కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,ఆగస్టు30 : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 128 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను శుక్రవారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాలు అర్హులైన ప్రతి ఒక్కరి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముభారక్ ఫైల్ తన వద్ద పెండింగ్ లో ఉండవని వెను వెంటనే సంతకాలు చేసి ఎమ్మార్వోలకు పంపుతామని, తనకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పని చేసి పెడతానని అన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు కూడాతీసుకువస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్, పుష్పలత, మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, భాజపా జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, సంజీవ్, మల్లేష్, చప్పిడి సంజీవ్, శ్రీనివాస్, అశోక్, రాజు, సుమన్, తిరుపతి, రాజు, రవీందర్, కోట వేణు తదితరులు పాల్గొన్నారు.
Aug 31 2024, 00:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0