VijayaKumar

Aug 30 2024, 19:41

భువనగిరి పార్లమెంట్ స్థాయి సాగునీటి కాలువల పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

భువనగిరి పార్లమెంట్ స్థాయి సాగునేటి కాల్వల పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశానికి శుక్రవారం హెలికాప్టర్ లో భువనగిరికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు* అనంతరం రోడ్డు మార్గం ద్వారా భువనగిరి మండలం అనాజిపురం శివారులోని బునాధిగాని కాల్వ వద్దకు చేరుకొని కాల్వను పరిశీలించి, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశంలో *ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు,బీర్ల అయిలయ్య గారు,మందుల శామ్యూల్ గారు,వేముల వీరేషం గారు,మల్ రెడ్డి రంగా రెడ్డి గారు,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు,భువనగిరి యంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పాల్గోన్నారు* *ఉత్తమ్ కుమార్ రెడ్డి (నీటిపారుదల శాఖ మంత్రి ) కామెంట్స్ :* *నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా..* లక్షకోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోవడం ప్రశ్నార్ధకం.. మెడిగడ్డ ,సుందిళ్ళ బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్ధకం.. గందమల్ల ప్రాజెక్టును మంజూరు చేసి పూర్తి చేస్తా.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తా.. *బునియాదిగాని ,పిల్లయిపల్లి, దర్మారెడ్డి పల్లి కాలువలకు ఎన్ని నిధులైన ఖర్చు చేసి పూర్తి చేస్తాం* దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియాగాంధీ ప్రారంభింస్తాం..

VijayaKumar

Aug 30 2024, 18:24

చిన్న పరిశ్రమలే దేశానికి వెన్నుముక : చిక్క ప్రభాకర్ గౌడ్ ప్రిన్సిపాల్ నవభారత్ డిగ్రీ కళాశాల

భువనగిరి:  చిన్న తరహా పరిశ్రమలే దేశానికి వెన్నెముక గా నిలిచి, దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం "స్కిల్ ఇండియా" సహకారంతో ఏర్పాటు చేసిన విద్యార్థుల శిక్షణా,అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో 2021 నుండి ప్రతి ఏటా ఆగస్టు 30 న *జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని* జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించతో పాటు, దేశాన్ని ఆర్దికంగా అగ్ర భాగాన నిలబెట్టవచ్ఛని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సఫల్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సీనియర్ రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు కూడా చిన్న తరహా పరిశ్రమలు గానే ప్రారంభమై నేడు టాప్ టెన్ లో నిలిచాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, పరిశ్రమల స్థాపనలో, మరియు స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాదాన్యత ఇవ్వాలని కోరారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులకు శిక్షణా మరియు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్, నవభారత్ కళాశాల అధ్యాపకులు ఫూల్ చంద్, సంతోష్ కుమార్, రీసోర్స్ పర్సన్లు వగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, మాటూరి దశరథ, మహిపాల్ , హరిబాబు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 29 2024, 21:37

కొలనుపాక జైన ,సోమేశ్వర దేవాలయం సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన *తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు  బీర్ల ఐలయ్య , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర  యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం  ఆలేరు మండలం కొలను పాక గ్రామం లోని చారిత్రాత్మక అతి పురాతనమైన జైన్ మందిర్, శ్రీ సోమేశ్వర దేవాలయాల సందర్శన కోసం జిల్లాకు విచ్చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాఘతం పలికారు. శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని,అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు.

VijayaKumar

Aug 29 2024, 17:08

ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్

భువనగిరి: ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నర్సింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కోసం తక్షణమే 13 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని అన్నారు. సగం మంది రైతులకే మాఫీ కావడం వల్ల మిగతా సగం మంది రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అన్ని పనులు మాని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 45 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనాకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పికేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నారు. వారు చెప్పిన ప్రకారమే 13వేల కోట్ల రూపాయలను వెంటనే చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సవరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. రైతు వేదికల ద్వారా కాకుండా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాల అవుతున్న రెండు సీజన్లకు రైతు బరోసా డబ్బులు ఇవ్వకుండా తాత్సార్యం చేస్తుందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో కరెంటు కోతలను నివారించే నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం బొమ్మలరామారం మండల కార్యదర్శి రాకల శ్రీశైలం, నాయకులు ఏదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి, అబ్దుల్లాపురం వెంకటేష్ , వనం రాజు,సిలివేరు ఎల్లయ్య, కొండా అశోక్, కూకుట్ల కృష్ణ, చింతల శివ, వడ్డబోయిన వెంకటేష్, మచ్చ భాస్కర్, ఐతరాజు కిష్టయ్య, పండాల మైసయ్య, బోడ ఆంజనేయులు బందెల ఎల్లయ్య, మోకు దేవేందర్ రెడ్డి, రంగా కొండల్, కడారి కృష్ణ, ముత్యం ప్రకాష్, పాలడుగు రవి , గోరేమియా పాల్గొన్నారు.

VijayaKumar

Aug 29 2024, 17:06

శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలోఎంటర్ప్రైన్యూర్ షిప్ పై అవగాహన సదస్సు


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఆద్వర్యంలో విద్యార్థులకు రెండు రోజుల శిక్షణా సదస్సులో భాగంగా గురువారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. స్కిల్ ఇండియా వారి సహకారంతో సఫల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, మెలకువలు, ఆర్థిక వనరుల సమీకరణ, వ్యాపార నిర్వహణ, ప్రభుత్వ సహకార పథకాలపై కల్పించిన అవగాహనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ సూక్ష్మ , కుటీర, చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు,రుణ సౌకర్యాలు, సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగి, నలుగురికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ అవగాహన సదస్సు సమావేశంలో రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంజి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 28 2024, 22:38

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడిచి చేయాలి: AISF


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏ ఐ ఎస్ ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8 వేల కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని విద్యా వ్యవస్థ సక్రమంగా నడవడానికి వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిల పేరుతో సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థుల కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని అన్నారు.

VijayaKumar

Aug 28 2024, 17:28

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు బుదవారం జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి మల్లం వెంకటేశం కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు మరియు జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి,మాదగోని శ్రీనివాస్ గౌడ్, పందుల రాజు గౌడ్, బత్తుల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 27 2024, 18:55

బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిట్టా బాలకృష్ణా ని మంగళవారం  పరామర్శించిన ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి . జిట్టా బాల కృష్ణ రెడ్డి కి అందిస్తున్న వైద్యం వివరాలను యశోద డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు.

VijayaKumar

Aug 27 2024, 18:44

సెప్టెంబర్ 2న కర్ణాటకలో IFWJ 78వ జాతీయ కౌన్సిలింగ్ మహాసభలను విజయవంతం చేయండి:TJU జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా

తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా* భువనగిరి టౌన్ మంగళవారం 27 మంగళవారం దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐ ఎఫ్ డబ్ల్యు జె )78వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు జిల్లా టిప్టూర్ రీజినల్ సెంటర్ లో సెప్టెంబర్ 2న జరుగుతాయని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా పిలుపునిచ్చారు. మంగళవారం రోజున జిల్లా కార్యాలయం లొ జర్నలిస్టుల సమావేశంలో షానూర్ బాబా పాల్గొని మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో టిప్టూర్ లో రాష్ట్ర అధ్యక్షులు శివానంద్ తగ్గూర్ అధ్యక్షతన ఈ జాతీయ కౌన్సిల్ మహాసభలు మూడు రోజులు జరుగుతున్నాయని దేశంలో ఉన్న ఐఎఫ్డబ్ల్యూజే కమిటీ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ నాయకులు మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు,కమిటీ సభ్యులు, హాజరవుతున్నారని ప్రతి ఒక్కరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ కాజఫసివుద్దీన్, జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నబత్తి నీ మత్యాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రహమాన్, జిల్లా కోశాధికారి బైరపాక సీరిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 27 2024, 18:09

హైడ్రా పై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

హైడ్రా పై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ,దాని పనితీరు మీద ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసారు. హైడ్రా పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని. చెరువులు,కుంటలు కాపాడుకోవడానికి హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడ ఏర్పాటు చేయాలని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ను లేఖ ద్వారా బీర్ల ఐలయ్య   రేవంత్ రెడ్డికి కి విజ్ఞప్తి చేయడం జరిగింది.