నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 10:24

హైదరాబాద్ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు...

11 టోల్‌ ప్లాజాలు.. ఇంటర్‌చేంజ్‌లు

107 మేజర్‌, మైనర్‌ బ్రిడ్జిలు.. 4 ఆర్వోబీలు

187 అండర్‌ పాస్‌లు.. 6 రెస్ట్‌ ఏరియాలు

ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం స్వరూపం

బ్రిడ్జిలు, కెనాల్‌ క్రాసింగ్స్‌, రైల్వే అంశాలపై జీఏడీకి వివరాలు సమర్పించిన ఎన్‌హెచ్‌ఏఐ

హైదరాబాద్‌, మే 26: రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. మేర నిర్మాణం కానున్న ఉత్తరభాగం రహదారిలో టోల్‌ ప్లాజాలు మొదలుకుని, ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే అన్ని అంశాలను ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ప్రాథమికంగా ఖరారు చేసింది. 

ప్రస్తుతం ప్రాథమిక అంచనాలలో ఉన్న రోడ్డు మ్యాప్‌ అతి త్వరలోనే ఖరారు కానున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించకపోవడం వల్ల ఏళ్ల తరబడి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించామని, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ను కూడా తామే పూర్తిచేస్తామంటూ సీఎం రేవంత్‌, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. అత్యంత వేగంగా దీని పనులను మొదలుపెట్టేందుకు అవసరమైన మేర సహకరిస్తున్నారు. ఉత్తర భాగం రోడ్డు మ్యాప్‌కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుతో పాటు ఏయే ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలు రానున్నాయనే అంశాలను తెలుసుకున్నారు.

ఇదీ సమగ్ర స్వరూపం..

ఉత్తర భాగం రోడ్డు విస్తీర్ణం 161కి.మీ. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మైనర్‌, మేజర్‌, బాక్స్‌ కల్వర్టులను కూడా నిర్మించాల్సి ఉంది. దీంతో అసలు ఈ ఉత్తర భాగం రోడ్డు మొత్తంలో ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు వస్తున్నాయనే వివరాలకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా ఒక రిపోర్టును సిద్ధం చేసింది. ఈ మేరకు మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు రానుండగా, 6 చోట్ల రెస్ట్‌ ఏరియాలు ఏర్పాటుకానున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా వెహికల్‌ అండర్‌ పాస్‌లు అన్నీ కలిపి దాదాపు 187 వరకు నిర్మాణం చేయాల్సి వస్తోందని అధికారులు గుర్తించారు. నాలుగు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాల్సి వస్తోంది. 

ఇవికాక మేజర్‌ బ్రిడ్జిలు 27, మైనర్‌ బ్రిడ్జిలు 80, బాక్స్‌ కల్వర్టులు 404 మేర నిర్మించాల్సి ఉంది. కాగా, ఈ నిర్మాణాలకు రోడ్డుతో సంబంధం లేకుండా టెండర్లకు వెళ్లాలా..? లేదంటే రోడ్డుతో పాటే కలిపి టెండర్లను ఆహ్వానించాలా..? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ మార్గంలో ఉన్న రైల్వే లైన్లు, కాల్వలు, చెట్లు, సహా పలు అంశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు అందించగా, వీటిలో కొన్నింటి నిర్వహణకు ఇరిగేషన్‌, రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆయా అనుమతులను త్వరలోనే పొంది, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 08:55

Ts: ఐటిఐ నూతన కోర్సులు చేసే వారికి గ్యారెంటీ ఉపాధి..

 ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి కోర్సులు 

పారిశ్రామికీకరణే లక్ష్యంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు

టాటా టెక్నాలజీస్‌ భాగస్వామిగా..

ఉమ్మడి జిల్లాలో ఆరింటిలో..

ఈ విద్యాసంవత్సరంనుంచే 6నూతన కోర్సులు

1440 సీట్లు అందుబాటులోకి

భువనగిరి టౌన్‌, 24 మే: పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పారిశ్రామి క శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉపాది ఆధారిత పారిశ్రామిక శిక్షణ కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు పేరిట టాటా టెక్నాలజీ్‌సతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల ప్రారంభానికి అవసరమైన భవనాల నిర్మాణం, ఆధునిక శిక్షణ సామగ్రికి, శిక్షణకు రూ.2వేల కోట్లను టాటా టెక్నాలజీస్‌ వెచ్చించనుంది. ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే ఒప్పంద లక్ష్యంగా ఉంది. ఈ మేర కు ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల మౌలిక వసతుల కల్పనకు ఈ పాటికే మూడు దఫాల సర్వేలు పూర్తికాగా ఎన్నికల కోడ్‌ ముగిసిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో నూతన కోర్సుల్లో చేరే విద్యార్థులకు గ్యారంటీగా ఉపాధి ఉద్యోగాలు లభించనున్నాయి.

మారనున్న ప్రభుత్వ ఐటీఐల దశ

ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో ప్రభుత్వ ఐటీఐల దశ మారడంతోపాటు నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశా లు మెరుగు కానున్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులు యథావిధిగా ఉండనుండగా నూతనంగా ఆరు కోర్సులు అం దుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితర సంప్రదాయ కోర్సులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి పారిశ్రామిక రంగ పరిస్థితులకు దశాబ్దాల క్రితం రూ పొందించిన అప్పటి కోర్సులు నేటి ఆధునిక పారిశ్రామిక రంగానికి అ నుగుణంగా స్కిల్‌ వర్కర్స్‌ లభించకపోతుండటంతో పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుండటంతోపాటు యువతకు ఉద్యోగ ఉపా ధి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులను ఆధునికీకరించే లక్ష్యంలో భాగంగా ప్రస్తుత పారిశ్రామికీకరణకు అనుగుణంగా రూపొందించిన ఆరు నూతన కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్ర భుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుత కోర్సులకు ఈ పాటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నూతన కోర్సులకు త్వరలో అడ్మీషన్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. విద్యా అర్హతలు, ఉపకారవేతనాలు తదితర నిబంధనలు యథావిధిగా ఉండనున్నాయి.

ఆరు నూతన కోర్సులు.. ప్రతి కోర్సులో 40 సీట్లు

ఒకటి, రెండు సంవత్సరాల నిడివితో ఆరు నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ కోర్సులో 40 సీట్లు ఉంటాయి. నూతన కోర్సులకు అనుగుణంగా ప్రతీ ఐటీఐకి నూతన ఇన్‌స్ట్రక్టర్స్‌ను నియమించనుండగా ప్రస్తుత ఇన్‌స్ట్రక్టర్స్‌ అందరికీ టాటా టెక్నాలజీస్‌ శిక్షణ ఇవ్వనుంది. నూతన కోర్సులు ఇలా......

రెండు సంవత్సరాల కోర్సులు

1) బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌(మెకానికల్‌)

2) అడ్వాన్స్‌డ్‌ ిసీఎన్‌సీ మిషినింగ్‌ టెక్నీషియన్‌

3) మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

ఏడాది కోర్సులు

4) మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌

5) ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌

6) ఆర్టీసన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌

ఉమ్మడి జిల్లాలో ఇలా....

ఉమ్మడి జిల్లాలో ఆరు ప్రభుత్వ, 23ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 11, 361 మంది విద్యార్థులు పలు కోర్సులు చేస్తున్నారు. అయితే యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ ఐటీఐలు ఉండగా సూర్యాపేట జిల్లా విద్యార్థులకు మాత్రం ప్రైవేటు ఐటీఐలే అందుబాటులో ఉన్నాయి. దీంతో యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో మాత్రమే నూతన ఆరు కోర్సులు, 1440సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

జిల్లా ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు

నల్లగొండ 4 10 5,748

యాదాద్రి 2 8 4,563

సూర్యాపేట - 5 1,050

మొత్తం 6 23 11,361

నూతన కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు : హరికృష్ణ, కన్వీనర్‌ యాదాద్రిభువనగిరి జిల్లా ఐటీఐలు

నూతన కోర్సులు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ను కల్పిస్తాయి. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా టాటా ఇండస్ట్రీస్‌ భాగస్వామిగా రూపొందించిన ఆరు కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి లక్ష్యంగా తీర్చిదిద్దిన నూత న కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నూతన కోర్సులకోసం ఐటీఐల్లో ప్రతిపాదించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 08:41

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

Gutka Ban | హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన గుట్కాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

గుట్కా, పాన్ మాసాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 26 2024, 07:56

భద్రాచలం పారామెడికల్ విద్యార్థి మరణం పై న్యాయవిచారణ జరిపించాలి: PYL డిమాండ్

పత్రిక

భద్రాచలం పారామెడికల్ మారుతీ కాలేజీలో అనుమాన స్థితిలో మరణించిన పగిడిపల్లి కారుణ్య విద్యార్థి మరణం పై న్యాయ విచారణ జరిపించాలి.ఇండియన్ నర్శింగ్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలి.పి వై ఎల్ డిమాండ్

కోడిజర్ల మండలం ఓ గ్రామం నుండి భద్రాచలం వచ్చి డాక్టర్ కాంతారావు నడుపుతున్న మారుతీ పారామెడికల్ కాలేజీలో BSC నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య ఎలా చనిపోయిందో,కలెక్టర్, SP, పోలీస్ వారు విచారణ జరపాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL )జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం cc, పుటజ్ నీ డిలీట్ చేయడం అనుమానస్పదంగా మారిందని అయన ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 8,గంటలకు భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ లో చనిపోయినట్టు నిర్దారించారు.శుక్రవారం మధ్యాహ్నం 3,గంటలకు 25, లక్షలకు కాలేజీ యాజమాన్యం సెటిల్ మెంట్ చేశారు దీనిపైన హైకోర్టు విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ శరత్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

పారామెడికల్ మారుతి కాలేజ్ కి దాని యాజమాన్యానికి ఎటువంటి సంబంధాలు లేదని వాళ్ల తల్లిదండ్రులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ గారు,SP గారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించాలని ఒక డిమాండ్ అయితే మా డిమాండ్ విద్యార్థిని మరణించిన స్థలంలోకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మిత్రబృందాన్ని కానీ తన ఉన్న రూముని కానీ తను క్రింద పడిన స్థలాన్ని కానీ జరుగుతున్న అన్నింటిని గమనించి సరైన మార్గంలో ఎంక్వారి చెయ్యాలని నిజనిర్ధారణ ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వారు అన్నారు.ఇటువంటి సంఘటనలు ఇకముందు పునరుద్దరణ జరకుండ ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తప్పు ఎవరిదైనా ఎంత వారిదైనా చట్టం న్యాయం ముందు అందరు సమానమే అని గుర్తించి కఠినంగా శిక్షంచాలని నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మారుతీ నర్సింగ్ కాలేజీపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కు కంప్లెన్ట్ లెటర్ సిపారస్ చెయ్యాలని ముసలి సతీష్ డిమాండ్ చేశారు.

అమ్మాయి తల్లిదండ్రులు కొట్టుకొని విడిపోయారు మేనమామ ఆ అనాధను కస్టపడి చదివించారు అమ్మ నాన్న లేకపోవడంతో భయంతో పెరిగింది ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ కు వెళ్లకుండా ఆత్మ అత్య అని 25లక్షలు సెటిల్ మెంట్ చేశారు అధికారులు .దీన్ని విద్యార్థి సంఘలు యువజన సంఘలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కరణ్యకు న్యాయం జరిగేదాకా ఉద్యమాలు జరుగుతాయి అని హెచ్చరించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 26 2024, 07:48

PCC చీఫ్ గా సీతక్కను ఎంపిక చేసే అవకాశం.....

PCC చీఫ్ గా సీతక్క?

TG: పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్

నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్గా

మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది.

సీతక్క

ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్ గా చేస్తే పార్టీ

నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట.

ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు

అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి

ఉంటుందని సమాచారం.

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 21:20

కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు..

కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు

అంకుసాపూర్‌లో అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతులు

రైతులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు

రెవెన్యూ భూములను అటవీ భూములుగా చెబుతున్నారని..

అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 21:11

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ 

జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు

జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ

జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌

జులై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయింపు

జులై 30 నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌

ఆగస్ట్‌ 5న తుది విడత సీట్ల కేటాయింపు

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 21:03

TS:కేబినెట్ కు మరో ఆరుగురు మంత్రులు ! ఛాన్స్ దక్కే అవకాశం ఎవరికి ఉందంటే...!

బ్రేకింగ్ న్యూస్

కేబినెట్ కు మరో ఆరుగురు మంత్రులు !

హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చాలా రోజులుగా ఆశావాహులు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన అడుగులు పడుతున్నాయి. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంచాయితీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ..నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ ద్వితీయార్ధంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎంతో సహఆ 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది.ప్రస్తత కేబినెట్ లోహైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు.

అనూహ్యంగా ఎంపిక ఛాన్స్ దక్కేదేవరికి ? 

ఛాన్స్ దక్కేదెవరికి కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ ధీమాతో ఉన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా ప్రయత్నిస్తున్నారు. కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది.

రోహిత్ కు ఛాన్స్ క్యాబినెట్ లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి హామీ దక్కినట్లు సమాచారం. యువకులకు మంత్రివర్గంలో పీట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసి వేణుగోపాల్ నుండి మైనంపల్లి రోహిత్ కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతిపిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డ్ సృష్టించనున్నారు. ఈ క్రమంలోనే వందకుపైగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 20:51

యాదద్రి భక్తులకు శుభవార్త ..!

యాదద్రి భక్తులకు శుభవార్త ..!*

యదద్రి (న్యూస్ ప్రతినిధి - నరసింహ ) ; యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు.

యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి వస్తున్నారని... ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకు వచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకు వస్తామని స్పష్టం చేశారు. అందులోభాగంగానే ఆన్‌లైన్ సేవలు తీసుకు వచ్చామని వివరించారు. ఆన్‌లైన్‌లో yadadritemple.telangana.gov.in. వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు. ఇక ఇదే వెబ్‌సైట్ నుంచి ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని భక్తులకు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకో వచ్చని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్య క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాదాద్రి ఒకటి. యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి.. భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు. మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆ క్రమంలో యాదగిరిగట్టు కాస్తా యాదాద్రిగా మారింది. తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు.

దీంతో మాఢ వీధులు, స్వామి వారి పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో యాదాద్రి.. తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకొంది. ఇంకోవైపు వీఐపీ, వీవీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్‌ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. కానీ అన్ని సేవలను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 20:42

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత !

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత !

హైదరాబాద్‌ న్యూస్ డెస్క్ : తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌(IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్‌(Antibiotics) ఇస్తున్నట్లు గుర్తించారు.

తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.