NLG: బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీలకు తీవ్రమైన నష్టం: పిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
నల్లగొండ:
గత ప్రభుత్వం కలిపిన బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్ లను మళ్లీ విడగొట్టాలని తద్వారానే బీసీ ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుందని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.
ఈరోజు నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ కమిషన్ బహిరంగ విచారణలో తన అభిప్రాయాన్ని తెలిపారు.
నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను విడిగా ఉన్న వాటిని ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వీటి రెండింటిని విడగొట్టాలని దీనివల్లనే బీసీ విద్యార్థులకు, బీసీ ప్రజలకు సమగ్రమైన న్యాయం జరుగుతుందని అన్నారు.
ఉద్యోగ నియామకాలు చేయలేక, బీసీ ప్రజల జనాభా కనుగుణంగా నిధులను ఇవ్వలేక, సరైన అభివృద్ధి పథకాలు లేక.. బీసీ వెల్ఫేర్ ను కార్పొరేషన్ ను కలిపారని, ఈ విధంగా కలపడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రస్తుతం బీసీ కమిషన్ ను వేసినందున ఆ కమిషన్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, మళ్లీ వాటిని విడగొట్టి అత్యధిక నిధులు రాబట్టాలని వారు కోరారు.

నల్లగొండ: 
నల్లగొండ: జిల్లా విద్యాధికారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ 14,17 బాల బాలికల 'నెట్ బాల్' సెలక్షన్స్, ఈనెల 20 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ విమల తెలిపారు.
నల్గొండ జిల్లా, చండూరు మండలం:
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
నల్గొండ జిల్లా, మునుగోడు:
నల్లగొండ జిల్లా:
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.
నల్లగొండ జిల్లా, చండూరు మండలం:
Nov 18 2024, 21:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k