తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:06

తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..

హైదరాబాద్..

తెలంగాణ పేద రోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

Sbnews

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:03

ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు..

అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు.

ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని అభివర్ణించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:59

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: అయిదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది..

అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంపై చర్చ జరగనుంది.

వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఇటు శాసన మండలిలోనూ స్కిల్ డెవలప్‌మెంట్‌, విద్య రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలపై సబ్యులు చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరిరోజు. ఈ రోజుతో సమావేశాలు ముగియనున్నాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:55

ఎం పీ నామ నాగేశ్వరరావు నివాసంలో బీఆర్ఎస్ నేతల భేటీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం రాత్రి ఖమ్మంలోని తన స్వగృహంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,తో కలసి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ తో ప్రత్యేకించి భేటీ అయ్యారు.

రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సమాలోచనలు జరిపారు.

రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లు గెల్చుకునేందుకు అంతా పట్టుదల, దృఢదీక్ష తో పని చేయాలని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు వారికి దిశా నిర్దేశం చేశారు.

సునాయాసంగా వైరా సీటును కైవశం చేసుకునేందుకు సమైక్యంగా, చైతన్యవంతమైన భూమిక వహించాలని, అందరూ అన్నదమ్ముల్లా పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని ఈ సందర్భంగా ఎంపీ నామ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను, పార్టీ నేత, అభ్యర్థి మదన్ లాల్ ను కోరినట్లు సమాచారం......

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:47

నేడు సుప్రీంలో బాబు పిటిషన్ పై విచారణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ ఎస్వీఎన్ భట్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ ను శనివారం న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు.

దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకి వర్తించదని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

అయితే సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

నేటి విచారణలో ఇదే అంశంపై ప్రధానంగా వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాతో పాటు మరికొందరు సీనియర్ న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది.

బుధవారం నాటి విచారణలో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత రానుంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:44

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది.

నేడు బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం తిరుమల శ్రీవారిని 55,747 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీవారికి 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2023, 20:13

ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో చోటుచేసుకుంది. ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు అదే గ్రామానికి చెందిన మద్ది వీరయ్యకు చెందిన మిర్చి, పత్తి చేనులో చెత్తను తొలగించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి పనులను ప్రారంభించారు. అయితే.. ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

దాంతో.. వర్షం నుంచి తలదాచుకునేందుకు 8 మంది వ్యవసాయ కూలీలంతా వెళ్లి అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కింద నిలబడ్డారు. అదే వారు చేసిన తప్పుగా మిగిలిపోయింది. పెద్ద శబ్ధంతో పిడుగు వ్యవసాయకూలీలు నిలబడ్డ చెట్టుపైనే పడిపోయింది.

దాంతో.. చెట్టుకింద ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకి గురయ్యారు.

ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మిగతావారికి స్వల్పగాయాలు అయ్యాయి.త తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. తీవ్రగాయాలపాలైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. పిడుగులు పడుతున్న సందర్భంలో చెట్ల కింద కానీ.. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2023, 20:08

పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.

గడపగడపకూ మన ప్రభుత్వంపై వారితో సమీక్షిస్తున్న సీఎం.. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2023, 20:04

టీఎస్పీఎస్సీ పై హైకోర్టు సీరియస్

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి బుధవారం కి వాయిదా వేసింది.

టీఎస్పీఎస్సీ పై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని, అలాగే బయో మెట్రిక్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

బయో మెట్రిక్ విధానంలో సాంకేతికత, సమయం లేకపోవడం వల్ల పెట్టలేకపోయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. బయో మెట్రిక్ విధానం వల్ల సమస్యలు ఉన్నాయని.. మొదటిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లోనూ బయో మెట్రిక్ సమస్యలు వచ్చాయని ఏజీ తెలిపారు.

దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ మిగతా పరీక్షలకు బయో మెట్రిక్ విధానం అమలు అవుతునప్పుడు.. గ్రూప్ 1కు మాత్రమే సమస్య వస్తుందన్నారు. కానిస్టేబుల్ పరీక్షకు 6 లక్షల మందికి బయో మెట్రిక్ తీసుకున్నారని న్యాయవాది తెలిపారు.

దీంతో ఏ ఏ పరీక్షల్లో బయో మెట్రిక్ ఎంత మందికి వాడారనే వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ మేరకు వాయిదా వేసింది.

అంతకుముందు విచారణలో టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని మండిపడింది.

మొదటిసారి పేపర్ లీకేజ్‌తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2023, 19:22

పాతబస్తీ హనుమాన్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి భూరి విరాళం ప్రకటించిన కంచర్ల

 పాత బస్తి హనుమాన్ నగర్ లో..

 నిర్మితమవుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి., నల్లగొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి 30లక్షల రూపాయాలా బారి విరాళాన్ని ప్రకటించారు.

భారీ ఎత్తున నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణానికి తన వంతుగా,విరాళం ప్రకటిస్తున్నానని, అనుకున్న రీతిలో దేవాలయం అద్భుతంగా నిర్మాణం

పూర్తిచేయాలనీ ఆలయ కమిటీని కోరారు.

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ వట్టిపల్లి శ్రీనివాస్., ఆలకుంట్ల మోహన్ బాబు, రమేష్ చంద్ర.. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sbnews

Sbnews