తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 14:55

హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైడ్రాను (Hydra) ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ( Kisan Cell National Vice President Kodanda Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.

తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై (CM Revanth Reddy) ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు.

ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 14:49

గుంటూరుజిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. వాళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశం

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రజల్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వెంటనే విదేశీయుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీని కోసం ఓ వెబ్‌‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పించి వివరాలను తెలియజేయకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.

గుంటూరు జిల్లా ప్రజల్ని పోలీసులు అలర్ట్ చేశారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పిస్తే వారి వివరాలు వెంటనే తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా పరిధిలో విద్య, ఉద్యోగాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల కోసం, వైద్యం కోసం విదేశీయులు వస్తున్నారని సమాచారం ఉందన్నారు. విదేశీయులకు వసతి కల్పించిన ఇళ్లు, హోటల్, గెస్ట్ హౌస్‌లు, సత్రాలు, యూనివర్శిటీలు, ఆసుపత్రులు, వివిధ సంస్థలు.. కచ్చితంగా 24 గంటల్లోగా వివరాలను తెలియజేయాలన్నారు.

ఒకవేళ వసతి కల్పిస్తే.. వెంటనే https:///indianfrro.gov.in/frro/FormC లోని Form-C లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఆయా యజమానులు సంబంధిత వివరాలతో రిజిస్టర్‌ కావాలన్నారు.. అలాగే ఆ విదేశీయుడి పాస్‌పోర్టు, వీసా వంటి వివరాలు నమోదు చేయాలి అన్నారు. ఆ వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లను గుంటూరు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారికి అందజేయాలని సూచించారు. అక్కడి నుంచి ఆ విదేశీయుల వివరాలు బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా చేరుతుందన్నారు.

విదేశీయులకు వసతి కల్పించిన వారు.. ఫారం-సి నమోదు చేసేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని 0863-2233351, 2233352 నంబర్లలో సంప్రదించాలని సూచించారు జిల్లా ఎస్పీ సతీష్ కుమారు. ఒకవేళ ఎవరైనా యజమానులు వివరాలు అందించకుండా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ప్రజలకు అనుమానిత విదేశీయులు ఎక్కడైనా కనిపిస్తే.. వెంటనే వారి సమాచారాన్ని డయల్‌ 100కు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్‌లకు, స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయ ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలి అన్నారు

మరోవైపు గుంటూరు జిల్లా పోలీసులు వారధి పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ వారి యొక్క సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించటమే వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. మహిళలు, విద్యార్దులు సోషల్ మీడియాలోలో తమ ఫొటోలోను అప్‌లోడ్ చేయొద్దని.. అపరిచితులకు వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదన్నారు.

ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎస్పీ. గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచుకోవాలని.. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తగాదాల వలన జరిగే నష్టాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాల వలన జరిగే నష్టాలు ,ఆన్లైన్ సైబర్ నేరాలు గురించి వీడియో ప్రొజెక్టర్లు ద్వారా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఊరిలో.. గ్రామ శాంతి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఈ గ్రామ/వార్డు శాంతి కమిటీల సహాయంతో సంబంధిత SHOలు లా & ఆర్డర్ సమస్యలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ గ్రామంలో ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, సంబంధిత SHO లేదా పోలీసు అధికారి ఈ శాంతి కమిటీల సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 12:52

తెలంగాణలో భారీ స్కాం: కూసాలు కదిలినట్టే..!!

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కుంభకోణం వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నకిలీ బిల్లులను సమర్పించడం ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి భారీగా నిధులను విత్ డ్రా చేసిన ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎంఆర్ఎఫ్ కింద పేషెంట్లకు వైద్యం చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వాటి ద్వారా నిధులను విడుదల చేయించుకున్నాయి ఆయా ఆసుపత్రుల యాజమాన్యం.

దీనిపై సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ కుంభకోణంలో కొందరు బడా నాయకులు సైతం ఉన్నట్లు తేలింది.

దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సీఐడీకి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులపై ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధి జాబితా నుంచి తొలగించారు.

హైదరాబాద్‌లో- అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, జననీ ఆసుపత్రి, హిరణ్య ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, శ్రీ రక్ష ఆసుపత్రి, ఎంఎంఎస్ ఆసుపత్రి, ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి తిరుమల ఆసుపత్రి ఉన్నాయి.ఖమ్మంలో- శ్రీకర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైష్ణవి ఆసుపత్రి, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి, ఆరెంజ్ ఉన్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 12:43

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు : వైఎస్‌.జగన్‌

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని …. రాష్ట్ర ప్రజలందరికీ వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ ట్వీట్‌ చేశారు. ” రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది.

చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం.

మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 09:00

రుణమాఫీ వర్తించని రైతులకు అలర్ట్.. రేపటి నుంచి డైరెక్టుగా ఇంటికే..

అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది.

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మెుత్తం రూ. 31 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు సర్కార్ వెల్లడించింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవటం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌' ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటి (ఆగస్టు 27) నుంచే ఈ సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.

అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళతారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్‌ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం సైతం తీసుకుంటారు. అందులో యజమాని తన లోన్ అకౌంట్, సంబంధిత బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఫోన్ నెంబర్ కూడా రాయాలి. వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి అటెస్టేషన్‌ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 21:46

శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు.. భక్తుల కోసం కొత్తగా.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు. అన్నివిభాగాల అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న ధ్వజారోహణం నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడ వాహనసేవ మాత్రం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల కోసం సుమారు ఏడు లక్షల లడ్డూల బఫర్‌ స్టాక్‌ ఉంచారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కామన్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా భద్రత పర్యవేక్షించనున్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు, వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ఈవో తెలిపారు. అలాగే తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని కోరారు. ఇక బ్రహ్మోత్సవాల కోసం 4,000 మంది శ్రీవారి సేవకులు, తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందించనున్నారు. ఇక అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద ద్విచక్రవాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లుచేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా 8 ప్రథమ చికిత్సా కేంద్రాలు

మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో ఆరు డిస్పెన్సరీలు నడుస్తున్నాయి. వీటి ద్వారా భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటుగా అదనంగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు,రాంబగీచ అతిథి గృహాలు, తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 21:39

ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. స్పేస్ కిడ్జ్ సంస్థ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవల తయారుచేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్‌ను పవన్ కళ్యాణ్‌కు చూపించి.. దాని పని విధానం, ఉపయోగాలను వివరించారు.

పిల్లల్లో దాగిఉన్న అపరిమితమైన ఊహాశక్తిని వెలికి తీసి.. వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యంగా స్పేస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తుంది. విద్యార్థి దశలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై మక్కువ పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనవైపు విద్యార్థులు మళ్లించే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా స్పెస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తోంది. ముఖ్యంగా పలు ఉపగ్రహాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పెస్ కిడ్జ్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో స్పెస్ పార్క్ ఏర్పాటుపై స్పెస్ కిడ్జ్ ప్రతినిధులతో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం ఎంతైనా అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి.. వారిని శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 21:30

అల్లు అరవింద్ నాకు లైఫ్ ఇచ్చారు : పవన్ కల్యాణ్

మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చర్చనీయంశంగా మారింది.

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది . సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్దానికి దిగుతున్నారు.

చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు ఎవరంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తుండగా, అల్లు రామలింగయ్య లైఫ్ ఇవ్వకపోతే చిరంజీవి ఎవరంటూ అల్లు అభిమానులు మెగా అభిమానులకు కౌంటరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాకు లైఫ్ ఇచ్చిన వారిలో అమ్మ-నాన్న తర్వాత మా అన్నయ్య చిరంజీవి రెండోది అల్లు అరవింద్‌ని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయనే నన్ను హీరోగా లాంచ్ చేశారని, నన్ను హీరోగా పెట్టి రెండు సినిమాలు చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అల్లు అరవింద్ లేకపోతే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉండేవాడో కూడా తెలియదంటూ అల్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 21:25

రాజమౌళితో సినిమా చేయనని చెప్పిన త్రిష..?

దర్శకుడు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయిన కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా , చేయనని చెప్పారట హీరోయిన్ త్రిష.

రాజమౌళి దర్శకత్వంలో త్రిష మిస్ చేసుకున్న సినిమా మరేదో కాదు మర్యాద రామన్న. స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో హీరోగా చేశాడు. అతనికి జోడిగా కొత్త భామ సలోని నటించినది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 2010లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రూ. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన మర్యాద రామన్న ఫుల్ రన్ లో రూ. 28 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకుందామని అనుకున్నారట

ఆమెతో సంప్రదింపులు జరిపారగా... సునీల్ వంటి కమెడియన్ పక్కన తాను నటించిన‌ని త్రిష డైరెక్ట్‌గానే చెప్పేసింద‌ట‌. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే అవకాశాన్ని సునీల్ కార‌ణంగా వదులుకుందట. ఇక‌ ఆ తర్వాత మ‌రికొంతమంది హీరోయిన్లను పరిశీలించిన రాజమౌళి.. ఫైనల్ గా సలోనిని సెలెక్ట్ చేశార‌ట‌. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం.అప్పటికే తెలుగు మరియు తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఆ కారణంగానే రాజమౌళి సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలుస్తోంది. త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 21:02

కోహ్లి చేసిన ఆ తప్పుతోనే వరల్డ్ కప్ కోల్పోయాం: రోహిత్

2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌లోనే నిష్క్రమించడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి పేలవమైన వ్యూహాలే తమ జట్టు ఓటమికి పరోక్ష కారణమని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ తాజాగా చేయలేదు. గతంలో చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఓటమికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో సరైనోడే లేకపోవడమే అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు అని ఈ మెగాటోర్నీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చింది. కానీ అనూహ్యంగా రాయుడును ఆ ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు.

అయితే నాలుగో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని రోహిత్ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ''నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ జట్టుకు ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంది. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బాగుండేది అని నా అభిప్రాయం'' అని రోహిత్ పేర్కొన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. దీనిలో అయిదు శతకాలు కూడా ఉన్నాయి. కాగా, ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌‌కు చేరింది. ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది.