తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:06

తెలంగాణకు వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు.జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని..

వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు.

దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:02

KTR: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది..!

రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు..

హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు.

కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందని విమర్శించారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు.

వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలన్నారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 12:59

ఇక్కడ లోన్ పొందిన రైతులకు లక్ష రూపాయల మాఫీ ! ఉదయం శుభవార్త

రైతులకు ప్రభుత్వం నుంచి సకాలంలో రుణమాఫీ పథకం అందుతుంది. అదే విధంగా ఇప్పుడు బ్యాంకుల నుంచి కేసీసీ రుణం పొందిన రైతులకు రుణమాఫీ పథకం లబ్ధి చేకూరుతోంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు రుణాలు పొందిన రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి ఏళ్ల తరబడి బకాయి ఉన్న రుణాలను మాఫీ చేసిందని చెప్పవచ్చు.

ఈ లబ్ధిదారులు కూడా ఈ రుణమాఫీ పథకం కింద ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అప్‌డేట్ చేస్తుంది. ఈ లైసెన్స్‌లో పేర్లు ఉన్నవారిని ఈ రుణమాఫీ పథకం లబ్ధిదారులుగా పరిగణిస్తారు.

ఈ పథకం ద్వారా వారి లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది, రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మరియు సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో KCC పథకం ప్రవేశపెట్టబడింది. భారత ప్రభుత్వం రైతులకు 2% వడ్డీ రాయితీని మరియు 3% సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్‌ను అందిస్తుంది, తద్వారా సంవత్సరానికి 4% చాలా సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది

ఈ జాబితా ఒక నెలలోపు విడుదల చేయబడుతుంది మరియు వీటిలో మీ పేరు ఉంటే, మీరు మీ KCC లోన్ పథకం కింద 1 లక్షల వరకు రుణమాఫీని పొందే అవకాశం ఉంది, ఈ జాబితాలో ఉన్నవారు రుణమాఫీ పథకాన్ని పొందడం చాలా ముఖ్యం సర్టిఫికేట్. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 లక్ష వరకు రుణమాఫీ వంటి సమాచారాన్ని అధికారికంగా ప్రస్తావించారు.

ఈ పథకం మీ లోన్‌లో ఒక లక్ష రూపాయల మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఆర్థికంగా మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు.

ఆర్థిక ఇబ్బందులను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం మీకు సహకరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతుల కుటుంబానికి ఇది మరింత ఆనందం కలిగిస్తుంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:39

కారు’ దిగనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్

కారు’కు పంక్చర్ చేసి కాంగ్రెస్‌తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో ‘హస్తం’ కండువా కప్పుకోనున్నారు.

గతంలోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ప్రకాశ్ గౌడ్‌ను పిలుచుకుని పార్టీ మారొద్దని బుజ్జగించారు. కానీ ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం నిర్ణయించుకున్నారు.

ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్‌చార్జి మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది.

ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాశ్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కు చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ కారు పార్టీ పెద్దలకు పట్టుకున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:35

Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి: వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని తెలిపారు.

రాష్ట్ర జనాభాలో 62శాతం మంది 3.02 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్థక, డెయిరీ డెవలెప్మెంట్, మత్స్య శాఖలను తనకు చంద్రబాబు నాయుడు అప్పగించారని అన్నారు. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వమైన అత్యంత ప్రాధాన్యమైనదిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

2019 నుంచి 2024 వరకూ ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్ రెడ్డి ఈ శాఖకు తాళం వేశారని అన్నారు. వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యం కలిగింది భూమి కాబట్టి భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పడు పరీక్ష చేయలేదని చెప్పారు.

గడచిన ఐదేళ్లలో ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదని చెప్పారు. విత్తనాలు, ఎరువులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని అన్నారు. పంట అమ్ముకుంటే ఐదారు మాసాలకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని ప్రతి రైతు ధైర్యంగా ఉంటారని అన్నారు.

ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత వరకూ ఆ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ వ్యవసాయ అనుభంద రంగాలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్ని మళ్లీ పునప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అందులో భాగంగానే మూడు డిపార్ట్‌మెంట్లలో 6 ఫైళ్లపై సంతకం చేశానని వివరించారు.

వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తోంది... ఈ కార్యక్రమాన్ని 23 వ తేదీన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు పొలాల దగ్గరకు వెళ్లి రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. ఖరీఫ్‌, రబీలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండోసంతకం రైతుకు వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందిచడంపై చేశామని వివరించారు. గత ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనేమాటే ఈ రాష్ట్రంలో వినింపిచలేదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.988 కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా సబ్సిడీపై యాంత్రీకరణను ప్రోత్సహించామని చెప్పారు. ఈ ఐదేళ్లలో చివరకు కొడవలి పిడి కూడా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:32

Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.

ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ రౌస్‌అవెన్యూ కోర్టుకు (Rouse Avenue Court) తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.

సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్ షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది అన్నారు.

ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా అడిగారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. తదుపరి విచారణను జూలై 22కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

డిఫాల్ట్ బెయిల్, ఛార్జ్‌షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా చెప్పారు. ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఛార్జ్‌షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదని.. తప్పుగా ఉందని చెబుతున్నానని నితేష్ రానా న్యాయస్థానానికి తెలిపారు

ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ ఆమెను హాజరుపరిచింది. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రౌస్‌అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్‌ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 19:45

Hyderabad: మియాపూర్-పటాన్‏చెరువు రూట్‏లో డబుల్ డెక్కర్ బస్సులు

మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు.

హైదరాబాద్‌ సిటీ: మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌), నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 22న మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించిన రూట్‌మ్యా్‌పను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా పనుల డీపీఆర్‌ను హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి వచ్చే అడ్డంకులు, కావాల్సిన భూసేకరణపై లోతుగా పరిశీలిస్తున్నారు. రూ.20 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు కేంద్రీకృతమైన ప్రాంతాలకు మెట్రోను అనుసంధానం చేయడంపై విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ నగరానికి తూర్పున ఉన్న నాగోలుతో పాటు దక్షిణాన ఉన్న రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌లను కలుపుతూ ప్రతిపాదించిన 29 కిలోమీటర్ల మార్గంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్‌ ఉంది.

అలాగే ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌(LB Nagar - Hayat Nagar) మార్గాన్ని నేషనల్‌ హైవేపై నిర్మించాల్సి ఉంది. ఇలాంటి చోట్ల భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని డీపీఆర్‌ను తయారు చేస్తున్నారు.

మియాపూర్‌ - పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌ రూట్‌లో రెండు రోజులపాటు పరిశీలించిన అంశాలపై రసూల్‌పురాలోని మెట్రోరైలు భవన్‌లో నేషనల్‌ హైవే అధికారులతో హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ బుధవారం చర్చించారు.

సమావేశంలో ఆర్‌అండ్‌బీ(ఎన్‌హెచ్‌) ఈఎన్‌సీ గణపతిరెడ్డి, జాతీయరహదారుల ఎస్‌ఈ పి.ధర్మారెడ్డి, హెచ్‌ఏఎంఎల్‌ చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆనందమోహన్‌, ఎస్‌ఈ వై.సాయపరెడ్డి, జనరల్‌ మేనేజర్లు ఎన్‌.రాజేశ్వర్‌, విష్ణువర్థన్‌ రెడ్డి, సీనియర్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 19:41

Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి.

ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో నెల చివరి వారంలో జగరనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాలోచనలు చేయనున్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేయనున్నారు.

అంతేకాదు.. భూముల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు సహా తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.

గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.

ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందట. రేపో మాపో.. రైతుబంధు నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 15:27

India Playing XI: అభిషేక్ శర్మపై వేటు.. జింబాబ్వేతో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించింది. దాంతో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ సిరీస్ కైవసం చేసుకోవాలంటే నాలుగో టీ20లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆశసక్తి నెలకొంది.

టీమ్‌ కాంబినేషన్‌లో మార్పులు..

టీ20 ప్రపంచకప్ విజేతలు అందుబాటులోకి రావడంతో మూడో టీ20లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి రాగా.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ ఉద్వాసనకు గురయ్యారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ముఖేష్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్‌ను ఆడించారు.

నాలుగో టీ20లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. టాపార్డర్ మొత్తం ఓపెనర్లతో నిండిపోవడంతో జట్టు సమతూకంపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగాడు. ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా మాత్రం నిరాశపరిచాడు.

అభిషేక్ శర్మపై వేటు..?

ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేని నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు వేసి మిడిలార్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ చేయవచ్చు. మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలిచినా.. బ్యాటింగ్ విభాగం తడబడినట్లు అనిపించింది.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌ను మరింత పటిష్టం చేయాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మను కొనసాగించాలనుకుంటే మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

జింబాబ్వేతో నాలుగో టీ20.. భారత తుది జట్టుఅంచనా

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ/రియాన్ పరాగ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్/ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.