Mane Praveen

Aug 06 2024, 23:24

NLG: 26 వార్డులో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం
నల్లగొండ పట్టణంలోని 26వ వార్డులో మంగళవారం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ నాగుల జ్యోతి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ని వేరు చేయాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో  26 వ వార్డు కౌన్సిలర్  బషీర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా రోడ్ల పైన మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్పి రాధ, పొదుపు సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2024, 08:06

సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, తిరుగండ్ల పల్లి గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. సబ్ స్టేషన్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

Mane Praveen

Aug 06 2024, 22:30

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మర్రిగూడెం మండలంలో పర్యటించారు. 

పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

శివన్నగూడెం గ్రామంలో శివన్నగూడ- నామపురం బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన అంగన్వాడీ కేంద్రం, నూతన రేషన్ షాపు లను ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా శివన్నగూడ- అంతంపేట రోడ్డులో కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మండలంలో మొత్తం 73 మంది లబ్ధిదారులకు, రూ. 21,25,000/- ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 06 2024, 16:36

రాజపేట తండాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రాజపేట తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మండల నాయకులు కొడాలి అల్వాల్ రెడ్డి లు పంపిణీ చేశారు. జింకల విగ్నేష్ కు రూ.15000/-, మునగపాటి లక్ష్మయ్య రూ. 27000/-, జి.అరుణ కు రూ. 60,000/- ల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాజపేట తండ మాజీ సర్పంచ్ నూన్సావత్ బిచ్చు నాయక్,యూత్ లీడర్ మారగోని సుధీర్,కాంగ్రెస్ పార్టీ నాయకుడు జింకల కొండల్ ముదిరాజ్, జింకల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 06 2024, 09:06

'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి' జాతీయ వార్షికోత్సవాలు  పోస్టర్ విడుదల
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ' పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ఈ నెల 11న ఉదయం 10. గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరగనున్నాయని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలలో మర్రిగూడ మండల బహుజన, గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు బొమ్మగాని శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కాట్కూరి వెంకటరమణ, అధికార ప్రతినిధి వల్లపు కేశవ గౌడ్, గీత పని వారాల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, మర్రిగూడ గీత కార్మిక సంఘం అధ్యక్షులు గునిగంటి శ్రీరాములు గౌడ్, మర్రిగూడ గౌడ సంఘం నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్, ఉడుగు అంజయ్య గౌడ్, వెంకటంపేట బాలయ్య, విరమళ్ళ ముత్యాలు గౌడ్, నాగిళ్ళ మారయ్య, పగడాల యాదయ్య, ఎం.డి.నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2024, 20:59

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ:మండలం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ పంపిణి చేశారు.                                  కొండూరు లో సేతా సత్తార్ రూ.48,000/-, దుబా యాదయ్యగిరి రూ.40,500/- మర్రిగూడ గ్రామానికి చెందిన చాట పద్మ భర్త అంజయ్య కు 30000 రూపాయలు చెక్కు, ఆంబోతు బిచ్చ నాయక్ 60000/- పగడాల చిన్న అంజయ్య కు రూ. 60000 /-, చిలువేరు శివ తండ్రి రాములు కు రూ. 28000 /- చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాయికాడికొండల్, జల వెంకయ్య, జంగయ్య,అశోక్ రెడ్డి , తన్నరు యాదయ్య,ఉడుగు ఆంజనేయులు, దండుగుల కృష్ణ, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, మర్రిగూడ మాజీ ఎంపిటిసి వెంకటం పేట బాలయ్య, పంతంగి సుధాకర్, గ్యార యాదయ్య, పొనుగోటి శేఖర్, సిల్వర్ చంద్ర, ఎండి షాప్, గొట్టిముక్కల ప్రకాష్, పగడాల రఘు, పగడాల లింగయ్య, ఎండి అశ్వకు, ఈద రాములు, పల్ల మల్లేష్ పగడాల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2024, 18:36

రేపు మర్రిగూడ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

NLG: ఆగష్టు 6న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మర్రిగూడ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గం.3:20 లకు శివన్నగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభిస్తారు. 4 గంటలకు శివన్నగూడ - అంతంపేట రోడ్డు లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.5 గంటలకు తిరుగండ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ - స్టేషన్ ను ప్రారంభిస్తారని,మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ తెలిపారు.

Mane Praveen

Aug 05 2024, 17:30

NLG: రేపు మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
రేపు ఆగస్టు 6న  తెలంగాణ ఉద్యమ ప్రముఖ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా, నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆచార్య జయశంకర్ జయంతిని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని కోరారు.

Mane Praveen

Aug 05 2024, 16:10

శివన్నగూడెం: సిపిఎం ప్రచార రథాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలం, శివన్నగూడెంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, ఇవాళ సిపిఎం ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎనుకబడిన మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు,త్రాగునీరు  ఇవ్వడంలో పాలక పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని..డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయుటకు తగిన నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల నాయకులు బోట్ట శివకుమార్, మైల సత్తయ్య, రాములు శంకర్ అలివేలు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 05 2024, 09:20

నల్లగొండలో ఆగస్టు 9న జరిగే సదస్సును జయప్రదం చేయండి: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపు
*మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ*
నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంలో పాలక పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ప్రాజెక్టుల డిపిఆర్ ను ఆమోదించి నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని కోరుతూ.. ఆగస్టు 9న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు వేలాదిగా జనం తరలి వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. అత్యధిక ఫ్లోరిన్ ఈ ప్రాంతంలోనే ఉన్నదని దీనివల్ల ప్రజల తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతున్నారని అన్నారు. సాగునీరు లేకపోవడం వలన భూములు బీడులుగా మారాయని తెలిపారు. కూలీలు, ప్రజలు  గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు.కేసీఆర్ హయాంలో గత పది సంవత్సరాల అధికారంలో కొనసాగినా ఫ్లోరిన్ బాధితుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, సాగునీరు అందించడానికి అవసరమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ ఆమోదించకపోవడం చాలా అన్యాయం అన్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవోఎంఎస్ నెంబర్ 105 ద్వారా డీపీఆర్ ను ఆమోదించారని కానీ 107 జీవో ద్వారా డిండి ఎతిపోతుల పథకం డీపీఆర్ ను ఆమోదించలేదని తెలిపారు.  మునుగోడు, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ డిండి ప్రాజెక్టు విషయంలో దృష్టి సారించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే డిపిఆర్ ను ఆమోదించి తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  ప్రాజెక్టు పూర్తి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయడం జరిగిందని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల పూర్తి కి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 9న శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు  నాగార్జున, బండ శ్రీశైలం, మర్రిగూడ మండల కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం నాయకులు బొట్టు శివకుమార్, మైల సత్తయ్య, కొమ్ము లక్ష్మయ్య, నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, దామెర లక్ష్మి, మల్లేటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.