ఉద్యోగాలైన ఇవ్వండి , నిరుద్యోగ భృతి నైనా కల్పించండి : సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
అఖిలభారత విద్యార్థి సమాఖ్య-AiSF, అఖిలభారత యువజన సమాఖ్య-AiYF, ఉమ్మడి సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎల్లంకి మహేష్ గారి అధ్యక్షతన జరిగినది .ఈ సమావేశానికి *ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదాశ్రీ రాములు హాజరై మాట్లాడుతూ.... నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రధానంగా యువకులు ,విద్యార్థులు, లక్షలాదిమంది ఏలాంటి పనులు లేకుండా ఉన్నారని ..నిరుద్యోగులకు ఉద్యోగాలైన ఇవ్వండి లేదా వారికి నిరుద్యోగ భృతి 5000 రూపాయలు ,రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈనెల 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువజన,విద్యార్థి సంఘాలు అమలు కోసం ...చలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపు నిచ్చారు .అలాగే యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవాలయం నిధులతో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించాలని, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ,అలాగే రైతులు వ్యవసాయ కూలీలు సాగు త్రాగునీరు కోసం బూనాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువలు కూడా పూర్తి చేయాలని, గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని ,మూసి ప్రక్షాళన త్వరగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ,మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం యువజన విద్యార్థి సంఘాలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విద్యార్థి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉప్పులశాంతి కుమార్, పెరబోయిన మహేందర్, వస్తువుల అభిలాష్,మమ్మద్ నయీమ్,సూరారం జానీ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, మారుపాక లోకేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి, బద్దుల శ్రీనివాస్, బూడిద సాయి చరణ్, సునారి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
![]()





యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడి ఘటనలో , పక్షపాత ధోరణితో , దురుసుగా.. వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై.. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ డిజిపి కి బిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై , చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు... ఎల్ రమణ ,మాజీ శాసనసభ్యులు.. భాస్కరరావు, శానం పూడి సైది రెడ్డి , పైళ్ళ శేఖర్ రెడ్డి, కోరు కంటి చందర్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ,సిహెచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..








యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి మిర్యాల గూడెం రోడ్డు ప్రమాదంలో, గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లో, ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన పార్థివ దేహాలకు, పూల మాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబంలో మృతి చెందిన వారికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు నియాన్ష్ ప్రమాదం జరిగిన సమయంలో చనిపోయారు. అతని భార్య మాధవి చికిత్స పొందుతూ.. మరణించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా గొల్నేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు బెలిదె నాగేశ్వర్ గంగాపురం దైవాధీనం గౌడ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Jan 31 2024, 17:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.9k