TG: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి న్యాయకమిషన్
HYD: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి కమిషన్ ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జెనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉప సంఘం తీర్మానించింది. అంతే కాకుండా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణా సచివాలయంలో నాలుగో సారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది. మంత్రులు దామోదర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సితక్క లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి, బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సి వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉప కులాల వర్గీకరణ ఉంటుందని.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంత్రి సితక్క మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చెయ్యాలన్నారు. అదే విదంగా విధంగా యుద్ధప్రాతిపదికన బిసిల సాంఘిక ఆర్థిక గణన చేపట్టాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలన్నారు

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఐ.ఏ.యస్ అధికారులు బుర్రా వెంకటేశం, లోకేష్ కుమార్, దానకిశోర్, టి.కే.శ్రీదేవి, తదితరులు  పాల్గొన్నారు.
NLG: రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న చెట్ల తొలగింపు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండలం నుండి చర్లగూడెం, వెంకేపల్లి, కుదాబక్షుపల్లి గ్రామాల మీదగా ఉన్న రోడ్డుకు ఇరువైపుల రవాణా కు ఇబ్బందికరంగా పెరిగిన చెట్లను, ఇవాళ జెసిబి సహాయంతో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నెమనేని రవీందర్ రావు తొలగించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, సూచనల మేరకు.. దసరా సందర్భంగా  ప్రయాణికుల రాకపోకలకు  ఇబ్బందికరంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించినట్లు రవీందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

#SB NEWS NLG
నకిరేకల్: ఎమ్మెల్యే వేముల కు ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్
నల్లగొండ జిల్లా:
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత వారం రోజుల క్రితం విదేశీ పర్యటన కు వెళ్లి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు.

ఈ  సందర్భంగా  మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్  మరియు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
NLG: మాల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: చింతపల్లి మండలం లోని మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను మరియు పాలకవర్గం సభ్యులు గోని జంగయ్య, రామవత్ రమేష్, ఎండి ముషవర్, జమ్ముల వెంకటయ్య, గంట మల్లయ్య, రమావత్ రమేష్, రాగివని అంజాచారి, కందిశెట్టి వెంకటేష్, మారుపాకుల మమత, పూల యాదగిరి, మేకల జగన్ రెడ్డి, ఊర శ్రీనివాస్, లింగంపల్లి వెంకటేష్ ల ప్రమాణ స్వీకారం మహోత్సవం సోమవారం మాల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఏ అవసరం ఉన్న తమ సహాయ సహకారాలు నూతన మార్కెట్ కమిటీకి ఉంటాయని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రావు, నాంపల్లి మాజీ జెడ్పిటిసి ఏవి రెడ్డి, మర్రిగూడ మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మర్రిగూడెం మండల పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు, మర్రిగూడెం మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, చింతపల్లి నాంపల్లి మర్రిగూడ మండలాల ఇతర నాయకులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలు విస్తరిస్తాం: వై.ఆర్.పి. ఫౌండేషన్
నల్లగొండ:
వై.ఆర్.పి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైష్ణోవి కన్స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎలిశాల రవి ప్రసాద్  వ్యక్తిగత పని నిమిత్తం నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
బొమ్మపాల గిరిబాబు కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక ఆధ్యాత్మిక విద్యాపరంగా, క్రీడల పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని, భవిష్యత్తులో కూడా మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలను విస్తరిస్తామని, రాష్ట్ర జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తామని మరియు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు మంచి అవకాశాలను కూడా కల్పిస్తామని రవి ప్రసాద్ తెలిపారు.
NLG: సెమీఫైనల్స్ కు చేరిన అండర్ 17 బాలుర ఉమ్మడి నల్గొండ జిల్లా బాలుర ఫుట్బాల్ టీం
భద్రాద్రి కొత్తగూడెం లో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం సెమీఫైనల్ కు చేరిందని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆదివారం తెలిపారు. ఈరోజు రెండు మ్యాచ్ లు జరగగా మొదటి మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టుపై ఖాజా అన్వర్ (చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్) సాధించిన ఒక గోల్ తో 1-1 స్కోర్ తో డ్రా చేసుకోగా, 2వ మాచ్ లో ఆదిలాబాద్ పై రాచూరి వెంకటసాయి ( చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్)సాధించిన 3 గోల్స్ తో గ్రూప్ విన్నర్స్ గా సెమీఫైనల్ కు చేరుకున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నల్లగొండ జిల్లా క్రీడాకారులు జిల్లా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. లీగ్ దశలో నల్గొండ టీం నాలుగు మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లు డ్రా చేసుకొని.. 2 మ్యాచ్ లు విజయం సాధించి.. గ్రూప్ విజేత గా 6 పాయింట్లు సాధించి సెమీ ఫైనల్ కు చేరుకున్నదని పేర్కొన్నారు.

రాచూరి వెంకటసాయి - 6 గోల్స్ సాధించగా ఖజా అన్వర్ -1 గోల్ సాధించారని తెలిపారు.
NLG: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు తీరని అన్యాయం: కట్టెకోలు దీపేందర్
  నల్లగొండ:
ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్ అమలు వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.

సమాజంలో 6 శాతం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం బీసీలను నట్టేట ముంచే చర్య అని అన్నారు.
గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి.. డిజె టిల్లు పాటకు డాన్స్
HYD: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను ఉత్సాహపరచడానికి వారితో కలిసి డాన్స్ చేశారు.
NLG: బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామానికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
మునుగోడు: నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయానికి గ్రామాల నుండి సానుకూల స్పందన వస్తోంది. గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేసుకుని, బెల్ట్ షాపులు నిర్వహించకుండా గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తున్నారు.

మునుగోడు మండలంలోని రావి గూడెంలో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. వెంటనే రావి గూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ads బెల్ట్ షాపులను నిర్మూలించిన కమిటీ మెంబర్స్ అయిన మహిళల అభిప్రాయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మీరు తీసుకున్న  బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఎమ్మెల్యేకు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు!.. ప్రపోజల్స్ ను ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈరోజు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలి

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలని.. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు.

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు.

మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ ను తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. 

మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో శాసనసభ్యుల చిత్తశుద్ధికి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.