తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:23

తెలుగు ప్రజలకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. ఇక మాతృభాషలో కస్టమర్ సపోర్ట్!

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలిపింది. కొత్త 7 ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌కి చెందిన ఎయిరిండియా తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తమ కస్టమర్ కేర్ సర్వీసులను ప్రాంతీయ భాషలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కస్టమర్ సర్వీసులు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది ఎయిరిండియా.

7 ప్రాంతీయ భాషల్లో తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ, మలయాళం ఉన్నాయి. ఈ ప్రాంతీయ భాషల్లోనూ ఇక కస్టమర్ కేర్ సర్వీసులు అందించనుంది ఎయిరిండియా. ఈ ప్రత్యేక అసిస్టెంట్ సర్వీసులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అలాగే కొత్తగా 5 కాంటాక్ట్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తరుచుగా ఎయిరిండియాలో ప్రయాణించే వారితో పాటు ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్ ఐవీఆర్ వ్యవస్థ ద్వారా మా కస్టమర్లకు మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వారి స్థానిక భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తించనున్నాం. దీంతో వారు ప్రత్యేకంగా భాషను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. తమ మాతృభాషలోనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది మా విలువైన కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.' అని ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:29

కోల్కతా వీధుల్లో మళ్లీ ఉద్రిక్తత- ‘నబన్నా మార్చ్’ పై దీదీ నిఘా!

ఆర్జీ మెడికల్ కాలేజ్లో కోల్కతా వైద్యురాలి హత్యపై నిరసనగా పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన 'నబన్నా అభియాన్'లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోల్కతాలోని సెక్రటేరియట్ (నబన్నా)కు మార్చ్ చేపట్టిన నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రోడ్డు మీద ఉన్న వారిని చెల్లాచెదురు చేసేందుకు జల ఫిరంగులు ఉపయోగించారు.

నబన్నా మార్చ్కి అనుమతులు ఇవ్వబోమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ర్యాలీలో హింసకు పాల్పడేందుకు పలువురు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. అయినప్పటికీ నిరసనకారులు ముందుకు కదిలితే, వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. నిరసనకారులు సెక్రటేరియట్కు చేరుకోకుండా చూసేందుకు 6వేలకుపైగా మంది పోలీసులను మోహరించింది. ర్యాలీపై డ్రోన్ నిఘా పెట్టింది. అంతేకాకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది.

కానీ మంగళవారం మధ్యాహ్నం నిరసనకారులు నబన్నా మార్చ్ని ప్రారంభించారు. కోల్కతా వైద్యురాలి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకారులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు కదిలారు. వారిపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. వారిని తరిమికొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

మరోవైపు జలఫిరంగులు ఉపయోగించినప్పటికీ, పలువురు నిరసనకారులు వెనుదిరగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోల్కతా వైద్యురాలి హత్యకు న్యాయం జరగాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు.

కోల్కతా పోలీసు పరిధిలో కనీసం 25 మంది డీసీపీ స్థాయి అధికారులు భద్రతను నిర్వహించడం, నలుగురు ఐజీలు, పలువురు డీఐజీలు, ఎస్పీ స్థాయి అధికారులు హౌరాలో భద్రతా దళాలకు నాయకత్వం వహించడంతో నేటి ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణించిందో అర్థం చేసుకోవచ్చు. 'నబన్నా అభిజన్' ర్యాలీ సచివాలయం వద్దకు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి సంస్థ 'పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్', అసమ్మతి గ్రూపు 'సంగ్రామి జౌతా మంచా' ప్లాన్ చేసిన ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటికే "చట్టవిరుద్ధం, అనధికారికమైనది" అని ప్రకటించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:13

కోల్‌కతా ఘటన మరవకముందే.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం

Maharashtra | రత్నగిరి (Ratnagiri) జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు.

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (sexually assaulted) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కోల్‌కతా ఘటన మరవకముందే.. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రత్నగిరి (Ratnagiri) జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల నర్సింగ్‌ ట్రైనీ విద్యార్థిని కళాశాలను ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. దారి మధ్యలో విద్యార్థినితో డ్రైవర్‌ మాటలు కలిపాడు. తాగేందుకు మంచినీరు అందించాడు. అయితే అప్పటికే ఆ నీటిలో మత్తుమందు కలిపి ఉండటంతో.. అవి తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్‌ నిర్మానుష్య ప్రదేశానికి యువతిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తూ గంటల తరబడి రహదారిని దిగ్బంధించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:09

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగళా సర్కిల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలపై ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాల అధిపతులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రద్దీని నివారించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

భక్తులకు అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ముందస్తుగా చాలినన్ని లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:02

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ఆర్డర్‌లోని కీలక అంశాలు ఏంటంటే...!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై దాదాపు గంటన్నర పాటు వాదనల అనంత‌రం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల‌తో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. 

ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం పేర్కొంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. 

అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెక్షన్‌ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సంద‌ర్భంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. దీంతో దాదాపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బయటకు రానున్నారు. ఇక క‌విత‌కు బెయిల్ ల‌భించ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.  

కవిత బెయిల్‌ ఆర్డర్‌లోని కీలక అంశాలివే..!

పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్‌ చేయాలి 

కేసు ట్రయల్‌కు సహకరించాలి

విదేశాలకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా కోర్టు అనుమతి తీసుకోవాలి

విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 13:02

హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి

జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్‌ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.

జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్‌ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు. హైడ్రా సంస్థ చేపడుతున్న అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు కేటీఆర్‌, హారీష్‏రావు(KTR, Harish Rao)లు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జంట నగరాలలోని ప్రజలకు గతం లో తాగునీటిని అందించిన చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిలో అధిక శాతం బీఆర్‌ఎస్‌(BRS) నేతలు ఉన్నందుకే వారు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సీఎం చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హైడ్రాకు మద్దతుగా తాము నిలబడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డీ.హెచ్‌. ఉమేష్‌, సీవీ రఘునందన్‌రావు, రాజ్‌కుమార్‌, సత్యనారాయణ, సుశీల్‌గాంధీ, సత్యనారాయణ పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 13:00

వరంగల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. హైకోర్టులో 200 మంది పిటిషన్లు..

అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఎక్కడపడితే అక్కడ.. చెరువులను కూడా పూడ్చేసి మరీ స్థలాలను ఆక్రమించి భారీ బిల్డింగ్‌లు లేపేశారు. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఎక్కడపడితే అక్కడ.. చెరువులను కూడా పూడ్చేసి మరీ స్థలాలను ఆక్రమించి భారీ బిల్డింగ్‌లు లేపేశారు. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొందరు వ్యతిరేకిస్తుండగా మెజారిటీ ప్రజానీకం మాత్రం మద్దతుగా నిలుస్తోంది. పలు పార్టీలకు సైతం హైడ్రాకు మద్దతు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లంతా కలవనున్నారు. హైడ్రాకు మద్దతు తెలపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు దీనిని జిల్లాకు విస్తరింప జేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ లేఖలు రాశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తమ లేఖల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

వరంగల్‌లోనూ అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టులో 200 మంది ఇప్పటికే కూల్చివేతలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ దేశాయిపేట్ ఎంహెచ్ నగర్ చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అక్కడంతా పేదలు పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఇల్లు కూల్చేస్తామని వరంగల్ మునిసిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులను సవాల్ చేస్తూ 200మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ నిర్వహించారు. ఎలాంటి సర్వే చేయకుండా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు

30 నుంచి 60 చదరపు గజాల స్థలంలోనే పిటిషనర్ల గుడిసెలు ఉన్నాయని పిటిషన్ తరుఫు న్యాయవాది వాదించారు. ప్రజలకు జారి చేసిన పట్టాలపై విచారణ జరపాలని.. అప్పటివరకు పిటిషనర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టొద్దని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తాజాగా ప్రకటించారు. హైదరాబాద్‌ తర్వాత అన్ని జిల్లాల్లోనూ చెరువులు పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని... హైడ్రాకు మంచి స్పందన వస్తోందని, ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. హైదరాబాద్‌ ఒకప్పుడు లేక్‌ సిటీగా ఉండేదని, చెరువుల పరిరక్షకులు ఆక్రమణలపై ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని పొన్నం సూచించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 12:56

వారి రుణమాఫీపై నేడు స్పష్టత..!

రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు.

రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.

దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 08:15

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే...

హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు కూలిస్తే ఒకే కానీ.. పేద వారిపైనే మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదేలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినవాళ్లు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని.. ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ హైడ్రా యాక్షన్‌ పై అటు , బీఆర్ఎస్‌ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు రెండు రోజులు నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి. తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూసిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది.? సీఎం రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్‌కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.

ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పాతబస్తీ వాసులు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని.. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను జనాలు ప్రశ్నిస్తున్నారు . దీంతో ఫాతిమా కాలేజ్‌పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తన పై కక్ష ఉంటే తూటాలతో కాల్చాలని.. కానీ తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్.

పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని.. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్‌. తాను బలహీనుడినయ్యానని శత్రువులు అనుకుంటున్నారని.. ఒక వేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థినులే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. కాగా.. హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్‌, GHMC కార్యాలయం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ భవనాలు ఎఫ్టీఎల్‌లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని భవనాలకు ఒకే న్యాయం ఉండాలన్నదే తమ అభ్యంతరమన్నారు అసదుద్దీన్ ఒవైసీ. మరి హైడ్రా కూల్చివేతలపై అటు బీజేపీ ఇటు ఎంఐఎంల ప్రశ్నలకు రేవంత్ సర్కార్ దగ్గర సమాధానాలు ఉన్నాయా.. లేదా..అనేది వేచి చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 17:08

టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం

అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఉత్సవాలను ఉ 8 గంటలకు, రా 7గంటలకు వాహన సేవలు

అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు నాయుడు స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

బ్రహ్మోత్సవాలు సమయంలో సిఫార్సు, అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు.

7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతాం..

గరుడ సేవను 6.30 గంటలకే ప్రారంభిస్తాం.

పోలీసుల సహకారంతో

భద్రతా పరంగా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నాం.

వాహన సేవలు జరిగే మాడ వీధులతో పాటు క్యూ లైన్లలో అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తాం..

డీపీపీ ఆధ్వర్యంలో కళాబృందాలతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

తిరుమలలో నీటినిల్వలు మరో 130 రోజులకు సరిపడా ఉన్నాయి

మున్సిపల్ కార్పోరేషన్

25 లక్షల గ్యాలన్లు, కళ్యాణ డ్యామ్ నుండి 11 లక్షల గ్యాలన్ల నీటిని ప్రతిరోజు తీసుకుంటాం

అవసరమైతే

కండలేరు నుండి నీటిని తీసుకుంటాం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిసరఫరా చేస్తాం

భక్తులు ,స్థానికులు నీటిని పొదుపుగా వాడుకోవాలి