VijayaKumar

Sep 08 2024, 17:56

ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్ కే చాంద్ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్

రామన్నపేట:  తెలంగాణ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు నోముల శంకర్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె చాంద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు డాక్టర్ నకిరెకంటి అశోక్ కుమార్ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య బోగారం మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్ నక్క శంకర్ పాండురంగ చారి మోటే రమేష్ ఉద్యమ నాయకులు రెబ్బాస్ రాములు రేపాక లింగస్వామి రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ సిపిఐ నాయకులు గంగాపురం యాదయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Sep 08 2024, 17:46

వలిగొండ: మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

వలిగొండ  మండలకేంద్రం ఆవాస గ్రామమైన మల్లేపల్లి కి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది పల్లెర్ల మారయ్య, పడిగం సత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.వారి ఇరువురి కుటుంబ సబ్యులకు వలిగొండ కు చెందిన వ్యాపార వేత్త కొండూరు భాస్కర్ సౌజన్యంతో ఇరువురి కుటుంబాలకు 5 వేల చొప్పున ఆదివారం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్, కొండూరు సాయి, పల్లెర్ల రాం చెంద్రo, పల్లెర్ల లక్ష్మణ్, గొల్ల క్రాంతి కుమార్, పడిగం యాదయ్య, లక్ష్మయ్య, గొల్ల గణేష్, సహదేవ్, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 08 2024, 16:03

OU నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన బొడిగే నరసింహ... అభినందించిన దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు


వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడిగె  నర్సింహ తండ్రి యాదయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. " ఫిజికల్ స్పెక్ట్టోస్కోపిక్ ( ఆప్టికల్ ఈ పి ఆర్ ,ఎఫ్ టి ఐ ఆర్ అండ్ రామన్ ) క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ ఇండియావ్ డోఫుడ్ ఆల్కలైన్ ఎర్త్ ఆక్సైడ్ బారేటు గ్లాసెస్ "అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి .రామదేవుడు గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు . వలిగొండ మండలంలో భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి . బోడిగె .నరసింహ డాక్టరేట్ సాధించిన విషయం తెలుసుకున్న దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు విద్యాభ్యాసం 1. పాఠశాల: ప్రగతి హై స్కూల్ 10 th వరకు 2. ఇంటర్మీడియట్: ప్రగతి జూనియర్ కళాశాల .వలిగొండ 3. డిగ్రీ : శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల భువనగిరి 4. P.G : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ 5. P.H.D : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత హోదా:contract (ఒప్పంద) degree lecturer, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజేంద్రనగర్ ( శంషాబాద్ )

VijayaKumar

Sep 08 2024, 15:16

నీర్నెముల లో తొలి పూజలు అందుకున్న గల్లీ బాయ్స్ యూత్ గణనాథుడు

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ బాయ్స్ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

VijayaKumar

Sep 07 2024, 23:23

తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణతో పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా శనివారం తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణుని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి కిష్టఫర్ సూచన మేరకు తేదీ 27 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్ హరిహర కళా నిలయంలో జరిగే ఉద్యమకారుల సన్మాన మహోత్సవానికి సంబంధించి వలిగొండ మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు పబ్బు లక్ష్మయ్య గౌడ్, గంగదారి సత్తయ్య, గంధమల బాలయ్య గౌడ్లు, బత్తిని రవి గౌడ్, శీలం స్వామి, మంటి రమేష్, కదిరేని స్వామి, గంధమల మల్లమ్మ, నస్రిన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 07 2024, 17:16

నీర్నెముల గ్రామం లో తొలి పూజలు అందుకున్న గల్లీ యూత్ గణనాథుడు

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

VijayaKumar

Sep 07 2024, 17:09

దాసిరెడ్డి గూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు మండల పరిధిలోని దాసిరెడ్డి గ్రామానికి చెందిన దంతూరి చిన్న సత్తయ్య కు 60,000 వేల రూపాయల చెక్కును శనివారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాలోజు రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోదా అచ్చయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కాటం గణేష్ గౌడ్, నారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Sep 07 2024, 16:23

వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి జై భీమ్ సేన

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను గోపరాజుపల్లి గ్రామ జై భీమ్ సేన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు, జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య, మాల మహానాడు మండల అధ్యక్షులు నీలం నరేందర్ కుమార్, రిపోర్టర్ సంగిశెట్టి విజయ్ కుమార్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్, కల్చరల్ సెక్రటరీ ,సినీ డైరెక్టర్ నీలం నరేష్ పాల్గొన్నారు.

VijayaKumar

Sep 06 2024, 18:25

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి, మట్టి వినాయక విగ్రహాలతో పూజించా లని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం. 8వ వార్డు జంఖన్నగూడెంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనిపంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవినాయక చవితి పర్వదినానికి హానికర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలను పూజిస్తే జలవనరులకు మేలు చేసిన వారు అవుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్, ఇట్టబోయిన పావని, వార్డు ఇన్చార్జి శబయుద్దిన్,మొగ్గల క్ష్మి ఉడుత రమేష్ శ్రవణ్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు

VijayaKumar

Sep 06 2024, 18:21

వలిగొండలో మూసి ప్రక్షాళన గోదావరి జలాల సాధన సదస్సు

మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మూసి ప్రక్షాళన బునాది గాని,భీమలింగం కాలువల ద్వారా గోదావరి జలాల సాధనకై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని, ఆ పోరాటాల్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ భాగస్వాములు కావాలని మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మాటూరు బాలరాజు పిలుపునిచ్చారు శుక్రవారం రోజున వలిగొండ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో-కన్వీనర్ సిర్పంగి స్వామి అధ్యతన జరిగిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన నీటిని అందించిన మూసి నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నుండి వెలువడిన మానవ వ్యర్ధాలు పారిశ్రామిక వ్యర్థ పదార్థాల వల్ల విష కాలుష్యంగా మారిందన్నారు ఈ మూసి ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు వివిధ అనారోగ్యాలకు గురై అనేక కొత్త జబ్బులు వస్తున్నాయి అన్నారు మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు పరిశ్రమల నుండి వెలబడుతున్న రసాయన పదార్థాలను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యర్థ పదార్థాలను మూసిలో కలుపుతున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మూసి పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలోని బునాది గాని భీమలింగం కాల్వల మరమ్మత్తులకై 260 కోట్లను వెంటనే విడుదల చేయాలని కాలేశ్వరం కాల్వకు సంబంధించిన కెనాల్ కు తూములను ఏర్పాటు చేసి పునాది గాని భీమ లింగం కాల్వల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు రైతులకు గోదావరి జలాలను అందించాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములై పాల్గొని గోదావరి జిల్లా సాధించాలని పిలుపునిచ్చారు జిల్లా గౌరవ సలహాదారు లు ఎండి జాంగిర్ బట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ 20 దశాబ్దాలు గడుస్తున్న చిన్న నీటి వనరులైన బునాది గాని కాలువ పూర్తి చేయలేకపోయారని వెంటనే కాల్వ 34 కిలోమీటర్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలని కాల్వ ద్వారా రైతాంగానికి వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మూసి ప్రక్షాళన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని గోదావరి జలాల సాధన కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ లు కొండమడుగు నర్సింహ,కల్లూరి మల్లేషం, మేక అశోక్ రెడ్డి,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి,జిల్లా నాయకులు మద్దెల రాజయ్య,దయ్యాల నర్సింహ,గడ్డం వెంకటేష్,గుండు వెంకట్నర్సు,గాడి శ్రీనివాస్,వేముల బిక్షం,తుర్కపల్లి సురేందర్,శ్రీశైలం రెడ్డి,గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకట్ రెడ్డి,కవిడే సురేష్,కల్కురి ముత్యాలు,తదితరులు పాల్గొన్నారు మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక వలిగొండ మండల కమిటీ ని 21 మందితో ఎన్నుకున్నారు మండల కన్వీనర్ గా మద్దెల రాజయ్య ఎన్నికయ్యారు.