కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వివిధ పార్టీల ప్రముఖ నాయకులు
ఢిల్లీ: తెలంగాణకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో
1. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే
2. మోత్కుపల్లి నరసింహులు - మాజీ మంత్రి
3. ఏనుగు రవీందర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే
4. ఆకుల లలిత - ఎమ్మెల్సీ
5. నేతి విద్యా సాగర్ - మాజీఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్
6. సంతోష్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ
7. కపిలవాయి దిలీప్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ
8. నీలం మధు ముదిరాజ్ - పటాన్ చెరువు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు
ఈ సందర్భంగా నాయకులకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.
SB NEWS TELANGANA
SB NEWS NATIONAL NEWS APP













Oct 27 2023, 17:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.8k