VijayaKumar

Sep 10 2024, 18:33

చాకలి ఐలమ్మనే తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహా రూపంగా ప్రకటించాలి: ఎమ్ఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ

ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ 39 వ వర్థంతి సందర్బంగా గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం పెద్దలు ,అఖిల పక్ష నాయకులు , ప్రజా సంఘాల నాయకులు , జర్నలిస్ట్ నాయకులు, ఉద్యోగులతో కలసి ఘనంగా నిర్వహించి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీయ పక్షాన ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, పట్టణ నాయకులు గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ లు భాగస్వామ్యం అయ్యి ఐలమ్మ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ప్రత్యేకంగా మీడియా తో మాట్లాడుతూ ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆధిపత్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ దొరలను గడీలనుంచి ఉరికించిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని,పోరాటాన్ని, భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని కాపాడిన ఈస్వరాష్ట్ర ఆకాంక్షకు ఆయుషు పోసిన తెలంగాణతల్లి చాకలి ఐలమ్మ నే అని అందుకే ఎమ్మార్పీయస్ సూత్రప్రాయంగా చాకలి ఐలమ్మ త్యాగాన్ని,పోరాటాన్ని గుర్తిస్తూ ఈ తరానికి తన చరిత్రను చాటిచెప్పేందుకు మొట్టమొదటి సారిగా ఐలమ్మ గారి రూపమే సరిగ్గా లేని తరుణంలో చరిత్ర విస్మరణకు గురై ఆమె భౌతికరూపం కనుమరుగైన స్థితిలో ఏరూపంలో ఉన్నదో ఎవ్వరికీ కూడా తెల్వని సమయంలో "ఐలమ్మ పోరాట రూపాన్ని" సమాజానికి పరిచయం చేసింది దండోర ఉద్యమమే అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆతల్లి స్ఫూర్తివంతమైన పాత్రను తెలియపరిచేలా 2003లొనే 'తల్లి తెలంగాణ' పుస్తకాన్ని రాసి చాకలి ఐలమ్మే మాకు తెలంగాణ తల్లి అని సగర్వంగా చాటిన చరిత్ర మందకృష్ణ మాదిగదే అని . మన మహానీయురాలి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించింది, సిద్ధాంతాపరంగా తల్లి రూపాన్ని పీడితవర్గాల ఆత్మగౌరవ చైతన్య పోరాట ప్రతీకగా భావిస్తూ దండోరోద్యమ ఫ్లెక్సీలో ఐలమ్మ గారి చిత్రపటాన్ని పెట్టుకొని స్ఫూర్తిని ఇచ్చిన సంఘం దండోరే అని అన్నారు. అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణకు, మట్టి,వెట్టి బ్రతుకులు బ్రతికిన తెలంగాణకు, పోరాటం, తిరుగుబాటు, చైతన్యం కల్గిన తెలంగాణకు ప్రతిరూపంగా పట్టు చీరలు,బంగారు నగలు, కిరీటాలు పెట్టుకున్న రూపంలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా చిత్రీకరించి బొమ్మలు పెట్టి కొలుస్తుంటే పట్టుచీరలు, బంగారు నగలు, కీరిటాలు పెట్టుకున్న దొరసాని కాదు తెలంగాణ తల్లి..దొరలను గడిలా నుంచి ఉరికించిన వీరనారి చాకలి ఐలమ్మే "తెలంగాణ తల్లి" అని సంచలనాత్మక ప్రకటనతో తల్లి త్యాగాన్ని ఆచరణాత్మకంగా అమలు పరిచిన ఘనత, రజకులను,అన్నివర్గాలను చైతన్యం చేస్తూ ఆమె జయంతి,వర్ధంతిలను నిర్వహించే స్పృహను కల్గచేసింది పలు డిమాండ్లను పెట్టి ఆమె జీవిత చరిత్రను అందరికి తెలిసేలా చేసింది ఎమ్మార్పియస్ పోరాటమే అని అందుకు చాకలి ఐలమ్మ ని ప్రస్తుత ప్రభుత్వం "తెలంగాణ తల్లిగా" ప్రకటించి గౌరవించాలని,చాకలి ఐలమ్మ రూపాన్నే తెలంగాణ తల్లీ రూపంగా ప్రజల ముందుకు అధికారికంగా తీసుకురావాలని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి,వర్ధంతిలను అధికారికంగా అన్నీ గ్రామాల్లో నిర్వహిస్తూ ఆమె పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసెలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని, ట్యాంక్ బండ్ పై ఐలమ్మ గారి విగ్రహాన్ని నెలకొల్పుతూ ఆమె చరితను తెలంగాణ పోరాట చరిత్రగా లిఖిస్తూ కీర్తించాలని అదే అసలైన నివాళి అని గుర్తుచేస్తున్నామని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం అని ఆధిపత్యం,అణిచివేతలతో దొరల చేతుల్లో బందీగా మారిన తెలంగాణను విముక్తి చేసేందుకు దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిలిచి తన ధైర్య సహసాలతో పోరాట పటిమతో దొరలను గడిల నుంచి ఉరికించిన చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. అందుకు అణగారిన కులాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తూ తెలంగాణలోని అన్నివర్గాలకు మేలు చేసే రాజ్యాన్ని ఆకాంక్షిస్తూ ఐలమ్మ త్యాగాన్ని స్మరిస్తూ..పోరాటాన్ని గుర్తుచేస్తూ సామాజిక ఉద్యమ జోహార్లు ప్రకటిస్తున్నాం..!! అని అన్నారు.

VijayaKumar

Sep 10 2024, 18:28

నీర్నెముల గ్రామంలోసాయిరాం యూత్ గణపతి కి ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో సాయి బాబా మందిరంలో సాయిరాం యూత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహం వద్ద విగ్రహ విగ్రహ ధాత చిప్పలపల్లి ఉపేందర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు,రైతులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ వేడుకున్నారు. నిత్యం ప్రత్యేకపూజలు జరిగేలా నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహారించాలని సూచించరు.ఈ కార్యక్రమంలో భక్తులు ముత్యాల రమేష్, నోముల విష్ణు, నోముల కృష్ణ, నోముల యాదగిరి,ముత్యాల శివ కుమార్,చిప్పలపల్లి పరశురాములు,నోముల శివ కుమార్, చిప్పలపల్లి సంతోష్ తదితర భక్తులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 09 2024, 17:02

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా కు వినతి పత్రం అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్

తెలంగాణ రాష్ట్ర జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో భారత ప్రభుత్వ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ అరవింద్ పానగర్న్  సమక్షంలో 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం సోమవారం  జరిగినది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పిటిసి డాక్టర్ కుడుదుల నగేష్  16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ యూని కలిసి 1). 13వ ఫైనాన్స్ తీర్మానం ప్రకారం గ్రామపంచాయతీలకు 50% మండల పరిషత్లకు 30% జిల్లా పరిషత్తులకు 20% నిధులు కేటాయించాలని.2) బి ఆర్ జి ఎస్ నిధులు కూడా కేటాయించాలని.3) మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా రెన్యువల్ చేయాలని. 4) పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులకు కేటాయించే నిధులకు 5 లక్షల వరకు కేటాయించే పనులకు జీఎస్టీని 18 శాతం నుండి జీరో శాతానికి చేయాలని.5) జిల్లా పరిషత్లకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే హెల్త్ గ్రాండ్ వర్క్ సెలక్షన్ హక్కు జిల్లా పరిషత్లకే కేటాయించాలని.6) కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనాగార్న్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుగల్ నగేష్ అందజేశారు.

VijayaKumar

Sep 09 2024, 16:41

మూసి ప్రక్షాళన - గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

మూసీ జల కాలుష్యాన్ని అరికట్టి, ప్రక్షాళన చేపట్టి గోదావరి, కృష్ణా జలాలను ప్రత్యామ్నాయంగా అందించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జిల్లా కో- కన్వీనర్ దయ్యాల నర్సింహ తెలియజేసినారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామం తో పాటు పది గ్రామాలకు మూసీ జలాలు అందించాలని కోరుతూ ఆనాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భునాదిగాని కాల్వ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి కాలువను సాధించడం జరిగిందని వారు తెలియజేశారు. కానీ నేటికీ ఆ కాలువ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని, ఇంకా రైతులకు నష్టపరిహారం మరియు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే దాంట్లో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా నిర్వాసితులకు నష్టపరిహారం, కాలువను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అన్ని గ్రామాలకు నీరు అందించాలని, మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలి ప్రత్యమ్నయంగా గోదావరి జలాలను వడపర్తి కతత్వ నుండి భువనగిరి, బీబీనగర్ చెరువులను నింపి అందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. భునాదిగాని కాల్వ పూర్తి కోసం, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల కోసం 11 తేదీన ఎర్రంబెల్లి నుండి నమాత్ పల్లి, నందనం, అనాజిపురం మీదుగా బీబీనగర్ మండల కేంద్రంలో నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్రను అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న మహాధర్నాను రైతులు, కూలీలు, వృత్తి దారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మల్లేశం పిలుపునిచ్చారు. ఇంకా కమిటీలో కో- కన్వీనర్లుగా గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపల్లి కుమార్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, గుండెనబోయిన దానయ్య, కమిటీ సభ్యులుగా ఏదునూరి వెంకటేష్, కడారి కృష్ణ, గంగనబోయిన పాండు, బొల్లేపల్లి పరమేష్, తోటకూరి మల్లేష్, ముత్యం ప్రకాష్, ఎల్లంల ఐలయ్య, కొల్లూరు సిద్ధిరాజు, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, రాసాల శ్రీశైలం, హైతరాజు కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మల్లేశం తెలియజేశారు. ఇట్లు ఏదునూరి మల్లేశం కన్వీనర్ మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండలం

VijayaKumar

Sep 08 2024, 17:56

ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్ కే చాంద్ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్

రామన్నపేట:  తెలంగాణ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు నోముల శంకర్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె చాంద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు డాక్టర్ నకిరెకంటి అశోక్ కుమార్ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య బోగారం మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్ నక్క శంకర్ పాండురంగ చారి మోటే రమేష్ ఉద్యమ నాయకులు రెబ్బాస్ రాములు రేపాక లింగస్వామి రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ సిపిఐ నాయకులు గంగాపురం యాదయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Sep 08 2024, 17:46

వలిగొండ: మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

వలిగొండ  మండలకేంద్రం ఆవాస గ్రామమైన మల్లేపల్లి కి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది పల్లెర్ల మారయ్య, పడిగం సత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.వారి ఇరువురి కుటుంబ సబ్యులకు వలిగొండ కు చెందిన వ్యాపార వేత్త కొండూరు భాస్కర్ సౌజన్యంతో ఇరువురి కుటుంబాలకు 5 వేల చొప్పున ఆదివారం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్, కొండూరు సాయి, పల్లెర్ల రాం చెంద్రo, పల్లెర్ల లక్ష్మణ్, గొల్ల క్రాంతి కుమార్, పడిగం యాదయ్య, లక్ష్మయ్య, గొల్ల గణేష్, సహదేవ్, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 08 2024, 16:03

OU నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన బొడిగే నరసింహ... అభినందించిన దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు


వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడిగె  నర్సింహ తండ్రి యాదయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. " ఫిజికల్ స్పెక్ట్టోస్కోపిక్ ( ఆప్టికల్ ఈ పి ఆర్ ,ఎఫ్ టి ఐ ఆర్ అండ్ రామన్ ) క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ ఇండియావ్ డోఫుడ్ ఆల్కలైన్ ఎర్త్ ఆక్సైడ్ బారేటు గ్లాసెస్ "అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి .రామదేవుడు గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు . వలిగొండ మండలంలో భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి . బోడిగె .నరసింహ డాక్టరేట్ సాధించిన విషయం తెలుసుకున్న దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు విద్యాభ్యాసం 1. పాఠశాల: ప్రగతి హై స్కూల్ 10 th వరకు 2. ఇంటర్మీడియట్: ప్రగతి జూనియర్ కళాశాల .వలిగొండ 3. డిగ్రీ : శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల భువనగిరి 4. P.G : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ 5. P.H.D : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత హోదా:contract (ఒప్పంద) degree lecturer, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజేంద్రనగర్ ( శంషాబాద్ )

VijayaKumar

Sep 08 2024, 15:16

నీర్నెముల లో తొలి పూజలు అందుకున్న గల్లీ బాయ్స్ యూత్ గణనాథుడు

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ బాయ్స్ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

VijayaKumar

Sep 07 2024, 23:23

తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణతో పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా శనివారం తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణుని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి కిష్టఫర్ సూచన మేరకు తేదీ 27 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్ హరిహర కళా నిలయంలో జరిగే ఉద్యమకారుల సన్మాన మహోత్సవానికి సంబంధించి వలిగొండ మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు పబ్బు లక్ష్మయ్య గౌడ్, గంగదారి సత్తయ్య, గంధమల బాలయ్య గౌడ్లు, బత్తిని రవి గౌడ్, శీలం స్వామి, మంటి రమేష్, కదిరేని స్వామి, గంధమల మల్లమ్మ, నస్రిన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 07 2024, 17:16

నీర్నెముల గ్రామం లో తొలి పూజలు అందుకున్న గల్లీ యూత్ గణనాథుడు

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.