నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:04

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?

తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:01

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ఇంఛార్జిల నియామకం

బిఆర్‌ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. తాజాగా గురువారం సాయంత్రం జాబితాను విడుదల చేసింది.

ఎంపి వెంకటేశ్ నేతా కు (బెల్లంపల్లి (ఎస్‌సి) నియోజకవర్గం),

ఎంఎల్‌సి భానుప్రసాదరావు (మంచిర్యాల),

ఎంఎల్‌సి దండె విఠల్ (ఖానాపూర్ (ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ (ముథోల్),

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత (బోధన్),

మాజీ ఎంఎల్‌సి వి.గంగాధర్ గౌడ్ ఎల్లారెడ్డి

ఎంఎల్‌ఎ గంపా గోవర్ధన్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, ఇంఛార్జి మినిష్టర్ కెటిఆర్ ఇంఛార్జి) (కామారెడ్డి

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్

ఎంఎల్‌సి ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్ జగిత్యాల

చైర్మన్ రవీందర్‌సింగ్ పెద్దపల్లి

మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండి ఎస్‌సి

మాజీ ఎంపి బి.వినోద్ కుమార్ వేములవాడ

సుడా చైర్మన్ జివి రామకృష్ణ మానకొండూరు ఎస్‌సి

కె.తిరుపతిరెడ్డి:మెదక్

మాజీ ఎంఎల్‌సి ఫరూఖ్ హుస్సేన్ ఆంధోల్ (ఎస్‌సి),

ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి నర్సాపూర్

మాజీ చైర్మన్ దేవీప్రసాద్ జహీరాబాద్ (ఎస్‌సి),

చైర్మన్‌లు వి.భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ (సంగారెడ్డి),

చైర్మన్ బాలమల్లు దుబ్బాక

మంత్రి హరీశ్‌రావు, ఎంఎల్‌సి డాక్టర్ యాదవ్‌రెడ్డి, చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి(గజ్వేల్),

ఎంఎల్‌సి శంభీపూర్ రాజు మల్కాజ్‌గిరి

చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఉప్పల్

ఎంపి రంజిత్‌రెడ్డి :చేవెళ్ల ఎస్‌సి

వికారాబాద్(ఎస్‌సి), ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్

ముషీరాబాద్ కట్టెల శ్రీనివాస్‌యాదవ్,

అడ్వకేట్ మోహన్‌రావు(అంబర్‌పేట),

మంత్రి శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సి),

చైర్మన్ ఆంజనేయగౌడ్ (మక్తల్),

మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమళ్ల గద్వాల్

ఎంఎల్‌సి చల్లా వెంకట్రామిరెడ్డి (అలంపూర్ (ఎస్‌సి),

చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ (అచ్చంపేట (ఎస్‌సి),

చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి(కల్వకుర్తి),

ఎంపి పి.రాములు కొల్లాపూర్

ఎంఎల్‌సి కోటిరెడ్డి, రాంచంద్ర నాయక్ నాగార్జునసాగర్

విజయసింహారెడ్డి(నల్గొండ), హూజూర్‌నగర్

ఎంఎల్‌సి టి.రవీందర్‌రావు కోదాడ

జెడ్‌పి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి నల్గొండ

ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ (నకిరేకల్(ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి బి.వెంకటేశ్వర్లు, చైర్మన్ డాక్టర్ రాజయ్య, మంత్రి హరీష్‌రావు(ఇంఛార్జి), జనగామ

మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ (ఎస్‌టి),

చైర్మన్ వి.ప్రకాష్ (నర్సంపేట),

కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ (ఈస్ట్)

ఎంఎల్‌సి బసవరాజు సారయ్య భూపాలపల్లి

ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు (ఎస్‌టి),

ఎంపి వడ్డిరాజు రవిచంద్ర (ఇల్లందు (ఎస్‌టి),

మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వరరావు మధిర (ఎస్‌సి),

ఎంపి నామా నాగేశ్వరరావు (వైరా (ఎస్‌టి),

ఎంపి పార్థసారథి రెడ్డి (సత్తుపల్లి (ఎస్‌సి),

ఖమ్మం డిసిఎంఎస్ శేషగిరిరావు (అశ్వారావుపేట (ఎస్‌టి),

ఎంఎల్‌సి తాత మధు (భద్రాచలం (ఎస్‌టి).లను నియమించినట్టు తెలిసింది...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 13:58

చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి గురువారం సమాచారం ఇచ్చారు.

వైద్యులను పంపాలని లేఖలో కోరారు. వెంటనే స్పందించిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.సునీతాదేవి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు.

పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు.వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం.

సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

చంద్రబాబు ఆరోగ్యానికి డోకా లేదు

చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్‌ నార్మల్‌గా ఉందన్నారు.

పల్స్‌ రేట్‌ 87 నిమిషానికి ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు..

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 13:56

రేపు పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌

పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య గురువారంసాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌, నల్లగొండ, వరంగల్‌లోని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు.

www.passport.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 16:19

వార్డు సమస్యలపై పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Streetbuzz News Real time News platform

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:51

Cm Jagan: పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి వ్యక్తిగత విమర్శలు..

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

''చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 - 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్‌..

ఇంకోసారి నేషనల్‌.. మరోసారి ఇంటర్నేషనల్‌. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు'' అని జగన్‌ వ్యాఖ్యానించారు..

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:49

దారుణం.. కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది గుండ్ల సింగారంలో ఓ కానిస్టేబుల్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకి శబ్ధం విన్న స్థానికులు కానిస్టేబుల్పై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు..

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

ఆర్థిక లావాదేవీలతో తలెత్తిన విభేదాల కారణంగా ఓ కానిస్టేబుల్‌ తన అత్తను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలు పుట్టింటి వద్దే ఉంటుండగా… ఉదయం ప్రసాద్‌ గుండ్లసింగారం వచ్చాడు.

అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఎవరూ లేనిది చూసి.. సర్వీస్ రివాల్వర్‌తో ఆమె ఛాతిపైపై కాల్పులు జరిపారు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. తుపాకీ శబ్దం విని అక్కడికి పరుగులు తీసిన స్థానికులు.. ప్రసాద్‌పై రాళ్లతో దాడి చేసి, తరిమికొట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కమలమ్మ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:47

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చింది. అయినా.. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు ఆందోళనలకు దిగుతున్నారు.

నాగర్ కర్నూల్‌లో నాగం జనార్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించాలంటూ మంగళవారం గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టీపీసీసీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దానికి తోడు టికెట్ల విషయమై సీనియర్ల మధ్య కూడా పొరపచ్చాలు వచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్ధుబాటు, అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఈ ఫోర్ మెన్ కమిటీకి అప్పగించింది.

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. జానారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించింది.

ఇవాళ గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించకుండా సీట్లు ప్రకటిస్తే నేతల్లో అసంతృప్తి పెరిగి ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

దీంతో అభ్యర్థుల ప్రకటన ముందే జానారెడ్డి ద్వారా అసంతృప్తి చల్లార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది...