నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:03

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్ సర్కార్

తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాత లకు ప్రభుత్వం లాంఛనాలతోనే

అంత్య క్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.

అవయవ దానం విష యంలో తమిళనాడు దేశం లోనే అగ్రగామిగా ఉంది. విషా దకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల

అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.

మరణానంతర అవయవ దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులకు తెలియజేయాలి.

మిగిలిన వాళ్లు కూడా అవ యవ దానం చేసేలా ప్రోత్సహించాలి.

అవయవ దాతలు , వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్టాలిన్ పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:00

సీ వీ ఆనంద్ ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్..పోలీస్ దంపతులు

హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, పోలీస్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

పోలీస్ వెహికల్‌ నుంచి కిందకు దిగుతున్నట్లు ఫొటోలు తీయించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

పోలీస్ వెహికల్, డ్రెస్, పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఉపయోగించుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు.

ఈ పోలీస్ దంపతులు బాధ్యతలు మరిచి ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్‌ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు.

దీంతో జీవితంలో సంతోషంగా ఉండాలని కొత్త జంటకు సీవీ ఆనంద్ శుభాకాంక్షలు చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 21:56

ముగిసిన చంద్రబాబు మొదటి విచారణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును సిఐడి అధికారులు విచారించారు.

సుమారు ఆరు గంటలపాటు చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించారు.

సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం విచారించింది. బాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ జరిగింది.

ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో సిఐడి అధికారులు ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే...

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 16:05

ఎమ్మెల్సీ కవితతో బీసీ నేత ( ఎంపీ )ఆర్ కిష్టయ్య భేటీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు.కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు. 40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని.. ఢిల్లీలో 80సార్లు ధర్నా చేశామన్నారు.

అలాగే బీసీల కోసం.. బీసీ బిల్లు కోసం 65 సార్లు ప్రధాన మంత్రులను కలిసామని, కానీ ఈనాటికి బీసీలకు న్యాయం జరగటంలేదన్నారు. అన్ని పార్టీలను కలిసి బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా చేయాలని కోరామని తెలిపారు.

దశాబ్దాలుగా బీసీ బిల్లుకు మోక్షం కలగటంలేదని.. ఇప్పటికైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీసీల బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చిందని బీసీల నినాదం ఢిల్లీని తాకిందన్నారు.

ఇక బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు...

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:26

గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ నిర్లక్ష్యమే: బల్మూరి వెంకట్

గ్రూప్ - 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

నిరుద్యోగులతో ప్రభుత్వ నాయకులను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు.

టీఎస్‌పీఎస్సీ ట్రాన్సపేరెన్సీగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మూడు అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విద్యార్థుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అంతే కాకుండా యువత సమస్యలను పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:23

Motkupalli Narasimhulu : చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి: మోత్కుపల్లి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు.

చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు..

హైదరాబాద్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.

'జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదు.

ఏపీ సీఎం జగన్‌ దళిత ద్రోహి. జగన్‌ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.

వైఎస్‌ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదు. దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు.

ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్‌లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? '' అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి నిలదీశారు..

చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని మోత్కుపల్లి అన్నారు. ''చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్‌ పని చేశారు. నేను ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో పని చేశాను. రాజకీయాలు పక్కనపెట్టి కేసీఆర్‌ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది. నేను భారాసలోనే ఉన్నాను.

కానీ, వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్టుపై స్పందించాను. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారు.'' అని మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని.. అదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:19

ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు గోల్ మాల్ చేశారని

ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సీఐడీ పోలీసులు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి హిమబిందు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటీ నుండి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

తమ నేతను జైలుకు పంపారన్న ఆగ్రహంతో ఆమెను కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారు.

కాగా, జడ్జిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది.

విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీ.సీ మీనా ఆదేశించారు.

ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని లేఖ రాశారు....

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:15

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు?

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు..16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఈ నెల 25 నుం చి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్‌ నుంచి వెనుతిరుగుతాయని వెల్లడించింది.

ఈ ప్రభావంతో డిసెంబర్‌ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు...

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:11

Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్‌

అమరావతి: జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు..

ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ''జైలు మోహన్‌కు బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.

రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులు ఉన్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు'' అని లోకేశ్‌ ధ్వజమెత్తారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:08

Chandrababu : క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన చంద్రబాబు

దిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు..

తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.

సోమవారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది.

దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే..

SB NEWS

SB NEWS