పద్మశ్రీ పురస్కారం కు ఎన్నికైన కూరెళ్లకు బీఎస్పీ సన్మానం
భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సాహిత్య విషిష్ఠ సేవలను గుర్తించి డా. కూరెళ్ళ విఠలాచార్యకు పద్మ శ్రీ పురస్కారం లభించిన సందర్బంగా.. వెల్లంకి గ్రామంలో తన స్వగృహంలో బిఎస్పి ఆద్వర్యంలో ..సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్బంగా ..బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ ..తనకు మిగిలిన ఏకైక ఆస్తి ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి ,కవి ,డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అని అన్నారు.కూరెళ్ల అందరివాడని, ఆయన సేవలు మనందరికీ అవసరమని అన్నారు.పెన్షన్ డబ్బులతో మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి.. లక్షల పుస్తకాలు సేకరించిన మహోన్నత వ్యక్తి విఠలాచార్య అని కొనియాడారు.చిన్నతనం నుంచే అనేక కష్టాలను చూసిన వ్యక్తి ,ఏడేళ్ల ప్రాయంలోనే రచనలు చేయడం ఆయనకున్న పట్టుదలకు నిదర్శనమన్నారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక సాహితీ,విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన సహకారంతో అనేక మంది విద్యార్థులు ...పైకెదిగి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారని తెలిపారు.తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది జీవితాన్నే సాహిత్యానికి అంకితమిచ్చిన డా.కూరేళ్ళ విఠలాచార్య ఈ ప్రాంత వాసులు కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ లభించడం, చాలా అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు జోగు శేఖర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,రామన్నపేట మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, కొంగరి రాజా లింగం,మేడి నవీన్, కూరెళ్ల వ్యక్తిగత సహాయకులు తాటిపాముల స్వామి బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు
















వలిగొండ మండల కేంద్రంలో ,అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ 75వ జయంతి సందర్భంగా గద్దర్ ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గద్దర్ విప్లవ పార్టీ కార్యకర్త ,రచయిత, గాయకుడు ,గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ విప్లవ కవి ,ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కు గుర్తుగా తీసుకోవడం జరిగిందని అన్నారు.కళాకారులు మాట్లాడుతూ ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి.. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టా నష్టాలను ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజేసేవారు. ఆయన పాడిన పాటలకు మేము ఆకర్షితులమై కళాకారులంగా ఇప్పుడు మేము జీవిస్తూనే ఉన్నాము... ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ,వెనకబడ్డ కులాలకు ఎంతో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ఎస్సీ , ఎస్ టి, బీసీ ,మైనార్టీ సంఘాలు, రాజకీయ నాయకులు ,ఘనంగా జయంతిని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కొత్త రామచందర్ ,మామిండ్ల రత్నయ్య, రవీందర్, పెరమండ్ల యాదగిరి ,సాయిని యాదగిరి, ఆకుల వెంకటేశం ,సత్తిరెడ్డి, కొండూరు సత్తయ్య, శీను, గోదా అచ్చయ్య ,పోలె పాక సత్యనారాయణ ,లోతుకుంట సర్పంచ్ బిక్షపతి ,కందుల అంజయ్య, బిక్షపతి, నరసింహ, పోలేపాక బిక్షపతి, పవన్ కుమార్ ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.






యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడి ఘటనలో , పక్షపాత ధోరణితో , దురుసుగా.. వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై.. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ డిజిపి కి బిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై , చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు... ఎల్ రమణ ,మాజీ శాసనసభ్యులు.. భాస్కరరావు, శానం పూడి సైది రెడ్డి , పైళ్ళ శేఖర్ రెడ్డి, కోరు కంటి చందర్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ,సిహెచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..








Feb 01 2024, 20:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.9k