తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 14:12

తెలంగాణలో 22 లక్షలకుపైగా ఓట్లను తొలగించిన ఈసీ

హైదరాబాద్: తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు.

''తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్లో భాగస్వామ్యం చేస్తున్నాం. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం. రాష్ట్రంలో 2022 - 23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించాం. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు. ఫామ్ అందిన తర్వాతే తొలగించాం. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడించాం. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించాం. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 18 - 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చాం'' అని రాజీవ్కుమార్ వివరించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 11:49

చండూర్ లో నూతన RDO ఆఫీస్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, MP లింగయ్య యాదవ్

ఈ కార్యక్రమంలో..

మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్

నూతనముగా ఆర్డీవో సేవలు అందుకోబోతున్న ఇక్కడి ప్రజలకు శుభాకాంక్షలు..

హైదరాబాద్ కి దగ్గర ఉన్న మునుగోడు వెనుకబాటుకు గురైంది.

ఫ్లోరైడ్ మహమ్మారి ఎంతో మంది చనిపోయారు..

4 ఏళ్ళలో  మునుగోడు లోనే కాదు నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ ను తరిమి కొట్టిన గణత కేసీఆర్ దే ..

 

తాగు నీరు తో పాటు సాగు నీరు కోసం శివన్నగూడెం, చర్లగూడెం

కిష్టరాంపల్లి ,ప్రాజెక్టులు కడుతున్నాం...

వెనుక బడ్డ మునుగోడు ను ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులతో

పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారు...

మునుగోడు లో గెలిచిన పది నెలల కాలంలోనే ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి..

ఇలాంటి సమయంలో కొందరు

అభివృద్ధి కి అడ్డుపడుతున్నారు..

చేసే అభివృద్ధి పనులు అడ్డుకునే పనుల్లో కొందరు ఉన్నారు.వారికి బుద్ధి చెప్పాలి..

బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి నిరోదకుడు... అతనికి ఈ సారి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి...డిపాజిట్ రాకుండా ఓడించాలి...

 మునుగోడు లో

ముఖ్యమంత్రి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారు..

ఆరు గ్యారెంటీ లు ఇస్తామని అనే వారు వారి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు ఏమయ్యాలు..అసలు కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు... వాళ్ళ మాటలకు గ్యారంటీ ఎలా ఉంటుంది..కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు నమ్మరు... కాంగ్రెస్ ఔట్ డేట్ పార్టీ....అందులో ఉన్న నాయకులు ఔట్ డేట్ నాయకులే

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 11:44

డేట్ మారిన జోష్ తగ్గని నాయకుడు అర్ధరాత్రి దాటి ఒకటి అవుతున్నా సంక్షేమ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన మంత్రి

వర్తమాన రాజకీయాలలో ప్రజాప్రతినిధి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, ఒక క్రేజ్ ను కల్పించి, యువత సైతం ఆకర్షితులు అయ్యేలా చేయటం అంటే అంత అషామాషీ కాదు.

సూర్యాపేట నియోజక వర్గం కోసం రోజుకు 18 నుండి 20 గంటల పాటు ఆయన పడుతున్న శ్రమతో అసాధ్యాలెన్నో సుసాధ్యం అయ్యాయి. రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, పవిత్రతను చేకూర్చారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. మంత్రి గా నల్లగొండ జిల్లా బాధ్యతలను బుజస్కందాలపై మోస్తూనే , తన దేవాలయం లాంటి సూర్యాపేట లో అర్ధరాత్రి కూడా పాలన సాగిస్తూ పుట్టినిల్లుపై తన మమకారాన్ని చాటుతున్నారు. నల్లగొండ జిల్లాలో దేవరకొండ మునుగోడు, నకిరేకల్లు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రికి, తన సొంత నియోజకవర్గం సూర్యాపేటకు వచ్చేసరికి రాత్రి అయింది. రాత్రి అయింది కదా అలసిపోయి ఉంటారు ప్రోగ్రామ్స్ ఉండవు అని అధికారులు ,

బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పు అనే విధంగా రాత్రి 9 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 12 దాటి తేదీ మారి ఒంటిగంట అవుతున్నా కొనసాగుతూనే ఉన్నాయి.మూర్తీభవించిన మానవత్వానికిప్రతిరూపం..అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ బిజెపిలను వీడి బీఆర్ఎస్ లో చేరడానికి వచ్చిన ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామానికి చెందిన వందలాది మందికి కండువాతో స్వాగతం పలికారు. అనంతరం వెనుకబడిన తరగతులకు చెందిన కులవృత్తుల వారికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయం నకు సంబంధించి చెక్ లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా సూర్యాపేట రూరల్ మండలం కాసరబాద్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో  10 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను , బతుకమ్మ ఘాటును ప్రారంభించారు. అక్కడి నుండి ఇమాంపేట గ్రామానికి వెళ్లి 15 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన ను ప్రారంభించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని కార్యాలయానికి వచ్చేసరికి ఒంటిగంట అయినా, తమ అభిమాన నేతను కలుసుకొని ఆయనకు కష్టాలను చెప్పుకోవడానికి క్యాంప్ కార్యాలయం వద్ద వేచి ఉన్న సందర్శకులతో భేటీ అయ్యారు. ఒకోక్కరితో మాట్లాడుతూ వారి ఇబ్బందులను తెలుసుకుని వాటి కావాల్సిన పరిష్కారాలను సూచించారు. మొత్తంగా ఉదయం 6 గంటలకు మొదలైన మంత్రి జగదీశ్ రెడ్డి గారి విధి నిర్వహణ రాత్రీ ఒంటి గంట అయినా ఇంకా కొనసాగుతుంది.. బీఆర్ఎస్ బరువును, పరువును తన భుజస్కందాలపై వేసుకొని ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం నలు వైపులా కలియ తిరుగుతున్న అలుపెరుగని శ్రామికుడు జగదీష్ అన్న అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 02 2023, 17:11

మంత్రి కేటీఆర్ పర్యటన కోసం విద్యార్థులను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టడం అమానుష

నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ భవనాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనల కోసం నేడు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా పూలు చల్లుతూ స్వాగతం పలకడానికి స్కూల్ పిల్లలను గంటల తరబడి రోడ్డుకు పూట్ పాత్ లపై నిలబెట్టడం అవివేకం అని నిరంకుశత్వానికి,నియంతృత్వ పోకడకు నిదర్శనాలని PDSU జిల్లా ఇంచార్జి ఇందూరు సాగర్,జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు

 

స్థానిక PDSU జిల్లా కార్యాలయం (శ్రామిక భవనం)లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ....మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలకడానికి మైనర్ బాల,బాలికలను ఫుట్ పాత్ లపై నిలబెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అన్నారు.

మహాత్మా గాంధీ జయంతి రోజు విద్యార్థుల హక్కులను కాలరాయడం అవివేకం అని ప్రశ్నించారు.రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో విద్యార్థులకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమి లేదని,విద్యావ్యవస్థ బ్రష్టు పట్టిందని అన్నారు,5 వేల కోట్లకు పైగా స్కాలర్ షిప్స్,రియంబర్స్ మెంట్స్ చెల్లించపోవడంతో విద్యార్థుల ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని మండి పడ్డారు.

ప్రభుత్వ విధానాల వలన వందలాది ప్రభుత్వ పాఠశాలలు,బి.ఈ.డి,డిగ్రీ,ఇంటర్,ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు మూతబడ్డాయని అన్నారు.నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయిందని దుయ్యబట్టారు.ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు.కార్పొరేట్ యూనివర్సిటీ లకు తలుపులు బార్లాతెరవడంతో ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని తెలిపారు.హాస్టల్ పెంచిన కొద్దిపాటి మెస్ చార్జీలను కూడా పేపర్ కె పరిమితం చేశారని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలు,అవకతవకలేనని అన్నారు.చేసిన అభివృద్ధి గోరంత,ప్రచారం కొండంత ఉన్నదని అన్నారు.పట్టణలో డివైడర్ లను మూసి వాహన దారులను,ప్రజలను,విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు..

    

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:12

అక్టోబర్ 2న జైల్లో చంద్రబాబు నిరసన దీక్ష

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు.

అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:10

అక్టోబర్ 4న విచారణకు హాజరు కానున్న నారా లోకేష్

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ-14గా ఉన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 4న ఉదయం గం. 10.00కి తాడేపల్లిలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన సీఐడీ బృందం శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంది.

బయల్దేరే ముందే నారా లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితో సీఐడీ అధికారులు మాట్లాడారు. ఢిల్లీ చేరుకున్నా ఎక్కడ కలవచ్చో చెబుతామని వ్యక్తిగత సిబ్బంది సీఐడీ అధికారులు చెప్పారు.

సీఐడీ బృందం ఢిల్లీ చేరుకునే సమయానికి నారా లోకేశ్ అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసం 50, అశోక రోడ్ లో ఉన్నారు. అయితే ఆ ఇల్లు ఎంపీ గల్లా జయదేవ్‌ది కావడంతో అనుమతి లేకుండా అధికారులు అక్కడికి వెళ్తే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద సీఐడీ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అందుకే సీఐడీ అధికారులు గల్లా జయదేవ్‌ను సంప్రదించి ఇంట్లోకి వచ్చేందుకు అనుమతి కోరినట్టు తెలిసింది. సాయంత్రం సరిగ్గా గం. 4.50 సమయంలో ముగ్గురు సీఐడీ అధికారులు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:08

అక్టోబర్ నెలలో స్వామివారి విశేష పర్వదినాలు

నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబర్‌ నెలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్‌ 1 న బృహత్యుమాసవ్రతం ఉండ్రాళ్లతద్దె, 3న మధ్యాష్టమి, 10న మతత్రయ ఏకాదశి, 13న మాసశివరాత్రి, అక్టోబర్‌ 14న మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంతదేశిక ఉత్సవం ప్రారంభం.

ఇక 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, సరస్వతిపూజ, 21న దేవి నవరాత్రి వ్రతం, సేనై ముదలియార్‌ వర్ష తిరునక్షత్రం, 22న స్వర్ణరథోత్సవం,

దుర్గాష్టమి, 23 న చక్రస్నానం, మహర్నవమి మరియు విజయదశమి, వేదాంత దేశిక సాత్తుమొర, పిళ్ళైలోకాచార్య పోయిగై ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 24న పూద ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 25న మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 28న పాక్షిక చంద్రగ్రహణం, అక్టోబర్‌ 31న చంద్రోదయోమ వ్రతం అట్లతద్దె, పర్వదినాలు టిటిడి వైభవంగా నిర్వహించనుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:06

నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే

నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్‌కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు..

మహబూబ్‌నగర్‌లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుని.. 2.15-2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.

ఇక, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న సన్నాహాక బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 16:50

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే..

దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

కానీ, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. 

కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున దిల్లీలో న్యాయవాదులతో లోకేశ్‌ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు.

పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్‌.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 14:29

శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ గురువారం ఉదయం తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు.

దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. పలువురు క్రికెట్ అభిమానులు గంభీర్‌ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.

శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు గంభీర్.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచకప్‌ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని అభి ప్రాయపడ్డారు.

గంభీర్. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.

ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌లో ఉంది...

Sbnews