బలవంతంగా వినాయకుని చందా.. అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!
బలవంతంగా వినాయకుని చందా..!
అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ నియోజక వర్గం లోని వెంకట్రావ్ పెట్ గ్రామం నుండి మహారాష్ట్రకు వెళ్ళే అంతరాష్ట్ర మార్గంలో అదే గ్రామానికి చెందిన యువకులు వచ్చేవాళ్ళ దగ్గర,పోయేవారి దగ్గర వినాయకుని పేరు మీద బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు.అడిగినంత ఇవ్వకుంటే దాడి చేస్తున్నారు. గురువారం రోజున కౌటాల మండలం గుడ్లభోరి గ్రామానికి చెందిన ధంద్రే బాలాజీ, శంకర్ లు వైద్యం కోసం చంద్రపూర్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వాహన్నాని ఆపి వినాయకుని చందా ఇవ్వాలి అని అడిగారు.సదరు ప్రయాణికులు మా దగ్గర మీరు అడిగినన్ని డబ్బులు లేవు ఎంతో కొంత ఇస్తామంటే, చందాదారులు ఆగ్రహించి రాళ్ళతో, చెప్పులతో దాడి చేసారు. ఇది ఎంతవరకు న్యాయమో గ్రామస్తులే చెప్పాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు భాదితులు దాడి చేసిన వారిపై పిర్యాధు చేశారు.

బలవంతంగా వినాయకుని చందా..!
కాగజ్ నగర్,సెప్టెంబర్11 : రాష్ట్రం లోని నేతన్నల మేలు కోసం రుణ మాఫీ ప్రకటించడం, ఇండియన్ ఇన్స్టట్యూట్ ఆఫ్ హ్యండ్లుమ్స్ కు పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం గొప్ప విషయమని, దీనికి చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పద్మశాలి లు రుణపడి ఉంటానని పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర నాయకులు నల్లా కనకయ్య అన్నారు. రుణమాఫీ తో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా బుధవారం రోజున కాగజ్ నగర్ మండలం లోని కోసిని బెజ్జుర్ చేనేత సహకార సంఘం అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలాభిషేకం చేశారు. వారు చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, పద్మశాలీలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శనివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సామల తిరుపతి, కనుకుట్ల వెంకటేష్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాలుష్య నివారణ లో భాగంగా మండల ప్రజలకు ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేసి కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం యువజన అధ్యక్షులు సామల రవికాంత్, సంఘం సభ్యులు కనుకుట్ల శ్రీనివాస్ ,పర్ష రమేష్ ,జోర్రీ గల శ్రీనివాస్ ,పడాల సదాశివ్, బొద్దున విజయ్, దోమల అనిల్ ,కుషణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Sep 12 2024, 13:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k