ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: మంత్రి సీతక్క
ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వండి
విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తాం
TG: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వాలని.. అంగన్వాడీల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇస్తే.. చిన్నారులకు తినేందుకు అనువుగా ఉండటంతో పాటు, గుడ్డులో ఏదన్నా నలత వున్నా గుర్తించి పడేయవచ్చని అన్నారు. కోడిగుడ్లను, వస్తువులను భద్రపరచుకునే వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటు చేయలే లేకపోయిందని తెలిపారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే రాక్లను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. టేక్ హోం రేషన్లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లికిత పూర్వకంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులను ప్రాంతాల్లో టేక్ హోం రేషన్ను వారింటికి తీసుకువెళ్లి ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు.
ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూసే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ఇక్కడ తప్పు జరిగిన అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, సీఎం, మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారని ఆమె స్పష్టం చేశారు.
వచ్చే నెల 4 నుంచి జిల్లాల్లో పర్యటించి శాఖా పరంగా అమలవుతున్న పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్వాడీ కేంద్రాలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా మన అంగన్వాడీ పాఠశాలలు ఉండాలని.. ఆ దిశగా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క

తెలంగాణ : ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు. అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా వేస్తారు. ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు.
కి అప్పగించడం జరిగింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్నగర్, ఆగస్టు29: కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని వంజరికి వెళ్ళే దారిలో గల ఓ ప్లాట్లో(69/1/1) ఇటీవల అక్రమంగా నిర్మించిన దుకాణామును తొలగించాలని కోరుతూ గురువారం రోజున యజమానులు నగునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు షాపు యజమానికి గ్రామపంచాయతి నుండి పలుమార్లు నోటీసుకు జారీ చేసినా సదరు యజమాని షాపును తొలగించకుండా యజమానులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై ఎక్స్ సర్వీస్మెన్/ హుమెన్ రైట్ ప్రొటక్షన్ సభ్యులు శివకుమార్ అట్టి అక్రమ నిర్మాణం వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రేపటి వరకు షాపును తొలగించని పక్షంలో తామే అట్టి దుకాణంను తొలగిస్తామని అన్నారు. అట్టి దుకాణంలో బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. సీఐ స్వయంగా తణిఖీ చేయగా మద్యం సీసాలు లభ్యం అయ్యాయని, అయినా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎస్ఐ మహేందర్ ను కలిసి తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు29, : కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ మారుతి నగర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు గురువారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు చేశారు.రూ.25 లక్షల అంచనాతో నిర్మించనున్న ఈ క్లినిక్ వలన కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. కుక్కలకు ఈ క్లినిక్ లో స్టెరిలైజేషన్ నిర్వహించి వదిలేస్తారని, దాని వలన కుక్కల సంతతి పెంపు కాకుండా అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ అంజయ్య,స్థానిక కౌన్సిలర్లు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, ముత్తు అశోక్ పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్,ఆగస్టు 28 : విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయి సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆహారం తినే ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రపరచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి ఉన్నత ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపవైద్యాధికారి సీతారాం నాయక్, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోగల ప్రధానమైన నాల పైన కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టినారు. 60 ఫీట్ల ఉన్న నాలా కేవలం 10 సీట్లకే పరిమితమైంది దాని వలన వర్షాకాలం నీటి ప్రవాహం సరిగా లేక పలు కాలనీలో నీటి వరద రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు . పెట్రోల్ పంప్ ఏరియా గుండా ప్రవహిస్తున్న నాలా రైల్వే పట్టాల వరకు విస్తరించి ఉంది దానికి ఇరువైపులా అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను తొలగించాలని కోరుతూ మంగళవారం రోజున మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో సంపూర్ణ బంద్.
Aug 30 2024, 11:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k