దేశమంతా మనరాష్ట్రం వైపు చూసే విధంగా సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ద్విసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కుండపోత వర్షాలు పడుతున్న ఈ సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక రోజు ముందుగా 31 వ.. తేదిన అందిస్తూ. అవ్వ తాతల వితంతువుల. వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూచి సంతోషం వ్యక్త పరుస్తున్న కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంటుందని ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, శింగనమల MLA బండారు శ్రావణి గారు, మరియు అనంతపురం MP అంబికా లక్ష్మి నారాయణ గారి ఆదేశాలు మేరకు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఈ రోజు31-8-2024న ఉదయం 6గంటలకు జోరు వానలో కూడా ఇంటి ఇంటి దగ్గరకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తూన్న *టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు* ఈ కార్యక్రమంలో EX.MPP వెంకటేష్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, S. నారాయణ స్వామి, బాబాయ్య, హరి,రంగమ్మ, బాబా వలి, మల్లికార్జున, బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వివాహానికి 10వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
వివాహానికి 10వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం  తరిమెల గ్రామానివాసి శ్రీమతి మలిశెట్టి రమాదేవి శ్రీ మల్లి శెట్టి పెద్దయ్య గార్ల కూతురు ఎం రాజేశ్వరి  వివాహానికి ₹10,000/పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంపయ్య మునయ్య పాల్గొన్నారు.
గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో రిపేరు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు

శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ పనిచేయలేదని కరెంటు కోతలతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శింగనమల డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తమ సొంత నిధులతో శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్, ఆర్.ఓ ప్లాంట్ ను రిపేరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రిపేరు చేయించినందుకు పేషెంట్లు, ప్రజలు ఆసుపత్రి సిబ్బంది , టిడిపి నాయకులు కార్యకర్తలు *శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, టిడిపి సీనియర్ నాయకులు సి వెంకటేష్, బోయ సత్యనారాయణ, మాసుల చంద్రమోహన్, కురాకు రాముడు, గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, ముంత వెంకటేష్, ఆదినారాయణ, సురేష్ యాదవ్ ,రాజబాబు, ఇస్మాల్, ఆర్మీ జిలాన్, మహేష్ యాదవ్, నరసింహ, ముంత గంగరాజు, విజయ్, మాసుల ప్రకాష్, శంకర, వడ్డే ఆంజనేయులు, బెస్త లక్ష్మయ్య, మసూద్ వలి, తదితరులు పాల్గొన్నారు.
సిద్దారంపురం గ్రామంలో తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం..
MLA బండారు శ్రావణి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారి ఆదేశాలు మేరకు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో తెలుగుభాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ZPH స్కూల్ లో క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో *శ్రీనివాస బుక్ సెంటర్ లోకానాథ్ రెడ్డి , హెడ్ మాస్టారు నీరజ , ZPH స్కూల్ కమిటీ చైర్మన్ లింగమయ్య , ప్రాథమిక పాఠశాల కమిటీ చైర్మన్ అంజి , కాటమయ్య,నాగేంద్ర, రవి, నరసింహులు, చిన్నరాజు, మాధవయ్య* తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి.
కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి. మృతిని కుటుంబానికి చెక్కు అందజేత. అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి. గత నెల జూన్ 27 వ తేదీ టీడీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన వైస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య (55) కుటుంబానికి అండగా నిలుస్తూ వైస్సార్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో మృతుని కుటుంబానికి పార్టీ నుంచి వచ్చిన రూ.5 లక్షలు చెక్కును, తన వంతు సహాయంగా లక్ష రూపాయలను అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎరికలయ్య పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.వైస్సార్సీపీ ప్రతి కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎంపిపి రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
8వ రోజు సత్య సాయి కార్మికులు సమ్మె మద్దతు పలికిన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో సత్య సాయి కార్మికులు సమ్మె 8వ రోజు కు చేరుకున్నది 6 నెలల వేతనం విషయ ఇంత వరకు ఏమి తెలలేదు మన రాష్ట్ర CM గారు మంచినీటి ప్రాజెక్ట్ కు నిధులు కేటాంచడం లో ఎందుకు ఆలస్యం అవుతుంది నేను చూస్తాన్నాడు ఇక్కడ కార్మికుల ఆకలి బాధలు ఎక్కువ అవుచున్నది దయచేసి మమీద దయవుంచి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నిలబెట్టడం మీ వంతు సార్ లేదుంటే సత్య సాయి ట్రస్ట్ వారిని ఒక విన్నపం R J రాత్నాకర్ సార్ బాబా గారు పేరు చెడ్డ పేరు వస్తుంటే మీరు ఐనా జోక్యం చేసుకొని చూడాల్సి బాధ్యత లేదా సార్ ఆలోచన చేయండి మీ కళ్ళముందర జరుగుచున్న విషయాలను కార్మికులు పస్థులుండి పనిచేసి అడుగుకోవలసి పరిస్థి అట్లా జరగకుండా CM గారి తో మాట్లాడి ఇప్పించే టట్లు చూడాలని కోరుచున్నాము ఈ రోజు ప్రజా సంగం నాయకుడు 0 నల్లప్ప ఇఫ్ట్ నాయకుడు k ఉపేంద్ర కుమార్ మద్దత్తు తెలుపుతున్నారు కార్మిక సంఘం నాయకుడు k. రాఘవేంద్రచారి వర్కర్స్ దేవదాస్ కిష్టప్ప లక్ష్మన్న నాగరాజు పెద్దన్న నల్లప్ప భాస్కర్ నారాయణ విశ్వరూప విశ్వనాధ్ వలి నరేష్ సామెల్ మస్తానువాలి గంగప్ప కుమార్ నాయుడు పోతలయ్య
7వ రోజు చేరుకున్న సత్య సాయి కార్మికులు సమ్మె..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్ర మండల కేంద్రంలో సత్య సాయి కార్మికులు సమ్మె 7వ రోజు కొనసాగుతున్నది. 6నెలలు నుండి వేతనలు రాక జిల్లా మొత్తం 600గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ బోర్డు SE గారు ఏమీ పట్టించుకోన లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రజల కు నీటి సరఫరా ఆగిపోయిన ఏంపర్వాలేదు మీరు మాత్రం ఆఫీస్ లో కూర్చొని పొతే కార్మికులకు వేతనం గురుంచి మాట్లాడే పరిస్థితి లేదు కలెక్టర్ గారు. ఎందుకు ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు వర్కర్స్ యొక్క ఆకలి బాధలు పట్టించుకోరా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
14వ బెటాలియన్ కమాండెంట్.. K. ప్రభు కుమార్ కమాండెంట్
కర్నూలు 2వ బెటాలియన్ నందు అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తూ కమాండెంట్ గా ప్రమోషన్ తీసుకొని 14వ బెటాలియన్ కమాండెంట్ గా ప్రభుత్వం నియమించడం జరిగింది. 28వ తేదీ రోజున 14వ బెటాలియన్ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరు నందు K. ప్రభు కుమార్ కమాండెంట్ గారు ప్రమోషన్ తీసుకుంటూ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ప్రతిష్టాత్మకంగా దులీప్ ట్రోఫీని నిర్వహించాలి,  లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం నగరంలోని ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారి నిర్వహించే దులీప్ ట్రోఫీ కోసం జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాల సహకారం అందించాలన్నారు. అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మధు ఆచారి మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే దులీప్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని, ఇందుకు లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ కి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, 160 కెవి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని, దాని నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం పాటించాలన్నారు. క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో మెడికల్ అరేంజ్మెంట్స్ చేయాలని, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, పీహెచ్సీ సిబ్బందిని నియమించాలని సూచించారు. క్రికెట్ పోటీలను చూసేందుకు బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కామెంటేటర్లు, క్రీడాకారులు రావడం జరుగుతుందని, విఐపి జాబితాను సిద్ధం చేయాలన్నారు. మ్యాచ్ లను సదావుగా నిర్వహించేందుకు డిఎస్డివో పరిధిలోని కోచ్ లను వాలంటీర్లుగా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని, సెక్యూరిటీ ప్లాన్ పరిశీలించాలని డిఎస్పీని ఆదేశించారు. దులీప్ ట్రోఫీ ఏర్పాట్లను తహసిల్దార్, ఎంపీడీవో, ఏఈ, మున్సిపల్ కమిషనర్, డివిజన్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, తదితరులు రోజువారీగా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. క్రికెటర్లు ఉండే హోటల్స్ వద్ద పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీటీ స్టేడియాల్లోని గ్యాలరీల క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేపట్టాలని, పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు జాగ్రత్తగా చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులకు రొటేషన్ పద్ధతిలో పాసులు అందించాలన్నారు. నాలుగు రోజులు జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం 4000 కెపాసిటీ కలిగిన ఆర్డీటీ స్టేడియంలో రోజువారీగా పాసులను ఉచితంగా అందించడం జరుగుతుందని, ఎంట్రీ ఉచితంగానే ఉన్నా.. పాసు ఉంటేనే అనుమతించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ జి. రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆదిత్య వర్మ, మున్సిపల్ కమిషనర్ పీవీఎస్ఎన్ మూర్తి, గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డిఎస్డివో షఫీ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డీఈవో వరలక్ష్మి, డీఎస్పీ ప్రతాప్ కుమార్, రంజీ క్రికెటర్ షాబుద్దీన్, కోచ్ యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక..
అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు జరుగు దులీప్ ట్రోఫీ( భారత క్రికెట్ జట్టు పాల్గొనే) టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక అవ్వడం జరిగింది వారికి హృదయపూర్వక అభినందనలు.