బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్*
బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
Streetbuzz news : నల్గొండ జిల్లా :
గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సమీపంలో ట్రైన్ పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Feb 15 2023, 09:33