/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 16:21

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం..

భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు రెండు గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు..

రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగగా.. సహాయక చర్యలను పరిశీలించారు.. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీశారు.. రెండు గంటల పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు… కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని.. కానీ, చెడ్డపేరు తెచ్చేలా ఉంటే మాత్రం ఊరుకునేది లేదంటా వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 16:19

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నీటిని కిందికి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2, 3 నెంబర్ గేట్ల ప్యానెల్ లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ కాయిల్స్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగువన జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.26 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ప్రాజెక్టు నుంచి 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్ కు వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 214.8870 టీఎంసీలకు చేరిందని, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అని పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 15:56

బాబాయ్‌కి వ‌రుణ్ బ‌ర్త్‌డే విషెస్‌... ఆక‌ట్టుకుంటున్న ప‌వ‌న్‌ అరుదైన ఫొటో

నేడు ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు జ‌న‌సేనానికి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

ఇక ప‌వ‌న్ కుటుంబ స‌భ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బాబాయ్‌కి శుభాకాంక్ష‌లు తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటాను. ధ‌ర్మం వైపు మీరు అనుస‌రించిన మార్గం, ఇత‌రుల‌కు స‌హాయం చేయాల‌నే మీ తిరుగులేని సంక‌ల్పం ఎప్పటికీ స్ఫూర్తిదాయ‌కం. మీలోని అగ్ని ప్ర‌కాశ‌వంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా పవర్ స్టార్మ్. హ్యాపీ బ‌ర్త్‌డే జ‌న‌సేనాని" అంటూ వ‌రుణ్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు

ఇక ఈ ట్వీట్‌కు త‌న చిన్న‌నాటి ఫొటో ఒక‌టి జోడించాడు. ఆ ఫొటోలో ప‌వ‌న్ సోఫాలో కూర్చొని ఉండ‌గా, వ‌రుణ్ ఆయ‌న కాళ్లు ప‌డుతున్నాడు. వ‌రుణ్‌ను ప‌వ‌న్ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు పోజు పెట్ట‌డం కూడా ఆ ఫొటోలో ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 15:52

వరద సహాయక చర్యల్లో నేవీ హెలీకాఫ్టర్లు...

ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఏపీలో (Andhrapradesh) భారీ వర్షాలతో (Heavy Rains) జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు (Navy helicopters) రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు.

నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతోంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బ్యారేజి వద్ద 11 లక్షల 40 వేల 776 క్యుసెక్కులకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తరువాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి.

3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. అలాగే వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్ పాల్గొంటోంది. మరికాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 చాపర్స్ రానున్నాయి. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని అటు ప్రభుత్వం.. ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 01 2024, 14:52

సీఎం చంద్రబాబు సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీఎస్ (CS), డీజీపీ (DGP), మంత్రులు (Ministers), జిల్లా కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SPs)లతో టెలికాన్ఫరెన్స్ (Teleconference) ద్వారా సమీక్ష (Review) నిర్వహించారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సూచించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు.

వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం చంద్రబాబు అదేశించారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కులపైచిలుకు వరద వస్తుందని టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శనివారంతో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని, అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు.. కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు.

గత 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని, ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని... దానికి అనుగుణంగా రిస్క్యూ ప్లాన్ చేయాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని, గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలని ఆదేశించారు. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని తెలిపిన మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజువీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని... రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు.ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అధికారుల అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలకు పంపాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ జిల్లా, రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికులకు సాయంపై జిల్లా కలెక్టర్, డీజీపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలని చంద్రబాబు సూచించారు. మనం చేసే పనితో ప్రజల్లో సంతృత్తి కలగాలని, మనం మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. పంటల అంచనాను తప్పకుండా వేయాలని, ఎక్కడా పెండింగ్‌లో పెట్టకూడదని, డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, ఒక్క ఎకరా కూడా మిస్ కావొద్దన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని, దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలన్నారు. పనితీరు, వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదని.. మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నామని... వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని మరోసారి సూచించారు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 01 2024, 14:46

స్వయంగా రంగంలో దిగిన హైడ్రా కమిషనర్

భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

భారీ వర్షాల ధాటికి అమీర్‌పేట్, బేగంపేట్, షేక్‌పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి.. నగరవాసులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడం, రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు- అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు.

రోడ్లపై నిలిచిన వర్షపునీటిలో పిల్లలు, వృద్దులు ఒంటరిగా బయటికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించవద్దని సూచించారు. వర్షపు నీరు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో స్థానికులు తమ పరిధిలో ఉన్న మ్యాన్ హోల్స్‌ను తెరవకూడని అన్నారు. ఒకవేళ అవి తెరచి ఉంటే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితుల మధ్య హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. షేక్‌పేట్, టోలీచౌకీల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో కలియదిరిగారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందితో మాట్లాడారు. వర్షపునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 01 2024, 14:29

సూర్యాపేటలో సాగర్‌ ఎడమ కాలువకు గండి..

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది. దీంతో పంట పొలాల ద్వారా గ్రామంలోకి వరద నీరు చేరుతున్నది. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గత నెల 6న కూడా సాగర్‌ లో లెవల్‌ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద కాలువకు గండిపడటంతో నీరు పొల్లాలోకి చేరింది.

ఇక మూసీ ఎడమ కాలువకు కూడా గండి పడింది. ఆదివారం మధ్యాహ్నం పిల్లలమర్రి, పిన్నాయిపాలం మధ్య ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతున్నది. దీంతో సమీపంలోని పంటపొలాల్లోకి వరద నీరు పోతున్నది. గండిపడిన ప్రదేశానికి ఇరిగేషన్‌ అధికారులు చేరుకున్నారు. గండిని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 01 2024, 14:24

బెజవాడను ముంచెత్తిన భారీ వర్షం.. 200 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్గా తీరంలో ఎటుచూసినా వర్షాలే వర్షాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ సూచనలతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో జిల్లాలకు విపత్తు నిధులను విడుదల చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయంకావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్ధలయ్యాయి. రహదారులన్నీ ఏరులయ్యాయి. ఏకధాటి వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు ఇళ్లపై విరిగి పడి.. ఆరుగురు మృతి చెందారు.

బెంజిసర్కిల్‌లో 161 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కే ప్రణీత్ తెలిపారు. ఈస్థాయిలో ఆగస్టులో వర్షం కురువడం 200 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని అన్నారు. తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సరిగ్గా పాతికేళ్ల కిందట 1999లో ఈ స్థాయిలో వరదనీరు, వర్షపునీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

బుడమేరు సైతం నాడు పొంగి అనేక ప్రాంతాలు మునకేశాయి. నాటి పరిస్థితులు తలిపించేలా ఇప్పుడు విజయవాడ నగరం వర్షపునీటితో మునిగిపోయింది. రహదారులు, డ్రెయిన్లు ఏకమై.. పలు ప్రాంతాల్లో వర్షపునీరు 2-6 అగుడుల ఎత్తున నిలిచిపోయింది. శివారు ప్రాంతాలు, కాలనీలు పూర్తిగా నీటమునిగాయి

పదుల సంఖ్యలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరడంతో పలు కుటుంబాలు ఖాళీచేసి బంధువులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ట్రాకులపై వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.భారీ వర్షాలకు బుడమేరు పొంగిపొర్లడంతో కొండపల్లి మండలం శాంతినగర్ ఇందిరమ్మ కాలనీని వరదనీరు ముంచెత్తింది. శనివారం రాత్రి సుమారు 200 కుటుంబాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వీరిని రక్షించేందుకు అక్కడ చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినా.. అధికారులు మాత్రం జేసీబీల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడి బోటు సహితం గల్లంతైంది. బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 18:04

ఏపీలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కాగా, జేసీబీలు, పొక్లెనర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మట్టి పెళ్లలు ఇంకాపడుతున్నాయి. మట్టిపెళ్లలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో జేసీబీలు, పొక్లెనర్లను సిబ్బంది వెనక్కు తీసుకెళ్లారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండ చరియలు మరింతగా పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలాగే క్రీస్తురాజపురంలో రెండు ఇళ్లపై కొండచరియలు పడ్డాయి. సున్నపుబట్టీల దగ్గర కొండచరియలు పడి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లల్లో చిక్కుక్కున్న వారిని భయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు.

జల దిగ్బందంలో మైలవరం పట్టణం ఉండిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. మైలవరం ఎర్ర చెరువుకు గండి, తారక రామనగర్‌‌‌‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మైలవరం ప్రధాన సెంటర్‌‌లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మైలవరంలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చండ్రగూడెం శివారు జంగాలపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కొండ వాగు ఉధృతికి మైలవరం - పొందుగల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుడమేరు వరద అంతకు అంత పెరుగుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 17:59

చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి అధికారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ అధికారులు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు ఉన్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్ఓ‌పై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసు నమోదైంది. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కేసులను సీపీ అవినాష్ మహంతి నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు అయ్యాయి. అదనపు సిబ్బందితో హైడ్రా మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ సైతం ఏర్పాటు కానుంది. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించగా.. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ కానున్నాయి. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చి మరీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను సిద్ధం చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఆరుగురిపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మరోవైపు మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్థు భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన ముగ్గురు బిల్డర్స్‌పై కేసులు నమోదయ్యాయి. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులుపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులను ముగ్గురు బిల్డర్స్ నిర్మించారు.