నల్లగొండ లో ముగిసిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలు
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడల పోటీలు సోమవారం ముగిసాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా, బాలికల విభాగంలో అసిఫాబాద్ జిల్లా విజయం సాధించి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ ఎండి అక్బర్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, గౌరవ అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్
డా.హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాది కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఈ పోటీలలో 33 జిల్లాల నుండి బాలికలు 450 మంది, బాలురు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో ద్వితీయ స్థానం నల్గొండ జిల్లా సాధించగా, బాలుర  విభాగంలో మేడ్చల్ మల్కాజిగిరి ద్వితీయ స్థానం పొందారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్ మేనేజర్లు, టెక్నికల్ అఫీషియల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముఖ్య అతిథి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ, గ్రామీణ క్రీడాకారులకు మంచి సదుపాయాలు కల్పిస్తూ మున్ముందు కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నల్గొండలో నిర్వహిస్తామని తెలిపారు.
CM కప్ రాష్ట్రస్థాయి పోటీలలో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన నల్గొండ ఫుట్బాల్ జట్టు
గత 4 రోజుల నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 2026- సీఎం కప్ ఫుట్బాల్ క్రీడల్లో, నల్గొండ బాలికల టీం అద్భుతమైన ఆటతీరుతో రాష్ట్రస్థాయిలో విజేతలుగా  మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు జిల్లా క్రీడల అధికారి ఎండి అక్బర్ అలీ, నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలిక ఫుట్బాల్ ప్లేయర్స్ ను  పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: సీఎం కప్ 2026 జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్  ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో  అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
'ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్కిరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, నాగార్జున, సృజన, సరస్వతి, రంజాన్, మహమ్మద్ మరియు విద్యార్థులు అఖిల్ రెడ్డి, మహేష్, శ్రీధర్ రెడ్డి, సుచిత్ర, స్వాతి, దీప్తి, ప్రసన్న, వీణ, శివ, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: సరంపేట గ్రామంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు (జాతర)
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, సరంపేట గ్రామంలో శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఆదివారం స్వామి వారి రధోత్సవం వైభవంగా జరిగింది. కాగా ఇవాళ కూడా జాతర కొనసాగనుంది. 500 సంవత్సరాల క్రితం స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు:

భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ కే.బి. చౌదరి, ప్రిన్సిపాల్ శ్రీ కే రమణ కుమార్, శ్రీ కే. నరేంద్ర చౌదరి మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కళాశాలలో పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు, క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, మరియు షటిల్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులందరికీ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులందరూ కేవలము పాఠాలను అభ్యసించడమే కాకుండా తమ భవిష్యత్తుకు సంబంధించి క్రీడలు మరియు ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటే వారికి మానసిక వికాసంతో పాటు వివిధ రంగాలలో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోవడం చాలా సులభం అవుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. విద్యార్ధినీ విధ్యార్ధులు ఈ కార్యక్రమములో ఎంతో ఉత్సాహం గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ
77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ' నాన్న సేవా సమితి" ఆధ్వర్యంలో, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి ,వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్రప్రసాద్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్న సేవ సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు, రాష్ట్ర ఇన్చార్జి యాతాకుల శేఖర్, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ప్రశాంత్, వెంకన్న, సంతోష్ మొదలైన వారు పాల్గొన్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం* *బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*
భద్రాద్రి కొత్తగూడెం


కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు
     
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని మరియు విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందని ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఉచితంగా విద్యుత్ పొందవచ్చని మరియు కాలుష్యం తగ్గుతుందని, గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని అంతేకాకుండా బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తున్నారని కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఏర్పాటు చేయుటకు లైసెన్సు తీసుకున్నటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కంపెనీలకు చెందిన సోలార్ ను మాత్రమే అమర్చి వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మంచి సర్వీసును అందించాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి,  బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.

PRTU TS 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద PRTU TS 2026 క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించిన మండల విద్యాధికారి గోలి శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో రమాదేవి GHM నారాయణపూర్, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యగ్గడి శ్రీనివాస్, హరికిషన్ రెడ్డి, యాదిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ ఉపేందర్, జిల్లా కార్యదర్శి సోమేశ్వర్, మండల అసోసియేట్ ప్రెసిడెంట్ అంతటి శ్రీనివాసులు, మండల మహిళా కార్యదర్శి శ్రావణి, LFL HM ఎల్లయ్య, లీలావతి, వాణిశ్రీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
నల్లగొండ లో ముగిసిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలు
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడల పోటీలు సోమవారం ముగిసాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా, బాలికల విభాగంలో అసిఫాబాద్ జిల్లా విజయం సాధించి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ ఎండి అక్బర్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, గౌరవ అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్
డా.హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాది కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఈ పోటీలలో 33 జిల్లాల నుండి బాలికలు 450 మంది, బాలురు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో ద్వితీయ స్థానం నల్గొండ జిల్లా సాధించగా, బాలుర  విభాగంలో మేడ్చల్ మల్కాజిగిరి ద్వితీయ స్థానం పొందారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్ మేనేజర్లు, టెక్నికల్ అఫీషియల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముఖ్య అతిథి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ, గ్రామీణ క్రీడాకారులకు మంచి సదుపాయాలు కల్పిస్తూ మున్ముందు కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నల్గొండలో నిర్వహిస్తామని తెలిపారు.
CM కప్ రాష్ట్రస్థాయి పోటీలలో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన నల్గొండ ఫుట్బాల్ జట్టు
గత 4 రోజుల నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 2026- సీఎం కప్ ఫుట్బాల్ క్రీడల్లో, నల్గొండ బాలికల టీం అద్భుతమైన ఆటతీరుతో రాష్ట్రస్థాయిలో విజేతలుగా  మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు జిల్లా క్రీడల అధికారి ఎండి అక్బర్ అలీ, నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలిక ఫుట్బాల్ ప్లేయర్స్ ను  పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: సీఎం కప్ 2026 జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్  ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో  అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
'ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్కిరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, నాగార్జున, సృజన, సరస్వతి, రంజాన్, మహమ్మద్ మరియు విద్యార్థులు అఖిల్ రెడ్డి, మహేష్, శ్రీధర్ రెడ్డి, సుచిత్ర, స్వాతి, దీప్తి, ప్రసన్న, వీణ, శివ, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: సరంపేట గ్రామంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు (జాతర)
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, సరంపేట గ్రామంలో శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఆదివారం స్వామి వారి రధోత్సవం వైభవంగా జరిగింది. కాగా ఇవాళ కూడా జాతర కొనసాగనుంది. 500 సంవత్సరాల క్రితం స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు:

భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ కే.బి. చౌదరి, ప్రిన్సిపాల్ శ్రీ కే రమణ కుమార్, శ్రీ కే. నరేంద్ర చౌదరి మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కళాశాలలో పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు, క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, మరియు షటిల్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులందరికీ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులందరూ కేవలము పాఠాలను అభ్యసించడమే కాకుండా తమ భవిష్యత్తుకు సంబంధించి క్రీడలు మరియు ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటే వారికి మానసిక వికాసంతో పాటు వివిధ రంగాలలో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోవడం చాలా సులభం అవుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. విద్యార్ధినీ విధ్యార్ధులు ఈ కార్యక్రమములో ఎంతో ఉత్సాహం గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ
77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ' నాన్న సేవా సమితి" ఆధ్వర్యంలో, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి ,వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్రప్రసాద్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్న సేవ సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు, రాష్ట్ర ఇన్చార్జి యాతాకుల శేఖర్, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ప్రశాంత్, వెంకన్న, సంతోష్ మొదలైన వారు పాల్గొన్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం* *బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*
భద్రాద్రి కొత్తగూడెం


కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు
     
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని మరియు విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందని ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఉచితంగా విద్యుత్ పొందవచ్చని మరియు కాలుష్యం తగ్గుతుందని, గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని అంతేకాకుండా బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తున్నారని కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఏర్పాటు చేయుటకు లైసెన్సు తీసుకున్నటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కంపెనీలకు చెందిన సోలార్ ను మాత్రమే అమర్చి వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మంచి సర్వీసును అందించాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి,  బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.

PRTU TS 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద PRTU TS 2026 క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించిన మండల విద్యాధికారి గోలి శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో రమాదేవి GHM నారాయణపూర్, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యగ్గడి శ్రీనివాస్, హరికిషన్ రెడ్డి, యాదిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ ఉపేందర్, జిల్లా కార్యదర్శి సోమేశ్వర్, మండల అసోసియేట్ ప్రెసిడెంట్ అంతటి శ్రీనివాసులు, మండల మహిళా కార్యదర్శి శ్రావణి, LFL HM ఎల్లయ్య, లీలావతి, వాణిశ్రీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.