తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 10:35

అర్థరాత్రి చార్మినార్ దగ్గర జరిగింది ఇదే

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద ఆలిండియా సున్నీయునైటెడ్ ఫోరం మిలాద్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అనూహ్య రీతిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అందునా.. సున్నిత ప్రాంతాల్లో ఏదైనా అనూహ్య ఘటనకు మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి వేళలో ఎవరు హద్దు మీరినా వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గురువారం అర్థరాత్రి ప్రాంతంలో అనూహ్య రీతిలోచార్మినార్ వద్ద చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగింది? అనే విషయం కంటే కూడా.. సదరు ఫైర్ యాక్సిడెంట్ వేళ.. ఎవరికి వారు.. తమకు తోచిన విషయాల్ని ప్రచారం చేసిన వైనం చూస్తే.. ఒళ్లు మండాల్సిందే.

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద ఆలిండియా సున్నీయునైటెడ్ ఫోరం మిలాద్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అనూహ్య రీతిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ర్యాలీలో భాగంగా ఒక యువకుడు టపాసులు కాల్చాడు. అది కాస్తా దీజే సౌండ్ సిస్టం మీద పడింది. పక్కనే ఉన్న జనరేటర్ పై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో.. అనూహ్య రీతిలో మంటలు ఎగిసాయి.

చార్మినార్ కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించారు. ఫైరింజన్లకు సమాచారం ఇవ్వటంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మంటలు ఒక మోస్తరుగా వ్యాపిస్తున్న వేళ.. స్పందించిన అగ్నిమాపక దళం.. మంటల్నిఆర్పేసింది. ఈ క్రమంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కాకుంటే.. చార్మినార్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై ఎవరికి వారు తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలుచేశారు.

అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడి వారిని మంటలకు దూరంగా ఉంచారు. ఈ క్రమంలో పోలీసులు సరైన తీరును ప్రదర్శించారు. కాకుంటే.. పోలీసుల మీద తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారు కొందరు. ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లుగా వదంతులు వ్యాపించే ప్రయత్నం చేశారు.

దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు.చివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సైతం అర్థరాత్రి వేళ.. హుటాహుటిన చార్మినార్ ప్రాంతానికి రావటమే కాదు.. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వైనం గురించి తెలుసుకోవటమే కాదు.. అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. అనూహ్యంగా చోటు చేసుకున్న మంటలను సకాలంలో స్పందించిన పోలీసుల కారణంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 10:32

ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి

!

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి పలుకుతున్నాయి.

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి పలుకుతున్నాయి. 2023-24లో కరెంట్‌ కొనుగోళ్లకు ఎస్పీడీసీఎల్‌ రూ.37,890.10 కోట్లు వెచ్చించగా.. ఎన్పీడీసీఎల్‌ రూ.15,483.73 కోట్లు ఖర్చు చేసింది. రెండు డిస్కమ్‌లు కలిపి రూ.53,373.83 కోట్లు వెచ్చించగా 2024-25లో రూ.10,671.83 తగ్గించి.. రూ.42,702 కోట్లే వెచ్చించనున్నట్లు ‘వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌)’లో వెల్లడించాయి. జల విద్యుదుత్పాదనతో రూ.4వేలకోట్ల దాకా ఖర్చు తగ్గడంతో పాటు వ్యవసాయ, ఎత్తిపోతల పథకాలకు వినియోగం కూడా తక్కువ గా ఉంటుందన్న అంచనాతో విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చు రూ.10,671.83 కోట్ల దాకా తగ్గుతుందని డిస్కమ్‌లు లెక్కించాయి.

2024-25లో విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం రూ.44,835 కోట్లు కాగా.. ఇందులో కొనుగోళ్లకే రూ.42,702 కోట్లు వెచ్చిం చాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. బుధవారంరాత్రి తెలంగాణ విద్యుత్తు నియం త్రణ మండలి (టీజీఈఆర్‌సీ)లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏఆర్‌ఆర్‌ను డిస్కమ్‌లు దాఖలు చేశాయి. ఆ లెక్కల ప్రకారం 2024-25లో కొనుగోళ్లు, సరఫరా, స్టేట్‌ లోడ్‌డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)ఖర్చు, పంపిణీ ఖర్చులు మొత్తం రూ.57,857 కోట్లు అవుతాయని తేల్చాయి. ఇందులో ఆదాయం రూ.44,835 కోట్లు పోగా ప్రభుత్వ సబ్సిడీలు చేతికొస్తే లోటు ఉండదని అంచనా వేశాయి.

పదేళ్లలో తొలిసారి లోటు లేకుండా డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ దాఖలు చేయడం గమనార్హం. 2024-25లో రూ.57,857 కోట్లు ఖర్చు కానుండగా.. అందులో ప్రభుత్వ సబ్సిడీ కలిపి, లోటు శూన్యస్థాయికి చేరింది. విద్యుత్తు చార్జీల పెంపుతో రూ.1200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కమ్‌లు అంచనా వేశాయి. హెచ్‌టీ విభాగంలో చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు, మిగిలిన రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని తెలియజేశాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 07:13

ఇదేం ఘోరం గోవిందా!

శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలోనూ అవే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అదే సమయంలో ఎంతోకాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, ప్రతిపక్ష నేతలూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరీక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది. అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని రిపోర్టుతోసహా టీడీపీ ముఖ్యనేత ఆనం వెంకట్రమణారెడ్డి బహిర్గతం చేయడంతో శ్రీవారి భక్తుల్లో అలజడి రేగుతోంది.

2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగా, 2020 ఫిబ్రవరి దాకా శ్రీవారి లడ్డూల నాణ్యత గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కొవిడ్‌ తర్వాత 2020 డిసెంబరు నుంచీ భక్తుల్లో అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది. లడ్డూల్లో మునుపటి రుచి గానీ, సువాసన గానీ, నాణ్యత గానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. అప్పట్లో ఈ అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది. అప్పటి నుంచీ ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో పలువురు భక్తులు లడ్డూ నాణ్యతపైన, అలాగే అన్న ప్రసాదాలపైన కూడా ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. లడ్డూ రుచికరంగా లేకపోవడంతో పాటు రెండు రోజులకే పాడవుతోందన్న ఫిర్యాదులు పెరిగాయి. ఇక అన్న ప్రసాదాల విషయంలో అయితే అన్న ప్రసాద సత్రంలో భోజనం చేసిన సుమారు 20 మంది భక్తుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తింటుంటే గడ్డి తింటున్నట్టు ఉంది. మేము భక్తులమా లేక పశువులమా?’’ అని సిబ్బందిపై విరుచుకుపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా అప్పట్లో వైరల్‌ అయింది. అయినా అప్పటి టీటీడీ పాలకమండలి దీన్ని కొట్టి పారేసింది. కానీ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా భక్తులనుంచి తీవ్ర విమర్శలు వస్తున్న లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతపై కొత్త ఈవో శ్యామలరావు దృష్టి పెట్టారు. అప్పటికి ఐదేళ్లుగా తమిళనాడుకు చెందిన కంపెనీ సహా ఐదు సంస్థలు తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి.

ఈవో శ్యామలరావు నెలపాటు పోటు కార్మికులు, అన్న ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు, అధికారులతో తరచూ సమావేశమై సమీక్షించారు. ఏయే వస్తువులు వాడుతున్నారు? ఎంత పరిమాణంలో? ఎక్కడి నుంచీ సేకరిస్తున్నారు? వాటి నాణ్యత ఎలా వుంది? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటి? అని ఆరా తీశారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్‌కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో.. తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందినీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.

శ్రీవారి అన్న ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ దిగుబడులను వాడుతున్నామని, ఆ కారణంగా రుచిలో తేడా వచ్చింది తప్ప నాణ్యత దెబ్బతినలేదని అప్పట్లో టీటీడీ అధికారులు చెప్పిన వివరణ కూడా భక్తులకు సంతృప్తి కలిగించలేదు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రుచి, సువాసన, నాణ్యతలో తేడా లేకుండా చర్యలు తీసుకున్నాకే ప్రవేశపెట్టాలి. కానీ, ఆలోచన వచ్చిందే తడవుగా కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాల తయారీని ఎలా మారుస్తారన్న ప్రశ్నకు టీటీడీ నుంచి అప్పట్లో సమాధానం లేకపోయింది.

కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ చేసిన ఆరోపణలు, శ్రీవారి ప్రసాదాల నాణ్యత తగ్గిందని వచ్చిన ఫిర్యాదులపై అప్పట్లో టీటీడీ చేసిన వాదన చాలా పేలవంగా అనిపించింది. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌.. టీటీడీ అవసరాలకు తగిన మేరకు సకాలంలో, తగిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేయలేకపోయిందని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఒకే సమయంలో కనీసం రెండు మూడు సంస్థల నుంచి టీటీడీ వేర్వేరు పరిమాణాల్లో నెయ్యి సేకరిస్తూ వస్తోంది. 2014 నుంచీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్‌ ఎప్పుడూ టీటీడీ నిర్దేశించిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో అధికారులు చేసిన వాదన నిలవలేదు.దేశంలో గుజరాత్‌ ఆనంద్‌ డెయిరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్ఠలున్న సంస్థ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌. ఈ ఫెడరేషన్‌ నందినీ బ్రాండ్‌ పేరిట నెయ్యిని సుదీర్ఘ కాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్‌ సరఫరా చేసే నెయ్యి నాణ్యతాపరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎ్‌ఫయే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నిందినీ నెయ్యి సరఫరాను నిలిపివేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టిందని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ భీమా నాయక్‌ అప్పట్లో ఆరోపించారు.తమను టెండర్లలో పాల్గొననివ్వడం లేదని కూడా తెలిపారు. కేఎంఎఫ్‌ సరఫరా చేసే నెయ్యి నాణ్యత బాగుండడంతో తక్కువ ధరకు టీటీడీకి సరఫరా చేసే పరిస్థితి లేకపోయిందని, తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేయడమంటే నాణ్యత విషయంలో రాజీ పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ అధికారులు అప్పట్లో రివర్స్‌ టెండరింగ్‌ పేరిట తక్కువ ధరకు నెయ్యి సేకరించాలని నిర్ణయించారు. కేఎంఎఫ్‌ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2024, 20:31

కీచక ఆర్.ఎం.పి సమీర్ అరాచకాలు అరికట్టాలి న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేయాలని ధర్నా

-కచక ఆర్ఎంపిని ఫోక్సో కింద అరెస్టు చేయాలి 

-ఆస్పత్రిని సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు జరపాలి 

-ఆ నలుగురు కీచకులు ఎవరో బహిర్గతం చేయాలి 

-ఆర్.ఎం.పి సమీర్ ను కఠినంగా శిక్షించాలి 

-బాధిత మహిళలకు ప్రజా సంఘాలు,మహిళలు, మహిళా సంఘాల మద్దతు 

-ఆస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి భారీ రాస్తారోకో 

-పోలీసులు, డి ఎం హెచ్ ఓ, కలెక్టర్లకు ఫిర్యాదు 

-న్యూ లైఫ్ ఆస్పత్రి సీజ్ చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్న మహిళలు

ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ఆర్.ఎం.పి మహమ్మద్ సమీర్ పై ఫోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించి ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బాధిత మహిళ, అమే కుటుంబ సభ్యులు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎత్మతాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి స్వప్న అనే మహిళ నాగర్ కర్నూల్ పట్టణంలోని సహస్తా న్యూ లైఫ్ ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ బుధవారం వచ్చింది. ఆస్పత్రిలో ఉన్న ఆర్ఎంపి వైద్యుడు మహమ్మద్ సమీర్ మహిళను పరీక్షిస్తూ జ్వరం ఎప్పుటి నుంచి వస్తుందని మాటల్లో పెట్టి ఎంతమంది పిల్లలు అని... వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాడని పిల్లలు కాలేదని చెప్పడంతో నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా వద్దకు మూడు నెలలు వరుసగా వచ్చి నాతోపాటు నా ముగ్గురు స్నేహితుల వద్ద సంసారం చేస్తే మూడు నెలల్లో గ్యారంటీగా గర్భం వస్తుందని చెప్పడంతో తనతో పాటు ఆమె తల్లి బాధితురాలు ఇద్దరు కలిసి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ ను నిలదీయగా మెడికల్ షాప్ నిర్వాహకులు తప్పించినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఐకి ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంటికి వెళ్లి విషయం భర్త నరేందర్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులకు కన్నీళ్ల పర్యంతమై చెప్పడం జరిగింది. గురువారం రెడ్డి సేవా సమితి బాధ్యులతో పాటు మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. 

 ఆస్పత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదు

నాగర్ కర్నూల్ పట్టణంలోని సమస్త న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదని బాధితులతో పాటు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు భీష్మించు కూర్చున్నాయి. కేసు నమోదు చేస్తున్నామని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య చెప్పిన సీజ్ చేసే వరకు కదిలేది లేదని ధర్నాతో పాటు రాస్తారోకోను పెద్ద ఎత్తున కొనసాగించారు.

 న్యూ లైఫ్ ఆస్పత్రి పై సమగ్ర దర్యాప్తు జరపాలి

మహిళల పట్ల కీచకంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న న్యూ లైఫ్ ఆసుపత్రి తో పాటు ఆస్పత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ పై సమగ్ర విచారణ జరపాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మహిళ లు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆస్పత్రిలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కానీ పోలీసు శాఖ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఈ ఆస్పత్రి పై ఆరోపణలు వచ్చి పలుమార్లు సీజ్ చేసిన తిరిగి ఆసుపత్రిని కొందరు రాజకీయ నాయకుల పలుకుబడితో తెరిపించడం జరిగిందని ఇలాంటి అక్రమార్కలు, దుర్మార్గులు నిర్వహిస్తున్న ఆసుపత్రులను పట్టించుకోవాలని అధికారులను కోరారు.

 -అది ఆసుపత్రి యా... వ్యభిచార కూపమా

న్యూ లైఫ్ ఆస్పత్రి పై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్న పట్టించుకోవడంలేదని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే అనేకమంది ఈ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోతే వారికి డబ్బుతో వెలకట్టి ఏలాంటి కేసులు కాకుండా చూసుకుంటున్నారని పలువురు విమర్శించారు. ఇటీవలే ఒక యువకుడికి సదరు ఆర్.ఎం.పి సమీర్ అతని ఫామ్ హౌస్ లో కిడ్నీ సంబంధిత వ్యాధికి నాటు వైద్యం చేసి అతని ఆరోగ్యం తీవ్రస్థాయిలో క్షీణించడానికి కారణం కాగా అతని కి కూడా కొందరు మధ్యవర్తుల సహాయంతో డబ్బులు ఇచ్చి పత్రాలు రాసుకుని తన ఆసుపత్రిని కాపాడుకున్నాడని పలువురు విమర్శించారు. ఒక మహిళను సంతానం కలగడానికి సమీర్ మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. పిల్లలు కలగడానికి అనేక రకాల వైద్య సాంకేతికత ఉందని దాని ఆధారంగా పిల్లలు కలుగుతారా అని బాధిత మహిళ అడిగితే తనతో పాటు మరో ముగ్గురి స్నేహితుల వద్ద సంసారం చేస్తే కలుగుతారని నిర్లజ్జగా చెప్పడం బట్టి చూస్తే న్యూ లైఫ్ ఆసుపత్రిలో వైద్యం కంటే వ్యభిచారమే జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ నలుగురు ఎవరో డాక్టర్ సమీర్ ను విచారించి పోలీసులు అధికారులు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

 ఆస్పత్రిని మూయించిన సీఐ కనకయ్య

న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ ను అరెస్టు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆందోళన కారులు పట్టుబట్టడంతో సీఐ కనకయ్య వైద్యశాఖ అధికారులను సంప్రదించారు. డి ఎం హెచ్ ఓ అందుబాటులో లేరని అధికారులకు సమాచారం అందించి 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆసుపత్రిని మెడికల్ షాపును బంద్ చేయించారు. 

 -న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్.ఎం.పి సమీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు

న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపి సమీ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడమే కాకుండా రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యుల కు ఫిర్యాదు చేసి వారిని నాగర్ కర్నూల్ కు రప్పించి ఈ దురాగతాలను బహిర్గతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సీఐ కనకయ్య హామీతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలోబిజెపి నాయకులు జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్, రాజేష్ రెడ్డి, లోహిత్ రెడ్డి, ఆంజనేయులు, ఎలిమి రాము, బొట్టు శ్రీను, శకుంతల, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న. జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణ

సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్, రామయ్య, సురేష్

సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వార్ల వెంకటయ్య, శివ, గోపి చారి,టిఆర్ఎస్ నాయకులు మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, లింగారెడ్డి,రెడ్డి సేవా సమితి సభ్యురాలు దొడ్ల ఇందుమతి, దొడ్ల రాధారెడ్డి, శకుంతల, నారాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు హబీబ్ తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2024, 20:15

ఖాళీ అవుతున్న వైసిపి జగన్ కు దెబ్బ మీద దెబ్బ షాక్ మీద షాక్ ఇస్తున్న వైసిపి ప్రముఖ నేతలు

పార్టీని వీడుతున్న ప్రముఖులు 

ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజకీయ సన్యాసం 

అయోమయంలో వైసిపి శ్రేణులు 

మరికొంతమంది అజ్ఞాతం.. మరికొంతమంది సమయం చూసుకుని అవకాశం కోసం ఎదురు చూపులు. మరికొంతమంది ఇతర పార్టీలోకి చేర్చుకునే మార్గం లేక మౌనం. 

జగన్ పై ఆయన పాలనపై విరక్తి చెంది ఇక వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, జగన్ ఇక ఈ జన్మలొ మరోసారి సిఎం కాలేడని, వైసిపి ఇక సమాధి కానుందని భూస్థాపితం కానున్న వైసిపిని వదలి మరో మార్గాలు వెతుకుంటున్న ప్రముఖ నాయకులు 

ఇటీవల పరిణామాల్లో జగన్ అనుసరిస్తున్న వింత వైఖరిపై విసిగి పోతున్న వైసిపి అభిమానులు. 

రానున్న కాలంలో మరింత దిగజారే డామేజి స్థాయికి జగన్ ఇమేజి.. 

జగన్ పై సొంత పార్టీలో సొంత అభిమానులు నాయకులులో పెరుగుతున్న వ్యతిరేకత విరక్తి పుట్టిస్తున్న జగన్ నైజం 

కాంగ్రెస్ లో విలీనం దిశగా పావులు.. అడ్డుగా ఉన్న షర్మిల. ఫలితంగా జాప్యం అవుతున్న విలీన ప్రక్రియ 

జగన్ ను ఇక జనం నమ్మరు అని, అతను పాలనకు పనికిరాడని పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్న వారిలో ఇలా ఉన్నారు 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస బేటీలు

 ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి 

 జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను 

 ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

 పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య 

 దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

ఇంకా పలువురు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు 

చేసిన అవినీతి స్కాంలతో జగన్ జైలుకు వెళ్తే.. పార్టీకి దిక్కు ఎవరంటూ నాయకుల్లో అంతర్మధనం.. వైసిపి ని వీడి సొంత దారులు వెతుక్కుంటున్న నాయక గణం

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2024, 14:22

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు...

ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు డి ఇంట్లో తలదాచుకుంటు న్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. 

అయితే, ఆయనను వెతికేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ.. ఇవాళ సైబరా‌బాద్ పోలీసులు జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతోనే ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్లుగా తెలుస్తోంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2024, 11:25

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది, మూడు నెలల్లో పూర్తి

యాదాద్రి ఆలయం సమీపంలో భక్తుల సౌకర్యార్థం 64 మీటర్లతో స్టీల్ లింక్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్దదని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మెకలై స్టీల్‌తో ఈ బ్రిడ్జి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు కేవలం ఎగ్జిట్‌ ఫ్లైఓవర్‌ పైనే ఆధారపడి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ లింక్‌ బ్రిడ్జి ఉపశమనం కలిగిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. యాదాద్రి దేవాలయం సమీపంలో 64 మీటర్లతో నిర్మించనున్న ఈ వంతెనను రానున్న మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బంగారు తాపడం పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక యాదాద్రికి సమీపంలోని రాయగిరిలో దాదాపు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామన్నారు. రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వేద పాఠశాలకు గోవిందహరి ఛైర్మన్‌గా ఉంటారన్నారు.

ఇక తెలంగాణలోని మూడు టెంపుల్ టూరిజం సర్క్యూట్‌లలో త్వరలో భక్తులకు వీఐపీ దర్శనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటకశాఖ, దేవాదాయశాఖల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడు టెంపుల్‌ సర్క్యూట్‌లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్‌ కాగా.. మన్యంకొండ, శ్రీరంగాపూర్, అమ్మపల్లి, జోగులాంబ ఆలయాలు రెండో సర్క్యూట్‌లో.. డిచ్‌పల్లి ఆలయం, బాసర, కామారెడ్డిలోని ప్రముఖ ఆలయాలను మూడో సర్క్యూట్‌లో భాగం చేశామన్నారు. ఈ ఆలయాలను సందర్శించే వీఐపీ భక్తులకు వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్, గైడ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తులకు ఈ ఆలయాల్లో ఎక్కడికి వెళ్లినా ఆలయ జ్ఞాపికను అందించి సత్కరిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2024, 11:24

నేడు చలో ప్రజాభవన్‌.. రుణమాఫీ కాని రైతుల పిలుపు

రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు.

రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 20న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలిరావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధ తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్‌ ఆందోళనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది రుణ గ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొ న్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2024, 19:20

జానీ మాస్టర్ అత్యాచార కేసులో కీలక పరిణామం.. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఘటన వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలో.. ఫెమస్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్.. లేడీ కొరియో గ్రాఫర్ ను అత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ముంబైలో ప్రోగ్రామ్ కు వెళ్లినప్పుడు జానీ మాస్టర్ .. లాడ్జీలో యువతిపై బలవంతంగా అత్యాచారం చేశాడని కూడా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి తన పట్ల జానీ మాస్టర్ ఏ విధంగా వేధించాడో అన్ని విషయాలను పోలీసులకు ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై.. హైదరాబాద్ పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

లేడీ కొరియో గ్రాఫర్.. తనపై జానీ మాస్టర్ అత్యంత క్రూరంగా, అత్యాచారం చేశాడని కూడా కన్నీళ్లుపెట్టుకుంది. తన కోరిక తీర్చకుంటే.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని, యువతిని లొంగదీసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం..నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర ఒక యువతికి.. 2017 లో పరిచయం ఏర్పడింది.

ఒక డ్యాన్స్ షోలో..సదరు యువతి మంచి ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు యువతి 2019 లో జానీ మాస్టర్ టీమ్ లో ఆమె చేరింది. ఒక ప్రొగ్రామ్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు..యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట రాయదుర్గం పోలీసులు జీరో ఎఫైఐఆర్ నమోదు చేసి, నార్సింగ్ పీఎస్ కు కేసు బదిలీచేశారు.

జానీ మాస్టర్ భార్య కూడా.. వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ ను జనసేన సస్పెండ్ చేసింది. కొరియో గ్రాఫర్ సంఘం కూడా ఆయనను తాత్కలికంగా సభ్యత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళ సంఘాలు, తెలంగాణ మహిళ కమిషన్ కు కూడా.. సదరు ఘటనపై ఫిర్యాదు చేశాయి. బీజేపీ మహిళ మోర్చా సైతం.. ఈ ఘటనను ఖండించింది. ఇదిలా ఉండగా.. అల్లుఅర్జున్ బాధిత కొరియోగ్రాఫర్ కు అండగా నిలిచారని తెలుస్తోంది. తన మూవీస్ లో కొరియో గ్రాఫర్ గా యువతికి అవకాశంఇస్తానని కూడా ప్రకటించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2024, 19:14

మళ్ళీ వర్షాల హెచ్చరిక పంపిన వరుణుడు!

ఋతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

సెప్టెంబర్ 20వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

సెప్టెంబర్ 21న ఈ జిల్లాలలో వర్షాలు

ఆపై సెప్టెంబర్ 21వ తేదీన కూడా వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

సెప్టెంబర్ 22వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

సెప్టెంబర్ 21వ తేదీన కూడా ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ కూడా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. అయితే సెప్టెంబర్ 22వ తేదీన ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవని పేర్కొంది.

ఇక ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం చూసినట్లయితే సాయంత్రం వేళలలో కానీ, రాత్రి సమయంలో కానీ నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 15వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం అవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్పటివరకు రాష్ట్రంలో అనేక చోట్ల అడపా దడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.