*భద్రాద్రి కొత్తగూడెం* *బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*
భద్రాద్రి కొత్తగూడెం
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని మరియు విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందని ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఉచితంగా విద్యుత్ పొందవచ్చని మరియు కాలుష్యం తగ్గుతుందని, గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని అంతేకాకుండా బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తున్నారని కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఏర్పాటు చేయుటకు లైసెన్సు తీసుకున్నటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కంపెనీలకు చెందిన సోలార్ ను మాత్రమే అమర్చి వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మంచి సర్వీసును అందించాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి, బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.
Apr 04 2026, 07:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k