భారత్‌తో సంబంధాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసిన నవాజ్ షరీఫ్,

భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ పర్యటన తర్వాత, పాకిస్థాన్ "మర్యాద"లో ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 16న పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌కు కొత్త ఆశలు చిగురించాయి, పాకిస్థాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌ఎన్‌ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. జైశంకర్ పాకిస్థాన్ పర్యటన నాంది అని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇక్కడి నుంచి భారత్, పాకిస్థాన్ తమ చరిత్రను వదిలిపెట్టి ముందుకు సాగాలి.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు షరీఫ్, భారతీయ పాత్రికేయులతో మాట్లాడుతూ, జైశంకర్ పాకిస్తాన్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలకు ముఖ్యమైనదని అన్నారు. దీని కారణంగా ఇంధన సంక్షోభం మరియు వాతావరణ మార్పుల వంటి వాటి సమస్యలపై దృష్టి సారించే అవకాశాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ పొందవచ్చు. ఇరు దేశాలు శాంతి ప్రక్రియను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

75 ఏళ్లు కోల్పోయాం: షరీఫ్

ఈ వ్యవహారం ఇలాగే సాగుతుందని షరీఫ్ అన్నారు. ఇది ముగియకూడదు. మోడీ సాహెబ్ స్వయంగా ఇక్కడికి వచ్చి అడ్రస్ సమర్పించి ఉంటే బాగుండేది, జైశంకర్ కూడా రావడం విశేషం. ఇప్పుడు మనం ఎక్కడ వదిలేశామో అక్కడి నుండి తీయాలి. 75 ఏళ్లు కోల్పోయాం, ఇప్పుడు రాబోయే 75 ఏళ్ల గురించి ఆలోచించాలి.

ప్రధాని మోదీ లాహోర్‌ పర్యటనను ప్రశంసించారు

2015 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో చేసిన ఆకస్మిక పర్యటనను ప్రశంసించిన షరీఫ్, రెండు దేశాల మధ్య సంబంధాలలో "సుదీర్ఘంగా ఉన్న స్తబ్దత"తో తాను సంతోషంగా లేనని, ఇరుపక్షాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పొరుగు దేశాలను మార్చలేమని, పాకిస్థాన్‌ను లేదా భారత్‌ను మార్చలేమని నవాజ్ అన్నారు. మనం మంచి పొరుగువారిలా జీవించాలి.

రిలేషన్స్‌లో సుదీర్ఘ విరామంతో నవాజ్ సంతోషంగా లేడు

మా నాన్న పాస్‌పోర్ట్‌లో ఆయన జన్మస్థలం అమృత్‌సర్ అని రాసి ఉందని నవాజ్ షరీఫ్ అన్నారు. మనం ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష, ఆహారం పంచుకుంటాం. మా రిలేషన్‌షిప్‌లో సుదీర్ఘ విరామం ఉన్నందుకు నేను సంతోషంగా లేను. నాయకుల మధ్య సత్ప్రవర్తన లేకపోవచ్చు కానీ, ప్రజల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. భారతదేశ ప్రజల కోసం ఆలోచించే పాకిస్థాన్ ప్రజల తరపున నేను మాట్లాడగలను మరియు భారతీయ ప్రజల కోసం నేను అదే చెబుతాను.

చెడిపోయిన సంబంధాలకు ఇమ్రాన్ ఖాన్‌ను బాధ్యులను చేశాడు

ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని షరీఫ్ పేర్కొన్నాడు మరియు ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. షరీఫ్ వాడిన భాష భారత్ తో సంబంధాలను దెబ్బతీసిందని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడటం వదిలేయండి, నాయకులు ఆలోచించకూడదు.

హమాస్_చీఫ్_సిన్వార్_చివరి_క్షణాలు

యాహ్యా సిన్వార్ చివరి క్షణాలు డ్రోన్‌లో బంధించబడ్డాయి, అతని మరణానికి ముందు 'బచర్ ఆఫ్ ఖాన్ యూనిస్' పరిస్థితి ఇలా ఉంది

అక్టోబరు 7న జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి, గాజాకు చెందిన బిన్ లాడెన్‌గా పేరొందిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గురువారం జరిగిన ఆపరేషన్‌లో సిన్వార్‌ మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైనిక దళాల ప్రతినిధి ధృవీకరించారు. సైనికుల నుంచి తప్పించుకోవడానికి హమాస్ చీఫ్ దాక్కోవడానికి వెళ్లిన భవనాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేయడంతో యాహ్యా సిన్వార్ చనిపోయాడు. సిన్వార్ హత్యకు ముందు ఇజ్రాయెల్ సైన్యం కెమెరాలో బంధించింది, ఇది అతని చివరి క్షణాలను వెల్లడిస్తుంది. యాహ్యా సిన్వార్ చివరి క్షణాల వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది మరియు అందులో కనిపిస్తున్న వ్యక్తి యాహ్యా సిన్వార్ అని పేర్కొంది. మృత్యువు సోఫాలో కూర్చున్న యాహ్యా సిన్వార్, మరణిస్తున్నప్పుడు నెతన్యాహు పట్ల తన వైఖరిని ప్రదర్శిస్తూ కనిపించాడు. ఇందులో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ మరణానికి ముందు ఆయన చివరి క్షణాలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌లోని 450వ బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు అనుమానితుడు ఒక భవనంలోకి ప్రవేశించి బయటకు వెళ్లడం చూశాడు. సైనికుడు తన కమాండర్‌కు సమాచారం అందించాడు, ఆ తర్వాత కాల్పులు జరపమని ఆర్డర్ ఇవ్వబడింది. మధ్యాహ్నం 3 గంటలకు, ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారడానికి ప్రయత్నిస్తున్నారని ఐడిఎఫ్ డ్రోన్ ద్వారా గమనించింది. ఇద్దరు వ్యక్తులు దుప్పట్లు కప్పుకుని ముందుకు నడుస్తుండగా, మూడో వ్యక్తి వెనుక ఉన్నాడు.

450వ బెటాలియన్ కమాండర్ ముగ్గురిపై కాల్పులు జరిపాడు, దీనివల్ల వారు విడిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలోకి పారిపోగా, మూడో వ్యక్తి ప్రత్యేక భవనంలోకి ప్రవేశించాడు. ఈ మూడో వ్యక్తి సిన్వార్. అయితే, ఆ సమయంలో ఇజ్రాయెల్ సైనికులు సిన్వార్‌ను చుట్టుముట్టినట్లు తెలియదు. ఇంతలో సిన్వార్ బిల్డింగ్ రెండో అంతస్తులోకి వెళ్లాడు. IDF అతనిపై ట్యాంకులతో కాల్పులు జరిపింది.

ఇజ్రాయెల్ సైనికులు భవనం వద్దకు చేరుకోగా, లోపల నుండి వారిపై రెండు గ్రెనేడ్లు విసిరారు. దీని తర్వాత సైనికులు వెనక్కి వెళ్లి డ్రోన్ పంపారు. డ్రోన్ భవనం లోపల గాయపడిన వ్యక్తిని గుర్తించింది, అతని ముఖం కప్పబడి ఉంది. గదిలోని చెత్తాచెదారం మధ్య సోఫాలో కూర్చుని చేతిలో కర్ర ఉంది. డ్రోన్ అతని దగ్గరికి రాగానే, అతను తన కర్రను విసిరి డ్రోన్ పడిపోయేలా ప్రయత్నించాడు. ఆ తర్వాత ఐడీఎఫ్ ట్యాంకులతో భవనంపై దాడి చేసింది.

ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ, డ్రోన్ నుండి ఈ ఫుటేజీని రికార్డ్ చేసినప్పుడు, ఇజ్రాయెల్ ఆర్మీ అతను సాధారణ హమాస్ ఫైటర్ అని భావించింది. అయితే, సిన్వార్ మరణానంతరం గుర్తించినప్పుడు, అతను సాధారణ పోరాట యోధుడు కాదని, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అని తేలింది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా యాహ్యా సిన్వార్ మృతిని ఆర్మీ ధృవీకరించింది.

భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

భోపాల్‌ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్‌ షాప్‌ నిర్వహించే ఫైసల్‌ఖాన్‌ ఆ వీడియోలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌”, ‘భారత్‌ ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయడం కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ పలివాల్‌ అతడికి బెయిలు మంజూరు చేస్తూ.. ఫైసల్‌ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు. జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు.

కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందే..

కోయంబత్తూర్‌ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు.

కోయంబత్తూర్‌ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు.

తనను ముందుగానే విడుదల చేయాలన్న ప్రభుత్వ సిఫారసును గవర్నర్‌ నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసు విచారించిన న్యాయస్థానం, మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, గవర్నర్‌(Governor) దానిని ఉల్లంఘించలేరన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేస్తూ.. పిటిషనర్‌ దరఖాస్తును పునః పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.

అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఆరు

అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు.

అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు. అంతస్తుకు ఇంత అంటూ అక్రమ వసూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు నిబంధనల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వస్తోన్న ఫిర్యాదుల్లో 50 శాతానికిపైగా పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, వసంతనగర్‌(KPHB, Balajinagar, Vasanthanagar), గోపాల్‌నగర్‌, కైత్లాపూర్‌, కేపీహెచ్‌బీ 15వ ఫేజ్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్టిల్ట్‌ ప్లస్‌ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఐదు నుంచి ఏడంతస్తులు నిర్మిస్తోన్నా.. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కనీసం నోటీసులు ఇచ్చే సాహసం చేయడం లేదు. స్థానిక కాలనీ, యువజన, ఇతర సంఘాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఉన్నత స్థాయి ఆదేశాలతో అప్పుడప్పుడు నిర్మాణాల వద్దకు వస్తోన్న అధికారులు కొన్ని రోజులు ఆపి తిరిగి పనులు ప్రారంభించాలని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్నారు. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్‌-5లోని ఎల్‌ఐజీ 111 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని.. పార్కింగ్‌ స్థలం కూడా వదలకుండా ఓ వ్యక్తి ఏకంగా ఆరంతస్తుల భవనం నిర్మించాడు. స్థానికులు పలుమార్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.

వెంగళరావునగర్‌ ఎల్‌ఐజీహెచ్‌లోని ప్లాట్‌ నెంబర్‌ 48బీలో ఓ వ్యక్తి స్టిల్ట్‌ ప్లస్‌ మూడంతస్తులకు నివాస కేటగిరీలో అనుమతి తీసుకున్నాడు. అదనంగా ఓ అంతస్తు నిర్మించడంతోపాటు.. ఐదో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు. నివాసం కోసం పర్మిషన్‌ తీసుకొని భవనాన్ని హాస్టల్‌ నిర్వహణకు అనువుగా నిర్మిస్తున్నారు. దీంతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో స్లాబ్‌కు స్వల్పంగా రంధ్రాలు చేసి వదిలారు. అనంతరం వాటిని ఫిల్‌ చేసిన నిర్మాణదారుడు గోడలకు ప్లాస్టింగ్‌, రంగులు, ఇతరత్రా పనులు ప్రారంభించారు.

ఈ విషయంపై స్థానికులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో పాక్షికంగా కాదు.. అక్రమంగా చేపట్టిన నిర్మాణం పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని గత నెల 16వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులైనా.. జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు భవనం వద్దకు వెళ్లలేదు. ఓ డీఎస్పీ ఒత్తిడితోనే బల్దియా వర్గాలు భవనం జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. కొందరు అధికారులకు భారీగా ముట్టచెప్పారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి భవన నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.

భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.

రాష్ట్రంలో (Andhrapradesh) మరోసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈరోజు (శుక్రవారం) కూడా కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.

అటు ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. మార్కాపురం మండలం బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తర్లుపాడు - మార్కాపురం మధ్య కొండ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1631.93 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 50,593 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 36,799 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 101.500 టీఎంసీలుగా నమోదు అయ్యింది..

ఇటు నంద్యాలలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 79,536 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 67,626 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కెనడాలో ఇదీ భారతీయం

వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్‌ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం

వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్‌ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది. అయితే, దీన్ని పక్కనపెడితే కెనడాలో భారతీయులది బలమైన సమాజం. పలు రంగాల్లో మనవారు స్థిరపడ్డారు. ఆ వివరాలు గణాంకాల్లో..

20 ఏళ్లలో కెనడాలో భారతీయుల సంఖ్య రెట్టింపును మించింది.

1980 వరకు భారత్‌లో పుట్టి కెనడా వెళ్లినవారు 63,535. 1991-2000 మధ్యన ఈ సంఖ్య 1.45 లక్షలు. 2006-10 నడుమ 1.19 లక్షలు. 2016-21 మధ్య 2.46 లక్షలు.

ఐదేళ్లలో డబుల్‌: 2019లో కెనడాలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 2.18 లక్షలు కాగా, ప్రస్తుతం 4.27 లక్షలు.

పౌరసత్వంలో పైపైకి..: కెనడా పౌరులుగా మారుతున్న భారతీయుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ఈ శాతం 2017లో 44.3 కాగా.. 2021లో 61.1 శాతం.

అక్కడ మన వారి జాబ్‌ ప్రొఫైల్‌ కూడా బాగుంటోంది. మెరుగు పడుతోంది కూడా. ప్రవాసుల్లో 50 శాతం మంది డిగ్రీ హోదాతో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తమ్మీద కార్యనిర్వాహక (మేనేజీరియల్‌) పోస్టుల్లో 10 శాతం లోపే ఉన్నారు. అయితే, ఇటీవల వెళ్లినవారిలో 19శాతం మంది ఈ పోస్టులు పొందారు.

భారత్‌కు పప్పు ధాన్యాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం కెనడా.

భారత్‌ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు అధికంగా కెనడాకు ఎగుమతి అవుతుంటాయి.

600 పైనే: భారత్‌లో ఉన్న కెనడాకు చెందిన కంపెనీలు. వీటిలో టిమ్‌ హర్టన్స్‌ కాఫీ చైన్‌, శీతల ఆహార పదార్థాల సంస్థ మెక్‌ కెయిన్‌ కూడా ఉన్నాయి. 75 బిలియన్‌ అమెరికా డాలర్లకు పైగా కెనడియన్‌ పింఛను నిధులను భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.

27% కెనడాలోని శాశ్వత నివాసితుల్లో భారతీయులు. కెనడా పీఆర్‌ స్కీంలో మనవారే ప్రధాన లబ్ధిదారులు.

22 %గత ఏడాది కెనడా వెళ్లిన తాత్కాలిక విదేశీ కార్మికుల్లో భారతీయులు. రెండో అత్యధికం వీరే.

45% విదేశీ విద్యార్థుల్లో భారతీయులు. మరే దేశం నుంచి ఈ స్థాయిలో విద్యార్థులు లేరు.

28 లక్షలు: కెనడాలోని భారతీయులు. వీరిలో ప్రవాసులు, భారత సంతతివారూ ఉన్నారు. ప్రపంచంలో భారతీయులు అధికంగా ఉన్న నాలుగో దేశం. ఇందులో 18 లక్షలు భారత సంతతివారు. 10 లక్షల మంది ప్రవాసులు.

8.30 లక్షలు: కెనడాలోని హిందువులు. 7.70 లక్షలు: సిక్కులు

6: వాంకోవర్‌, టొరంటో, మాంట్రియల్‌, విన్నీ పెగ్‌,

ఒట్టావా (ఒంటారియో), కాల్గారి (అల్బెర్టా). ప్రవాసులు అధికంగా నివసించే ప్రాంతాలు.

ఊడ్చేందుకు పదిరెట్ల చార్జీలు..

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో పారిశుధ్యం పేరిట ప్రైవేటు సంస్థలు దర్జాగా ఖజానాను ఊడ్చేస్తున్నాయి. రూపాయి పనికి సుమారు రూ.10 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నాయి.

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో పారిశుధ్యం పేరిట ప్రైవేటు సంస్థలు దర్జాగా ఖజానాను ఊడ్చేస్తున్నాయి. రూపాయి పనికి సుమారు రూ.10 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు.. ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలోనూ అదే హవా కొనసాగిస్తుండడం విశేషం. అధిక పైసలకు రుచిమరిగిన ఏజెన్సీలు.. కాంట్రాక్టు పొడిగింపునకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఇందుకు గ్రేటర్‌లోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తుండడం గమనార్హం. తాజాగా ఓ సంస్థ కాంట్రాక్టు గడువు పొడిగింపునకు సిఫార్సు చేస్తూ ఓ ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అదనపు కమిషనర్లకు లేఖ రాశారు.

మెరుగైన నిర్వహణ కోసం నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. సాధారణంగా కిలోమీటరు మేర రహదారిపై పారిశుధ్య నిర్వహణకు జీహెచ్‌ఎంసీ ఏటా రూ.40 వేల వరకు ఖర్చు చేస్తోంది. అదే ప్రైవేట్‌ ఏజెన్సీకి మాత్రం రూ.3.12 లక్షల చొప్పున చెల్లిస్తోంది. రెండువిడతల్లో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగిస్తారని, అందుకే అదనపు వ్యయం అని అధికారులు చెబుతున్నారు. అలా చూసినా కిలోమీటరుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు కావాలి. కానీ జీహెచ్‌ఎంసీ మాత్రం ఆ సంస్థలకు కిలోమీటరుకు రూ.3.12 లక్షలను అప్పనంగా చెల్లిస్తోంది.

దేశ, విదేశీ పర్యాటకులు సందర్శించే నగరంలోని చార్మినార్‌, మక్కామసీదు, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, బాపూఘాట్‌, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, పైగా టూంబ్స్‌, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌(Nampally Public Garden), అసెంబ్లీ, బిర్లా మందిర్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను గత ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. ఆ ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉంటే నగర పర్యాటకంపై ప్రభావం చూపుతుందన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. 9 ప్రాంతాల్లోని 73.75 కి.మీల కారిడార్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఎక్సోరా కార్పొరేట్‌ సర్వీసెస్‌, లా మెక్‌లీన్‌ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం నెలకు రూ.2.30 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్లు బల్దియా చెల్లిస్తోంది.

బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో ఓ కీలక మంత్రి వద్ద పనిచేసే అధికారి సూచనల మేరకు ఏజెన్సీలను ఎంపిక చేశారు. గడువు ముగిసినా గతంలోనే పలుమార్లు కాలవ్యవధి పొడిగించారు. ప్రస్తుతం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి 2025 వరకు మరోమారు గడువు పొడిగించాలని ఎక్సోరా సంస్థ జీహెచ్‌ఎంసీని కోరింది. ఈ వినతిని పారిశుధ్య నిర్వహణ విభాగం పక్కనపెట్టి పొడిగింపు అవసరం లేదని ఉన్నతాధికారులకు నివేదించింది. దీంతో అలవాటైన పద్ధతిలో ప్రజాప్రతినిధులను సదరు సంస్థ రంగంలోకి దింపింది. ఎక్సోరా సంస్థ గడువు పొడిగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు సిఫార్సు లేఖ ఇచ్చారు. గ్రేటర్‌లోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలో ఉండేలా, లూ-కెఫేలపై ఈగ వాలకుండా చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. 

చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

హయత్ నగర్ సంఘం బేకరి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు....

రంగారెడ్డి : బ్రేకింగ్....

బేకరిలో అన్వర్ అనే ముస్లిం కార్మికుడు జీహాదీ పేరుతో అపవిత్రం చేస్తున్నారని ఇద్దరు యువకుల హల్చల్....

వీడియో తీసి సోషల్ మీడియాలో బేకరి నిర్వహణ పై అసత్య ప్రచారం చేయడంతో పాటు,ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు.....

సదరు వ్యక్తులు యూట్యూబర్స్ వీరేష్,నరసింహ గా గుర్తింపు.....

మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించినందుకు మరియు ఒక సంస్థ పై తప్పుడు ప్రచారం చేసిన నిందితులపై 329(4),115(2),351(2),324(4)రెడ్ విత్ 3 (5) సెక్షన్ ల కింద కేసు నమోదు....

గతంలో విలేఖరులమని చెప్పి కేకు ఫ్రీగా ఇవ్వాలని ఆదేశించిన యూ ట్యూబర్స్....

మాట వినలేదనే కక్షతో అసత్య ప్రచారం చేశారని అంటున్న సంఘం బేకరి నిర్వాహకులు....