VijayaKumar

Jun 14 2024, 19:53

వెలువర్తి లో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా
మార్కెటింగ్ మేనేజర్ రాజ్ కుమార్ సేంద్రీయ రసాయనిక ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్, మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య ,మన గ్రోమోర్ వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ రాజు, అనిల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య, రైతులు అంజయ్య, సాలయ్య, పాపయ్య ,బాలకృష్ణ ,ఉపేందర్, సురేష్ ,రాములు ,కిరణ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.




VijayaKumar

Jun 14 2024, 19:26

సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: AISF,AIYF ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 96వ జయంతి

చేగువేరా 96వ జయంతి ని  ఏఐఎస్ఎఫ్ , వై ఎఫ్ యాదాద్రి జిల్లా సమితి ఆధ్వర్యంలో  సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా *AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ* క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన  చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో  క్యూబా  వైద్యులు పర్యటించి కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలను అందించిన మానవతావాదులుగా నిలిచారని, దీనికి కారణం చేగువేరా దార్శనికత అని, క్యూబాలో 80శాతానికి పైగా ప్రజానీకం వైద్యులేనని వారు తెలిపారు.విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి  అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఏషాల అశోక్* లు మాట్లాడుతూ క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.
ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కాశపాక దయాకర్, కొమ్ము బాల నరసింహ,  ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 17:56

ఎల్ ఓ సి చెక్ అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెం కి చెందిన సింగిరెడ్డి బుచ్చిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎల్ఓసి కి అప్లై చేయడం జరిగింది. దీనితో తన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల చెక్కును భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రోజున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంచి రాములు, కొంతం వెంకట్ రెడ్డి, కొంతం తిరుమల్ రెడ్డి, కొంతం నర్సిరెడ్డి, చిలుగూరు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 17:22

గురుకులాలలో మౌలిక వసతులు కల్పించాలి: AISF

గురుకులాలలో మౌలిక వసతులు కల్పించాలి ఏఐఎస్ఎఫ్* ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో గురుకులాలలో మౌనిక వసతులు కల్పించాలని , గురుకుల పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలని నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు గత సంవత్సరంలో జరిగిన అవకతవకలు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యాదాద్రి రివిజనల్ కోఆర్డినేటర్ రజిని గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ విద్యార్థి మరణం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్ రజని గారు నిత్యం గురుకులాల పర్యవేక్షణ చేయాలని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మేడ్చల్ జిల్లా జనగాం జిల్లాల లోని అన్ని బాలుర, బాలికల పాఠశాలలు కళాశాలలు సందర్శించాలని వారిని కోరారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని రీజనల్ కోఆర్డినేటర్ గారు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు సందీప్ విద్యార్థుల తల్లిదండ్రులు బాల నరసింహ దయాకర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 16:50

త్రిబుల్ ఆర్ బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలి : సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు . దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు..

VijayaKumar

Jun 14 2024, 16:39

జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కల్పించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన టీజేయు అధ్యక్షులు ఎండి షానూర్ బాబా

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే కలిసి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ కల్పించాలని వినతి పత్రం అందజేశారు* దానికి వారు సానుకూలంగా స్పందించి రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్, జర్నలిస్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 14:44

ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో మున్సిపాలిటీ లు అభివృద్ధికి నోచుకోలేదు పేరుకే మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు కనీసం మున్సిపాలిటీ లకు సొంత భవనాలు కూడా నిర్మించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అర్బన్ డెవలప్మెంట్ నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి మా ప్రభుత్వం ముందు చూపుతో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, కౌన్సిలర్ లు కో ఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 13:18

కొండమడుగు లో బడిబాట కార్యక్రమం లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం లోని మండల ప్రాథమిక పాఠశాల లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు స్థానిక ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.... ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ బడి బాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ఒక లక్ష్యం తో ముందుకు వెళుతుంది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. బీబీనగర్ ఏమ్స్ లో సమస్యల గురించి స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎయిమ్స్ కి వస్తా రివ్యూ నిర్వహిస్త . ప్రభుత్వం అందిస్తున్న విద్యలో నాణ్యత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలి. ప్రైవేటు టీచర్స్ మాదిరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి . ఉచిత విద్య, ఉచిత యూనిఫారంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, అర్హులైన ఉపాధ్యాయులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, స్కాలర్ షిప్స్ ,రవాణా చార్జీలు, బాసర ఐఐఐటి లో ఉచిత ప్రవేశాలు మొదలైన సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తో పనిచేయాలని కోరారు . పాఠశాల మరియు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడానికి పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అనే పట్టుదల తో ఉన్నాం . స్థానిక సమస్యల గురించి సిఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాను. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తొలి సారి కొండమడుగు బడి బాట రావడం చాల అదృష్టంగా భావిస్తున్నాను. సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సునీత , స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,బీబీనగర్ ఎంపిపి సుధాకర్ ,ZPTC గోలి ప్రణిత పింగల్ రెడ్డి , PACS చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి , DRDO కృష్ణన్,స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 13 2024, 19:59

రైతు సహకార సంఘం ఉప ఎన్నికల్లో ఆత్మకూరు మండలానికి వైస్ చైర్మన్ పదవి

ఆత్మకూరు ఎం: మోత్కూరు రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి పై అవిశ్వాసం నెగ్గడం అనంతరం డిసిఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోత్కూరు రైతు సహకార సంఘం ఉప ఎన్నికలో మోత్కూరు రైతు సహకార సంఘం  పరిధి ఆత్మకూరు ఎం మండలం కప్రాయిపల్లి డైరెకర్ బండ పద్మ ఐలయ్య గారు వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి,  స్థానిక పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి,రహింఖాన్ పేట డైరెక్టర్ తాల్లపల్లి స్వామి(మోత్కూరు పాక్స్),
  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, మండల  నాయకులు తండ శ్రీశైలం గౌడ్, కట్టెకొల హన్మంతు గౌడ్, భాషబోయిన పాపయ్య, జన్నాయికోడె నగేష్, సామ శ్రీనివాస్ రెడ్డి, కందడి దశరథ రెడ్డి , పోతగాని మల్లేశం, వెంకట్ రెడ్డి, భూపతి ఆనంద్, బండ కృష్ణ, కొంగరి రాజు, బొట్ల అనిల్, కొంగరి యాదయ్య, కొంగరి పరుష రాములు, కొంగరి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 13 2024, 16:19

భీమా తో కార్యకర్తల కుటుంబాలకి భరోసా: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు అన్నారు. ఇటీవల ప్రమాదాల బారిన పడి మరణించిన నకిరేకల్ మున్సిపాలిటీ 1వ వార్డ్ కీ చెందిన బొడ్డు సైదులు గారు మరణించగా వారి సతీమణి బొడ్డు మంగమ్మ గారికి *రూ.2లక్షల బీమ చెక్కును* *మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు* చేతుల మీదుగా కార్యకర్తల కుటుంబీకులకు పంపిణి చేశారు కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.