vemulajanardhanreddy54

Jul 12 2024, 18:29

*విజయవంతంగా సాగిన రెండవరోజు నేను నా మిర్యాలగూడ , పట్టణ పారిశుధ్య కార్యక్రమం*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన *పట్టణ పారిశుధ్య* స్వచ్ఛంద కార్యక్రమం విజయవంతం రెండవ రోజు *33, 02, 05,19,46,07,09,13,43,27,25,23 వార్డులలో* పూర్తిచేసుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇంచార్జ్ లు మరియు పట్టణ పారిశుధ్య కార్మికులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.






vemulajanardhanreddy54

Jul 09 2024, 10:19

*మిర్యాలగూడలో గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ను* *MEO గారితో* కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* .
హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు... ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు .ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.
హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలి అని హెచ్చరించారు.


అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు.. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు...

vemulajanardhanreddy54

Jul 06 2024, 10:11

*మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి.. పారిశుధ్య కార్మికులతో MLA - BLR *
ఈరోజు ఉదయం 5 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని *పారిశుధ్య కార్మికులతో* సమావేశం అయిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి అంటే మీ పారిశుధ్య కార్మికులే ప్రాధాన్య పాత్ర పోషించాలి ...ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన సెంటర్స్ ఐన *బస్టాండ్, రైతు మార్కెట్, మున్సిపల్ కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, డాక్టర్స్ కాలనీ* వంటి ఏరియాలలో ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు కావున ఈ ఏరియాలలో చెత్త అనేది ఎవ్వరికీ కనిపించకుండా పరిశుభ్రంగా ఉండాలి.







ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త వలన దోమలు అధికమై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది కావున.. ప్రతిఒక్క కార్మికుడు ఒక బాధ్యత గా పనిచేయండి మీకు ప్రతీ విషయంలో నేను తోడుగా ఉంటాను, మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కారం చేస్తాను.... రాబోయే ఆగస్టు 15 తేది మన 78వ స్వాతంత్ర దినోత్సవం వరకు మిర్యాలగూడ పట్టణంలో చెత్త అనేది లేకుండా చేయాలి అని అన్నారు..

vemulajanardhanreddy54

Jul 03 2024, 18:03

*తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ*
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

vemulajanardhanreddy54

Jun 29 2024, 18:48

*సీనియర్ జర్నలిస్ట్ ఎలక సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులు*
తెలంగాణ కాంగ్రేస్ సేవదళ్ సూర్యపేట్ జిల్లా మహిళా అద్యక్షురాలు కేతిరెడ్డి శకుంతాల రెడ్డి

vemulajanardhanreddy54

Jun 28 2024, 15:53

*మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి జూన్- 28- 1921 **103 వ జయంతి వేడుకలు :
ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు మాట్లాడుతూ భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటు పడుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి నరసింహ రావు గారు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం పీ. వి నరసింహారావు గారి ఘనకార్యం.








ఈ మహానుభావుడిని స్మరించుకుంటూ ఈరోజు ఉదయం అనగా 28 జూన్ 2024 నాడు ఉదయం 9 గంటల 30 నిమిషములకు నక్లెక్స్ రోడ్డు నందు పివి నరసింహారావు ఘాట్ నందు ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో పుష్పాంజలి ఘటిస్తూ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఎం సద్గుణ రావు, మధు, సి హెచ్ మురళీధర్, అష్రఫ్ అలీ, ప్రకాష్, మనోజ్ సింగ్, తెలంగాణ ప్రదేష్ కాంగ్రేస్ సేవదళ్ సూర్యపేట్ జిల్లా మహిళా అద్యక్షురాలు కేతిరెడ్డి శకుంతల రెడ్డి పాల్గొని పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

vemulajanardhanreddy54

Jun 26 2024, 12:21

*మిర్యాలగూడలో త్వరలో నాలుగు ఫ్లైఓవర్స్ నిర్మాణం..MLA -BLR*
మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*...


గత కొన్ని నెలలుగా ఎంతో కృషి చేస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు.. ఈ విషయమై *R&B మినిస్టర్ గౌ,, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని* కలిసి తెలియజేయడంతో వారు సానుకూలంగా స్పందించి , మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రమాదాలు జరుగు నాలుగు ప్రమాదకరమైన జంక్షన్స్ గుర్తించి.
ఈరోజు *R&B ENC గారితో, NHAI అధికారులు, RDO గారు, DSP గారు, MRO గారు, మున్సిపల్ కమిషనర్ గారు* మరియు ఇతర ఉన్నత ఆధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణం చేసే ప్రదేశాలు పరిశీలించడం జరిగింది.. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేములపల్లి క్యాంప్ నందు ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని గుర్తించి అక్కడ అండర్ గ్రౌండ్ పాసేజ్ నిర్మాణం చేయాలని నిర్ణయించాము.







అలాగే మిర్యాలగూడ పట్టణంలోని ప్రవేశించే ప్రధాన రహదారి అయిన Y జంక్షన్ వద్ద మరియు నదిపాడు బైపాస్, చింతపల్లి బైపాస్, మరియు ఇదులగూడ బైపాస్ ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది.. మేము కోరిన వెంటనే స్పందించిన R&B మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే అతిత్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.... అలాగే హైవే పరిధిలో ఉన్న ప్రతీ చోట సర్వీస్ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలు కూడా చేస్తున్నట్టుగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు...

vemulajanardhanreddy54

Jun 22 2024, 14:51

*రైతు రుణమాఫీ ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం.*
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా చిత్రపటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 31 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం అర్శించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా మాట తప్పకుండా అమలు చేస్తా ఉంది రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వానికి రైతు శ్రేయస్సు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు.









ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సలీం ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ ,మండల పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఆవుల బక్క రెడ్డి , పోలగానే వెంకటేష్ గౌడ్, జేట్టి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ , ఐఎన్టీయూసీ అధ్యక్షులు చాంద్ పాషా, పోలిశెట్టి అజయ్ , పానుగోతు మల్సూర్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు*

vemulajanardhanreddy54

Jun 22 2024, 14:47

*ప్రవైట్ విద్యా సంస్థ లా పై అక్రమ వసులకు పాల్పడితే ఉపాక్షించ్చేది లేదు - జిల్లా NSUI అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్*:
ఈ రోజు మిర్యాలగూడలోని స్థానిక రాజీవ్ భవన్ నందు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో జిల్లా NSUI అధ్యక్షులు మొహమ్మద్. ఆరిఫ్ గారు మాట్లాడుతు కొంత మంది విద్యార్థి నాయకులు తమ స్వార్ధ రాజకీయాలకు స్వంత అవసరాలకు NSUI పేరు చెప్పి ప్రవైట్ పాఠశాల లు, కాలేజిలు పై బెదిరింపులు చేస్తూ అక్రమ వసూళకు పాల్పడుతున్నారని. అలాటి వారిపై కఠిన చేరియాలు ఉంటాయని. పార్టీ పేరు,ప్రతిష్ట కు ఎవరు భంగం కల్గించిన చూస్తూ ఉపక్షించేది లేదు అని, ప్రవైట్ యాజమాన్యం అలాంటి వారిపై అప్రమత్తం గా ఉండాలి అని, ఏదైనా ఉంటే తన దృష్టి కి తీసుకొ రావాలి అని అన్నారు. Cell :9000888245 నెంబర్ కు సంప్రంధించాలని కోరారు .
నల్లగొండ జిల్లా వాప్తంగా ఉన్న NSUI కార్యవర్గ సభ్యులకు అన్ని నిజయోజకవర్గల అధ్యక్షులకు సమాచారం ఇస్తూ హెచ్చరిక జారీ చేశారు*. *ఈ కార్యక్రమం లో NSUI నాయకులు రోమన్ కుమార్, విజయ్ రామ రాజు, గంగనా, చందు, శ్రీను, అరవింద్. తదితరులు పాల్గొన్నారు.*

vemulajanardhanreddy54

Jun 20 2024, 14:03

ఎంపీ *గౌ, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో వారి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన కేక్కార్యక్రమంలోపాల్గొన్నారు:
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీ *గౌ, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో వారి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు *గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి,* మరియు ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు *గౌ,, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి* మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు *గౌ,, శ్రీ పొదిల శ్రీనివాస్ గార్ల* జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మరియు డిసిసి అధ్యక్షులు *గౌ,, శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు* . కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అనంతరం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.