నిజంనిప్పులాంటిది

May 28 2023, 20:13

Arvind Kejriwal | ప్రధాని మోదీని సాగనంపాల్సిందే.. ఢిల్లీకి ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు థ్యాంక్స్‌: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

•ఆయనను నిలువరిస్తేనే దేశ మనుగడ

•సుప్రీంనూ అపహాస్యం చేస్తున్న మోదీ

•8 ఏండ్ల పోరాట ఫలం 8 రోజుల్లో ఆవిరి

•ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ సర్కా ర్‌ అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం మినహా మరో మార్గం లేదని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి ఆయన మీ డియాతో మాట్లాడారు.

ఢిల్లీలో తమకన్నా ముం దున్న షీలా దీక్షిత్‌ ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పూర్తి అజమాయిషీ ఉండేదని, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్య లు, కొత్త పోస్టుల సృష్టి వంటి అన్ని రకాల అధికారాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేవని గుర్తుచేశా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 లో మోదీ సర్కార్‌ ఒక్క నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నింటినీ బలవంతంగా లాగేసుకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం హోదాలో తనకు కనీసం ఒక అధికారిని బదిలీ చేయటం, పోస్టింగ్‌ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.

8 ఏండ్ల పోరాటం.. 8 రోజుల్లో ఆవిరి

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభు త్వం అపహాస్యం చేసిందని కేజ్రీవాల్‌ విమర్శించారు. మే 11న సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే.. మే 19న మోదీ సర్కార్‌ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్‌ తెచ్చిందని మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్‌ చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రభుత్వం లెక్కచేయకపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికి పోవాలి? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధానే సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకపోతే దానిని ఇంకెవరు గౌరవిస్తారు? అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవాలి

కేంద్ర తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకొనేందుకు వ్యూహం రచిస్తున్నామని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి సరైన మెజారిటీ లేదని, రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 238 (12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు) సభ్యుల్లో బీజేపీకి 93 మంది సభ్యులే ఉన్నారని, ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోతే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా 2024లో మోదీ సర్కార్‌ తిరిగి అధికారంలోకి రాదని అన్నారు. మోదీ సర్కార్‌ను నిలువరించినపుడే దేశ స్వాతంత్య్రాన్ని కాపాడినవాళ్లం అవుతామని స్పష్టంచేశారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు

సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు. తమ కు సమయం కేటాయించి తమ సమస్యను దేశసమస్యగా భావించి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'రావుసాబ్‌.. ప్రేమకు పాత్రులం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించామని, ఢిల్లీ ప్రజల న్యాయమైన కోరికకు సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. 'ఇది కేవలం ఢిల్లీ సమస్య కాదని, యావత్‌ దేశం ఎదుర్కొంటున్న సమస్య' అని మానవీయ హృదయంతో స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇంత ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు ఢిల్లీ ప్రజల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పనిచేయకుండా అడ్డుకోవటమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచటం, దారికి రాని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఉసిగొల్పటం, మొదటి రెండు పద్ధతులు పనిచేయకుంటే ఆర్డినెన్స్‌ల ద్వారా, గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చిన్నాభిన్నం చేయటం అనే మూడు వ్యూహాలను అనుసరిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 28 2023, 20:09

కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు తాలిబన్లు కు అధ్యక్షుడు : వైయస్ షర్మిల*

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ తో కలిసి నిన్న ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్.. కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో అని అన్నారు.

‘రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు’ అని విమర్శించారు. ఆయన పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదన్న షర్మిల తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ హక్కుల కోసం ఉద్యమం చేస్తానంటున్నాయన.. స్వరాష్ట్ర హక్కుల కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీపై కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ హక్కుల కోసం గల్లీ కేసీఆర్ ఉద్యమం చేస్తాడట.. కేంద్రం మెడలు వంచుతడట. పార్లమెంట్ లో బిల్లును ఓడగొట్టేలా ఉద్యమిస్తడట..! అయ్యా దొర గారు..పక్క రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమాలు చేసే మీరు.. స్వరాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క ఉద్యమమైనా చేసిండ్రా.. కనీసం పార్లమెంట్ లో నైనా కొట్లాడిండ్రా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఒక్కనాడైనా మాట్లాడావా? కాజీపేట రైల్వే కోచ్ ఎందుకివ్వరు అని ఉద్యమించినవా..? గిరిజన యూనివర్సిటీ పై ఏనాడైనా ప్రశ్నించినవా..? బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ బిడ్డల కోసం ఏ రోజైనా నోరు విప్పినవా? ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఏనాడైనా పార్లమెంట్ ను స్తంభింపజేసినవా..? అసెంబ్లీ తీర్మానించిన మైనారిటీ,గిరిజన రిజర్వేషన్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారని అడిగినవా..? ఢిల్లీ ప్రజల తరుపున మద్దతు కోసం వచ్చిన కేజ్రీవాల్ లెక్క మీరు ఎవరినైనా కలిశారా..?’ అని షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.

మూడో కూటమి, ఫెడరల్ కూటమి అంటూ ప్రజల సొమ్ముతో రాజకీయం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఏనాడు మద్దతు అడిగింది లేదని, ఉభయ సభల్లో ఉద్యమించింది లేదని విమర్శించారు. ‘నిధులు ఇస్తలేరు అని ప్రగతి భవన్ లో దొంగ ఏడుపులు తప్ప..స్వయంగా ప్రధానినే రాష్ట్రానికొస్తే ఎదుటపడి అడిగింది లేదు. కేసీఅర్ మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడీ గడప దాటయ్ అనే దానికే నిదర్శనం.

సుప్రీం కోర్టు తీర్పునే లెక్క చేయరా అంటూ దొంగ మాటలు చెప్పే దొర గారు... రాష్ట్రంలో జర్నలిస్టుల స్థలాల కోసం ఇచ్చిన సుప్రీం తీర్పును మీరెక్కడ లెక్క చేశారో సమాధానం చెప్పాలి. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో.. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు. రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతే లేదు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టి చావ బాదడాలు. పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు. శాంతిభద్రతలు అదుపులో లేవు. రాష్ట్రంలో ప్రజలను బ్రతనివ్వరు. ప్రతిపక్షాలను ఉండనివ్వరు. దొర నియంత పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదు. అందుకే తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలి. రాష్ట్రపతి పాలన పెట్టాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు...

నిజంనిప్పులాంటిది

May 28 2023, 16:56

New Parliament: రూ.75 నాణేన్ని ఆవిష్కరించిన మోదీ..

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు (New parliament) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 16:53

బి.సి విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి

•బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బి.సి విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి.సి విద్యార్థులకు కూడా మా సోదర కులాలైన ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

బి.సి కులాలలో అనేక కులాలు ఇంకా బడిమెట్లు తొక్కని కులాలు అనేకంగా ఉన్నాయి వారు అనేక సంవత్సరాలుగా కులవృత్తి మీద ఆధారపడి బతుకుతున్న వర్గాలు చాలా ఉన్నాయి కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవాలని పేద కుటుంబాల పిల్లలు ఆశలు నిరాశ గానే మెలిగిపోతున్నాయి.

బి.సి కులాల ఉన్న పిల్లలు కూడా మంచి విద్యని అభ్యసించి ఉన్నంత స్థాయికి పోవాలంటే తక్షణమే బీసీలకు కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని బి.సి విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, సల్కునూరు నరసింహ,కాటం రాజు,మాడుగుల సాయికుమార్, మహేష్,స్వామి,గణేష్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 15:51

Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం..

హైదరాబాద్ నగరం(Hyderabad City)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలుచోట్ల వర్షం(Rains) కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్‌గూడ, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఫిలింనగర్‌లలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది..

నగరంలోని మరికొన్న ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది.మరో వైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 15:15

Ycp vs Janasena: వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్‌..

విశాఖపట్నం: విశాఖపట్నం సిటీలో వైసీపీ (YCP), జనసేన (JANASENA) పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్‌ కొనసాగుతోంది. వైసీపీ ఫ్లెక్సీల ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..

రాక్షస పాలన అంతం..ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు.

జగన్‌ షర్ట్‌పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని జనసేన ఏర్పాటు చేసింది. సిరిపురం వీఐపీ రోడ్‌లో పక్కపక్కనే ఇరువర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య వార్ నడుస్తోంది..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 15:13

ఎన్టీఆర్ నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్..

హైదరాబాద్: నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా సినీనటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు..

ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పురంధేశ్వరి రామకృష్ణ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పుష్పాంజలి ఘటించారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 15:12

నట సార్వభౌముడిని స్మరించుకున్న మెగాస్టార్..

హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కలకాలం మన మనస్సుల్లో మిగిలిపోతారని అన్నారు..

ఆయనతో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరనీయం అన్నారు. 'నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు… చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు.

చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం' అని చిరంజీవి ట్వీట్ చేశారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 10:15

బైక్‌ పై వెళ్తూ కుప్పకూలిన రేషన్‌ డీలర్‌. ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

వరంగల్‌జిల్లా :

హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్‌పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం ఘటన చోటుచేసుకోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్‌ చేసాడు.

అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తలరించాడు. దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. గుండెపోటుకు గురైన రాజు స్థానిక రేషన్‌ షాపు డీలర్‌గా గుర్తించారు.

సీపీఆర్‌ ద్వారా అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామిని సిటీ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు.......

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 28 2023, 10:14

నీట మునగాల్సిందేనా❓️

భూపాలపల్లి జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు కష్టాలు తీరటం లేదు. వానాకాలం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. గత ఏడాది జూలైలో భారీ వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది కుటుంబాల పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. గోదావరి కరకట్టలు కోతకు గురికావటం వల్లే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించినప్పటికీ వాటి మరమ్మతుల ఊసెత్తటం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్‌ కరకట్టల పునరుద్ధరణకు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవటం లేదు. వానాకాలం సమీపిస్తుండటంతో మళ్లీ తమకు ఇబ్బందులు తప్పవేమోనని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఏటా గోదావరి తీరం కోత..

గోదావరి పరీహవాక ప్రాంతాలకు వానాకాలం భయం వెం టాడుతోంది. జూలైలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద బీభత్సం సృష్టించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంట లు ముంపునకు గురయ్యాయి. వరద నీరు గోదావరి తీరం పక్కన ఉన్న గ్రామాల్లో ప్రజలను ఊళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.

వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో నీట మునిగిన ఇళ్లను వదిలేసి, పునరావాస కేంద్రా ల్లో తల దాచుకున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సాగు భూములు గోదావరిలో కలిసి పోవటంతోపాటు ఇసుక మేటలు వేయటంతో రైతన్నలకు కన్నీరే మిగిలింది. ప్రతి ఏటా గోదావరి తీరం వెంట కరకట్టలు కోతకు గురవుతండటంతో పంటపొలాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఊళ్ల కు ఊళ్లే నీట మునుగుతున్నాయి. కరకరట్టలకు మరమ్మతులు లేకపోవటంతో ఏటేటా మరింత ఎక్కువ కోతకు గురై నష్టం భారీగా పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

రూ.88 కోట్లతో ప్రతిపాదనలు

భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో లక్ష్మీపురం, గంగారం గ్రామాల మధ్య కరకట్ట కోతకు గురవుతున్నాయి. లక్ష్మీపురం వద్ద గోదావరిలో మానేరు నది కలుస్తుంది. రెండు నదులు కలిసే చోటు కావటంతో పాటు గోదావరిలోకి వచ్చే వరద వెనక్కి మానేరులోకి వస్తుండటంతో మానేరు, గోదావరి తీరాలు కోతకు గురవుతున్నాయి.

జూలైలో దామెరకుంట గ్రామం మొత్తం గోదావరి వరదలో మునిగిపోయింది. వానాకాలం వచ్చిందటే దామెరకుంట, గంగారం, లక్ష్మీపురం, గుండ్రాజుపల్లి, విలసాగర్‌ తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో లక్ష్మీపురం నుంచి గంగారం వరకు తొమ్మిది కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టడానికి రూ.88కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం పైసా నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముంపు తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు....