Mane Praveen

May 31 2024, 16:21

మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
సిక్కిం, కేరళ రాష్ట్రాల మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి మృతి పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షితో కలిసి శంషాబాద్ శివారులోని మామిడిపల్లి గ్రామంలో లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం వారి కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్, కోడలు అలేఖ్యలను ఓదార్చి సానుభూతి తెలిపారు.

Mane Praveen

May 31 2024, 15:45

NLG: ఫుట్బాల్ D లైసెన్స్ కోచ్ లైసెన్స్ కోర్సు ను పూర్తి చేసిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించిన బొమ్మపాల గిరిబాబు
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (TFA) ఆధ్వర్యంలో ఈనెల 24 నుండి 30 వ తేదీ వరకు , యాదాద్రిభువనగిరి జిల్లాలో గల న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో, D లైసెన్స్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు ను ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మద్ది కర్ణాకర్, బాణావత్ మౌనిక, చిట్టిమల్ల సంధ్య ముగ్గురు క్రీడాకారులు దిగ్విజయంగా పూర్తి చేసి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నుండి కోచ్ సర్టిఫికెట్ పొందారు. ఈ  సందర్భంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ముగ్గురిని ప్రత్యేకంగా అభినందించారు. ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పాఠశాల దశ నుండి ఫుట్బాల్ క్రీడాకారులను తయారుచేసి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి అందించాలని సూచించారు.

Mane Praveen

May 31 2024, 08:31

NLG: గాయాల పాలైన 108 అంబులెన్స్ డ్రైవర్ ని ఆదుకోవాలి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
నల్గొండ జిల్లా, పీఏ పల్లి మండలం, నీలింనగర్ కోదాడ జడ్చర్ల రహదారి వెంట నీలింనగర్ సమీపంలో ఇటీవల, కోమండ్ల శేఖర్ వీధి నిర్వహణలో భాగంగా 108 అంబులెన్స్ లో ప్రయాణిస్తూ అంబులెన్స్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాలు దగ్ధమై శేఖర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,  దళిత రత్న బుర్రి వెంకన్న స్పందిస్తూ..  ప్రభుత్వం ద్వారా శేఖర్ కు మెరుగైన వైద్యాన్ని అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్థికపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఆపదలో 24 గంటలు ప్రజల ప్రాణాలను కాపాడే 108 వాహనాలు, వారి సేవలు మరువ లేనివని అలాంటివారికి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలని వారిని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

May 30 2024, 12:15

NLG: సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం
కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేసి దోపిడీ రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా 1970లో సిఐటియు ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ పట్టణంలోని హమాలీ యూనియన్ కార్యాలయం దగ్గర సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి మాట్లాడారు.

Mane Praveen

May 30 2024, 12:02

NLG: నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గిన నీటి నిల్వలు
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం 590. 00 అడుగులకు గాను 504. 70 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలకు గాను ప్రస్తుతం 122.8483 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో లేదు.

Mane Praveen

May 30 2024, 11:51

కర్రోడా అన్నందుకు విడాకులు..!
భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

Mane Praveen

May 30 2024, 10:18

చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. అక్కడి ఎన్నికలు బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్ర వివాదాల నేపథ్యంలో హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 42 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా 33 చోట్ల పోలింగ్ పూర్తయింది. మిగిలిన 9 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 124 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Mane Praveen

May 29 2024, 20:18

హైదరాబాద్‌ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో సంచలన నిజాలు..
ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ సీక్రెట్‌ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను,  ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చెల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని చేదించారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు కొంతమంది కేటుగాళ్లు. పీర్జాదిగూడలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్‌ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు

Mane Praveen

May 29 2024, 20:00

NLG: అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ మూడో వార్డు పరిధిలోని శేషమ్మ గూడెం, లెప్రసీ కాలనీ లో గాలి వాన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి పగిడి మహేష్, వార్డు ఇంచార్జ్ ప్రభంజన్, తదితరులు  ఉన్నారు.

Mane Praveen

May 29 2024, 18:02

NLG: మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల సిఐటియు ఆధ్వర్యంలో, బుధవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుండి గ్రామపంచాయతీలలో వెట్టి చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గ్రామాలకు స్పెషల్ అధికారులు వచ్చిన నాటి నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మనెంట్ చేయాలని పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు తక్షణమే రెండు జతల బట్టలు, చెప్పులు, సబ్బులు, టవల్స్ టార్చ్ లైట్, చేతి గ్లౌజ్, బూట్ల, ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పోలేపల్లి రాములు,నక్క నరసింహ,ఒంపు ముత్తమ్మ, పెరుమాండ్ల మంజుల, అయితపాక పద్మ, గ్యార దుర్గమ్మ, యాచారం జంగమ్మ, మర్రి ఇందిరమ్మ, హేమలత, నర్సమ్మ, ఏపూరి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.