్ పాషాను సంప్రదించాడు.

ఆయన రూ. 50వేలు లంచం డిమాండ్ చేయడంతో మూడు దఫాలుగా ఆయన సహాయకుడు ధర్మేందర్‌కు లంచం ముట్టజెప్పాడు. అయినా పట్టా ఇవ్వకపోవడంతో ప్రజావాణికి ధరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. 

అయితే బ్యాంక్ రుణం తీసుకునేందుకు గానూ పహాణీ నకలు అవసరం కావడంతో తిరుపతి మళ్లీ తహసీల్దార్ వద్దకు వెళ్లాడు. మరో రూ. పదివేలు లంచంగా ఇస్తేనే పహాణీ నకలు పత్రాలు ఇస్తానని చెప్పడంతో ఇక లంచం ఇవ్వలేని తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

నిన్న జుహేద్ పాషా డ్రైవర్ అంజద్ పాషా, సహాయకుడు దాసరి ధర్మేందర్‌కు రైతు లంచం ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.