/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల Yadagiri Goud
తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 28న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు.

మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

AP CID: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు

హైదరాబాద్‌: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు..

అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అదికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ మూడవ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యకర్తల శ్రేయస్సే జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యం

•జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్య చంద్ర

నర్సీపట్నం : కార్యకర్తల శ్రేయస్సే జన సేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.

శుక్రవారం ఆయన నర్సీపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ కార్యకర్తల యోగక్షేమాలు కాంక్షించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహా సంకల్పం చేపట్టారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని జనసేన పార్టీ ద్వారా చేసి చూపిస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఇన్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తున్నారన్నారు.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళాన్ని అందజేయడం జరిగిందన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద భీమా చేయించే నిమిత్తం గత రెండు సంవత్సరాలుగా ఏటా రూ. కోటి చొప్పున విరాళాన్ని అందజేశారని, మూడో ఏటా తన వంతుగా కోటి విరాళాన్ని అందించారన్నారు. ఎంతో ఆశయం, త్రికరణ శుద్ధితో పనిచేసే కార్యకర్తలే జనసేన బలం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ఆలోచించి వారి బాగోగులు చూసే జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం నాయకులు కొత్తకోట రామశేఖర్, మారిశెట్టి రాజా, నాతవరం మండల యువత అధ్యక్షులు బైన మురళీ, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, వీసం వెంకటేష్, పరవాడ లోవరాజు తదితరులు పాల్గొన్నారు..

చిన్నారిపై కుక్కల దాడి : నగరం మేయర్ ని ఆ కుక్కల మధ్య వదలండి. రామ్ గోపాల్ వర్మ

అంబర్ పేట్ లో జరిగిన వీధి కుక్కలు దాడి ఘటనపై గద్వాల్ మేయర్ విజయలక్ష్మిని విమర్శిస్తూ సిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైదరాబాద్ అంబర్ పేట్ లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బలుడు ప్రదీప్ మరణించిన ఘటన అందరినీ తీవ్రంగా కలిసి వేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి) విఫలమైందంటూ విమర్శించారు. శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేసాయని. నగరం మేయర్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణ పై రాంగోపాల్ వర్మ మండిపడ్డారు.

Narendra Modi: మాకు మోదీ కావాలి.. పాకిస్థానీ వీడియో వైరల్‌
ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో పాకిస్థాన్‌(Pakistan) అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు (Petrol Price), రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ పరిస్థితులపై ఓ స్థానికుడు స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. 'షరీఫ్‌ వద్దు.. ఇమ్రాన్‌ వద్దు.. మాకు ప్రధాని మోదీ (Narendra Modi) కావాలని.. ఆయనే దేశ పరిస్థితులను చక్కదిద్దగలర'ని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఓ పాకిస్థానీ యూట్యూబర్‌ తీసిన వీడియో (Viral Video)లో.. అతను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. 'పాక్‌ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ఓ స్థానికుడిని యూట్యూబర్‌ ప్రశ్నించగా.. అతను వాస్తవమేనని పేర్కొన్నాడు. దేశ విభజన జరగకుండా.. రెండు దేశాలు కలిసి ఉంటే ఈరోజు తాము కూడా భారత్‌ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లమని తెలిపాడు. రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడి ఉండి ఏం లాభమని వాపోయాడు. పాకిస్థానీయులు తమను భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలిక లేదని వ్యాఖ్యానించాడు. పాక్‌ను గట్టెక్కించగలిగేది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అతను పేర్కొన్నాడు. 'మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు అవసరం లేదు. మాకు కేవలం ప్రధాని మోదీ కావాలి. పాక్‌లోని అన్ని వ్యవహారాలను ఆయన సరిదిద్దగలరు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాక్‌ ఆ దేశం దారిదాపుల్లో కూడా లేదు' అని చెప్పాడు. మోదీ పాలనలో జీవించేందుకు సిద్ధమేనని చెబుతూ.. 'మోదీ గొప్ప వ్యక్తి. చెడ్డవాడు కాదు. భారతీయులు సరసమైన ధరలకే టమాటా, చికెన్‌, పెట్రోల్‌ వంటివి పొందుతున్నారు. మోదీ మాకు కావాలి. ఆయన పాక్‌ను పాలించేలా, బాగు చేసేలా చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా' అని అన్నాడు.
నేడు మార్చి నెల వర్చువల్‌ సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన వర్చువల్‌ సేవా టికెట్లను

తితిదే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.

ఇందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, సంబంధిత దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తుంది.

రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నాతో పెట్టుకోకు

భద్రాద్రికొత్తగూడెం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘హాత్ సే హాత్ జోడో’’ పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగా కౌంటర్ అటాక్‌కు దిగారు.

గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు’’ అంటూ హెచ్చరించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు తెలిపారు. ఇక్కడ బలంగా ఉందంటే తానే కారణమని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం ఉన్నది తానొక్కడినే అని ఆయన తెలిపారు.

‘‘గిరిజనుడిని అనే అక్కసుతో నన్ను తొలగించిన వీళ్లా... నా గురించి మాట్లాడేది. తెలంగాణా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు... నేను రాజ్యాంగ బద్దంగా విలీనమయ్యాను. ఓటుకు నోటు కేసులో ఉన్న వీళ్లా నాగురించి మాట్లాడేది. నామీద చార్జ్‌షీట్.. నీకు దమ్ముంటే ఎవరైనా రండి.. 300 ఎకరాలు నేను ఆక్రమించినట్టు రుజువు చేయండి.. ముక్కు నేలకు రాస్తా’’ అంటూ సవాల్ విసిరారు. రేవంత్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని... అన్ని స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాపై వేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే అసలు పోటీ నుంచే తప్పుకుంటానని రేగా కాంతారావు స్పష్టం చేశారు..

ఘోరం: తనను చూసి నవ్వారని.. నిలబెట్టి ఏడుగురిని చంపేశాడు..!

బ్రెజిల్‌ (Brazil)లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని.. ఓ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు (Gun Firing) జరిపాడు.

ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్‌ నగరానికి చెందిన ఎడ్గర్‌ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్‌ హాల్‌ (Pool Hall)కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్‌ (బ్రెజిల్‌ కరెన్సీ)కు పందెం కాసి పూల్‌ గేమ్‌ (Pool Game)లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్‌ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.

దీంతో కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్‌ యజమాని సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Guntur: ఐటీ అధికారులమంటూ డబ్బు, బంగారంతో పరారీ.. గుంటూరులో ఘరానా మోసం

గుంటూరు: ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో గురువారం ముగ్గురు వ్యక్తులు వచ్చారు..

తాము ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిపత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయడంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు తీసుకుని ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితురాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.