/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 'అనుచిత వాక్యలు రాజబోడ పై చర్యలు తీసుకోవాలి' Mane Praveen
'అనుచిత వాక్యలు రాజబోడ పై చర్యలు తీసుకోవాలి'

చండూర్: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నారై రాజ్ బోడ పై చర్యలు తీసుకోవాలని, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కి  పిటిషన్ అందజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు నేరెళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షులు కడారి సైదులు యాదవ్, మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి అన్నెపాక శంకర్, బి వి ఎఫ్ జిల్లా కన్వీనర్ సామ్రాట్ కిరణ్,  మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, తిప్పర్తి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA STREETBUZZ APP

నల్లగొండ: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఘనంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి శుక్రవారం, నల్లగొండ పట్టణంలోని గణేష్ విగ్రహాల నిమజ్జన కేంద్రాలైన వల్లభరావు చెరువు మరియు భీమసముద్రంలను పరిశీలించి, నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA STREETBUZZ NEWS

NLG: మహిళా హక్కుల పరిరక్షణకై కదలిరావాలి, అక్టోబర్ 5న చలో ఢిల్లీ: పిలుపునిచ్చిన మల్లు లక్ష్మి

మహిళా హక్కుల పరిరక్షణకై అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అక్టోబర్ 5 న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని, మహిళా లోకానికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని, మహిళా హక్కులు కాలరాయబడుతున్నాయని ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు. పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా, ఆచరణలో ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. దేశంలో మహిళలపై ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మేలుకొని ఒక చట్టాన్ని రూపొందించి వదిలేస్తున్నాయన్నారు. బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందని విమర్శించారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ, మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం, మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మహిళలపై గౌరవం ఉంటే మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బిజెపి ఎందుకు అరికట్టడం లేదో ఈ సమాజానికి స్పష్టం చేయాలన్నారు.

మహిళపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా తలపెట్టిన అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మహిళలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఐద్వా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెం: పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండల కేంద్రంలో  'యూత్ ఫర్ బెటర్ సొసైటీ' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిలివేరు రఘు, పగడాల రఘు, అంజి, శేఖర్, శంకర్, అభిసందేశ్, దశరథ్, పవన్, రమేష్, వెంకటేష్, కిషోర్, పాండు, శ్రీకాంత్, మారి, శ్రీశైలం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ APP
TS: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Telangana: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం ఆసిఫాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(టీ)లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది.

ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. SB NEWS

SB NEWS TELANGANA

STREETBUZZ APP

బస్సు టికెట్లపై 10 శాతం రాయితీ ఇవ్వనున్న టీఎస్ ఆర్టీసీ

హైదరబాద్: తెలంగాణ ఆర్టీసీ దసరా సందర్భంగా, ముందస్తు టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి 29 వరకు ఆర్టీసీలో అప్ అండ్ డౌన్, ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంలో టికెట్ పై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది. దసరా సందర్భంగా భారీగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించింది. SB NEWS SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP
అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి: దోనూరి నర్సిరెడ్డి

నల్లగొండ జిల్లా, చింతపల్లి ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉద్యోగుల 11వ రోజు సమ్మె సందర్భంగా.. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి దోనూరి నర్సిరెడ్డి హాజరై అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే. రజిత, సువర్ణ ఏఐటీయూసీ అంగన్వాడీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమతి, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA

TS: మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దీక్షా బట్టు

హైదరాబాద్: 2021- 22 టీఎస్ జేసీజే నోటిఫికేషన్‌ లో జూనియర్ సివిల్ జడ్జిగా దీక్షా బట్టు ఎంపికయ్యారు.

ఉస్మానియా యూనివర్శిటీలో మొదటి స్థానం సాధించి, ఆమె ఎల్‌ఎల్‌బీ లో 2 బంగారు పతకాలు పొందారు.

అదేవిదంగా TS-PGLCET 2021 లో మొదటి ర్యాంక్ సాధించారు. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే TS JCJ, 2021-22 పరీక్షలో మొదటి స్థానంలో నిలిచి తన ప్రతిభ సామర్థ్యాలను ప్రదర్శించింది.

SB NEWS

SB NEWS TELANGANA STREETBUZZ NEWS
అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి: బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నకిరేకల్: అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నకిరేకల్ మున్సిసిపల్ చౌరస్తాలో గురువారం, అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన సందర్బంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె పాల్గొని దీక్షకు తమ సంఘీభావం, పూర్తి మద్దతును తెలిపారు.

ఈ సందర్బంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ లొ మళ్ళీ అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మినెంట్ చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు అదే కేసీఆర్ హామీలను అమలుచేయకుండా రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ మెడలు వంచి హక్కులను సాధించేవరకు ఆగేది లేదని తెలిపారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దత్తు తెలిపారని  తాము అధికారంలొకి వస్తే మొదటి సంతకంతోనే అన్ని రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసే కార్మికులందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ దొరల పాలనను గద్దెదించి సమిష్టిగా బహుజన రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, యోగి, మహేష్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి, అరుణ, శోభ, చంద్రమ్మ, శుభాషిణి, జయమ్మ, లతిఫ, మంగ, లక్ష్మి, వెంకటమ్మ, బి ఎస్ పి నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA
TS: ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బక్కి వెంకటయ్య నియామకం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్ ను, సభ్యులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్ )ను, ముఖ్యమంత్రి నియమించారు.

సభ్యులుగా  కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్)

రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ)

కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్)

జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ జిల్లా), 

రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్) లను సీఎం నియమించారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నది.
SB NEWS

SB NEWS TELANGANA