నిజందాగదుక్షణంఆగదు

May 11 2024, 22:32

ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి: సమాచార హక్కు వికాస సమితి నల్గొండ ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్

ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి

నేడు నలగొండ లో జరిగిన ఓటర్ల చైతన్య అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు వికాసమితి ముఖ్యఅతిథిగా ఎర్ర మాద కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించు కోవాలని, సమర్ధులను, సేవకులను ఎన్నుకోవాలని అన్నారు. 

సోమవారం రోజు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వెయ్యడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా ఓటరుకు నచ్చిన సమర్ధుడైన అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని, సేవకులైన వారిని పాలకులగా ఎన్నుకోవాలని , నల్గొండలో ని క్లాక్ టవర్ వద్ద జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన చైతన్య కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సూచించిన సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్.

నిజందాగదుక్షణంఆగదు

May 11 2024, 18:41

మతోన్మాద బీజేపీనీ చిత్తు చిత్తుగా ఓడించండి* *బీఆర్ఎస్ ను తిరస్కరించండి.భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్

 మతోన్మాద బీజేపీనీ చిత్తు చిత్తుగా ఓడించండి 

బీఆర్ఎస్ ను తిరస్కరించండి.భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ 

 ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించండి.

సిపిఐ (ఎం_ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండలం త్యాగడ గ్రామంలో ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించాలని, బిజెపిని ఓడించాలని, బి ఆర్ ఎస్ ను తిరస్కరించాలని గ్రూప్ మీటింగ్ నిర్వహించారు.

 ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్

 పాల్గొని మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ప్రజల సంపదను ,వనరులను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అప్పచెప్పిందని అన్నారు. దేశంలో కులం,మతం,బాషా పేరుతో మతోన్మాద విద్వేషాలను, వైశామ్యాలను బి జె పి సృష్టిస్తుందన్నారు.రాజ్యాంగాన్ని రద్దు చేసి,రిజర్వేషన్లు ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయుటకు కుట్ర జరుగుతోందని అన్నారు. నిర్బంధం, నియంతృత్వం, దేశద్రోహం కేసులతో ప్రశ్నించే వారిపై కుట్రలు కేసులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. మహిళలపై, ఆదివాసులపై, దళితులపై,ముస్లిం లపై రోజురోజుకు దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలంటే,ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించిన బిజెపిని ఓడించాలని, తగిన బుద్ధి చెప్పాలని, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో సమ్మక్క రాంబాబు రాజు పార్వతి సంధ్య కావేరి సుజాత సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 11 2024, 16:04

కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించండి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రెస్ మీట్ లో ప్రజలను కోరిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

కుందూరు రఘువీరారెడ్డి నీ గెలిపించాలని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని సూర్యాపేట ప్రజలను కోరిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

*సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ గారితో కలిసి నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..... ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు, భారత రాజ్యాంగం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.ఐదు లక్షల భారీ మెజార్టీతో కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను, ప్రజలను కోరడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కస్తాల సైదులు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం హుజూర్నగర్ నాయకులు మంగపల్లి శోభన్ సోమపంగు వీరబాబు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ సురేందర్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 11 2024, 14:57

రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కుందూరి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కదిలి రండి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టేల శివకుమార్

వందలాది మంది యువకులు కలిసి కుందూరి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కదిలి రండి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టేల శివకుమార్

రాబోయే ఎలక్షన్లో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని, నేను మార్నింగ్భా లో గంగా కొంతమంది యువకుల్ని కలిసి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు వస్కుల మహేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 11 2024, 14:41

పార్లమెంటు ఎలక్షన్లో నల్గొండ ప్రజలు ధర్మం వైపు అంటే బిజెపి వైపు నిలబడండి: నల్లగొండ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

పార్లమెంటు ఎలక్షన్లో నల్గొండ ప్రజలు ధర్మం వైపు అంటే బిజెపి వైపు నిలబడండి: నల్లగొండ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

పార్లమెంట్ ఎలక్షన్లో నల్గొండ ప్రజలందరూ ధర్మం వైపు అంటే బిజెపి వైపు నిలబడాలని, దేశాన్ని అనుక్షణం కంటిపాపల కాపాడే మోడీకి మద్దతు తెలిపి దేశ రక్షణలో ప్రతి ఒక్కరు మోడీ గెలుపులో భాగం కావాలని, కనగల్ మండలం గ్రామం బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని ప్రజలకు సూచించిన నలగొండ బిజెపి పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నల్గొండలో బిజెపి పార్టీ చాలా బలంగా ఉందని, బూత్ స్థాయి కార్యకర్తలు కష్టపడినట్లయితే ఈసారి విజయం మనదేనని, మోడీ విజయం కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బలంగా పనిచేసి మోడీ విజయంలో ప్రతి ఒక్కరు సమిదల వెలుగొందాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ మీర్యాల వెంకటేశం , మండల అధ్యక్షుడు పులకరo భిక్షం, ప్రధాన కార్యదర్శులు దాసరి వెంకన్న, భైరాగొని అశోక్, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి , బూత్ అధ్యక్షులు అరుణ్, సాయి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 09 2024, 22:01

నల్లగొండ పట్టణ ప్రజలకు నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వినతి.....

File photo

నల్గొండ ప్రజలారా నేను మీ మాజీ మున్సిపల్ చైర్మన్ ని మీ మందడి సైదిరెడ్డిని...

నల్గొండ ప్రజలారా ఎన్నో ఏండ్ల సంధి మీరు నల్గొండ లోనే నివసిస్తున్నారు. ఒకప్పటి నల్గొండ ఎలా ఉంది? నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నల్లగొండ ఎలా మారింది, అనే అంశాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. నల్లగొండ ఒక హైటెక్ సిటీ రేంజ్ లో తీసుకువెళ్లిన ఘనత మన బి ఆర్ ఎస్ పార్టీది. మన నల్గొండ అంతకు ముందు ఉన్న మున్సిపల్ చైర్మన్లు ఎలాంటి అభివృద్ధి చేశారో, నల్గొండలో నేను మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఏలాంటి అభివృద్ధి జరిగిందో, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో మీరే గమనిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ మున్సిపాలిటీ లోని కాలనీలు మరియు నల్లగొండ టౌన్ సిటీ ఎంతో మెరుగ్గా తయారయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని నా మనవి. నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నలగొండనీ మునుపెన్నడూ లేనంత అందంగా సుందరీకరించడం జరిగింది. మునిపెన్నడు ఏ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ నల్లగొండ ని ఒక జిల్లాలాగా చూడలేదు, నేను నా సమయంలో నల్గొండని ఒక హైటెక్ సిటీ రేంజిలో తీసుకువెళ్లాలని ఆశతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ ని హైటెక్ సిటీ రేంజ్ లో కొద్ది మొత్తంలో తీర్చి దిద్దినప్పటికీ కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయాయి. ఎందుకంటే మాకు అధికారం రాకపోవడమే కారణమని ప్రజలకు తెలుసు. కావున గొప్ప పోరాట యోధులు పుట్టిన మన నేల, పోరాటాల మన నల్గొండ ప్రజలు మంచిని చెడుని గమనించి మంచి చేసిన మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డినీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నిజందాగదుక్షణంఆగదు

May 09 2024, 21:00

విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడండి, సమాచార హక్కు వికాసమతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

 విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడండి : డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డిని గెలిపించాలి

రఘువీర్ రెడ్డిని గెలిపించి రాహుల్ ను ప్రధాని చేయాలి

రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పాలన నిర్ణయాలు అభినందనీయం

దేశంలో చట్టాలు అమలు కావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే

కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైంది

ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ సాధించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనీ విజయపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐదు జాతీయ గ్యారెంటీ పథకాల్లో పేద మహిళలకు, రైతులకు, యువకులకు, శ్రామికులకు, విభిన్న కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెస్తే, జవహర్ లాల్ నెహ్రూ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణం చేయగా, రాజీవ్ గాంధీ దేశానికి టెక్నాలజీ పరిచయం చేశారు. సోనియాగాంధీ సమాచార హక్కు చట్టం తీసుకురాగా,ఇదే తరహాలో రాహుల్ గాంధీ పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అభినందనీయం అన్నారు. సమాచార హక్కు చట్టం   ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా, ఆన్లైన్ విధానంలో ఆర్టిఐ దరఖాస్తుల స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే లోక్ పాల్ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఐ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టిఐ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఐ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఐ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు.  మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో  ఓటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు.

రాష్ట్ర నాయకులు మాజీ ZPTC గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ పురపాలక సంఘం చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. కొందరు కేంద్రంలో ఇండియా కూటమిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిని మేధావి వర్గం ఆలోచన చేసి, తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. వికాస సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాచాం సత్యనారాయణ మాట్లాడుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే పార్టీల పట్ల జాగ్రత్తగా వుండాలని, చట్టాన్ని తెచ్చిన, మద్దతు ఇచ్చే పార్టీ లకు సమాచార కార్యకర్తలు మద్దతుగా వుండాలని అన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఎం ఏ కరీం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన పారదర్శకత ఉండేందుకు ఆర్టిఐ చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు తెలిపారు. ఆ చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రjతి ఒక్కరి మీద ఉందన్నారు. నల్లగొండ పురపాలక వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ ZPTC వంగూరి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర గౌరవ సలహా దారులు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కావాలంటే ఆర్టిఐ కార్యకర్తలు కీలకంగా పని చేయాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీ గోనా రెడ్డి, గాదె వినోద్ రెడ్డి, ఖుర్షీద్ పాష, ముకుంద రెడ్డి, కౌన్సిలర్లలు పున్నా గణేష్, కరుణాకర్ రెడ్డి. సత్యనారాయణ, హేమలత, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు,చిత్రం శ్రీనివాస్, బొగరీ రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మి విద్యాసాగర్, అశోక్ రెడ్డి, కప్పల క్రాంతి, రమణ, నాగలక్ష్మి, చంద్ర కళ , 

బి వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 02 2024, 22:36

టీయూడబ్ల్యూజే 143 అనుబంధంగా నూతనంగా ఏర్పడ్డ చిన్న మధ్య మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఆన్లైన్ మీడియా పత్రికల నూతన కమిటీ సంఘం

జర్నలిస్టుల సంక్షేమం టియూ డబ్ల్యూ ధ్యేయం 

--అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాలు 

--చిన్న పత్రికల జర్నలిస్టుల సమ స్యలపై పోరాటం 

--యూనియన్ అనుబంధంగా చిన్న, మధ్యతరహా నూతన కమిటి ప్రకటన 

--టియూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ 

 నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే 143 ముందుకు సాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హు లైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అం దే విధంగా ప్రభుత్వం,జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల సమన్వయంతో కలిసి కృషి చేయడం జరుగుతుందని వివరించారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూని యన్ కార్యా లయంలో టి యు డబ్ల్యు జే 143 అనుబంధ చిన్న మధ్య తర హా పత్రికలు, ఆన్ లైన్ మీడియా నూతన కమిటీ ని ప్రకటించిన అ నంతరం ఆయన మాట్లాడారు. చి న్న, మధ్యతరహా పత్రికల జర్నలి స్టుల సమస్యలు ప్రధానంగా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనం త త్వరితగతిన పరిష్కారానికి నో చుకునే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానం గా చిన్న పత్రికలు స్థాపించుకుని సొంత కాళ్లపై నిలబడి జీవనం సాగిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అందరికి ఇళ్ళ స్థలాల లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న oదున ఎన్నికల తర్వాతే యూని యాన్ నాయకత్వం సదరు కార్యా చరణను ముందుకు తీసుకెళ్లి ఇళ్ళ స్థలాల కోసం కృషి చేయడం జరు గుతుందని వివరించారు. చిన్న మ ధ్య తరహా పత్రికలు ఆన్లైన్ మీడి యా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నందున ఇళ్ల స్థలాల సాధ నలో మీ పాత్ర కూడా నిర్మాణాత్మ కంగా ఉండాలని ఆయన నూతన కమిటీ సభ్యులను కోరారు. నూతన కమిటీ సభ్యులు త్వరలో మొదటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంఘటిత సహృ ద్భావ వాతావరణంలో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని సూ చించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని ముగించారు. ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ మామి డి దుర్గాప్రసాద్, యూనియన్ నల్లగొండ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి దండంపల్లి రవి కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు సైదులు, ముచ ర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరుల పాల్గొ న్నారు. 

నూతన జిల్లా కమిటీ 

గౌరవ అధ్యక్షునిగా పి.నరహరి, ముఖ్య సలహాదారునిగా అంజయ్య, అధ్య క్షునిగా పి.నవీన్ కుమార్, ఉపా ధ్యక్షులుగా ఏ ఎన్ చారి, మన్నె శోబన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వనమాల రాజు, కార్యదర్శిగా ఉమా మహే శ్వర్, మహేష్, జె.నాగ రాజు, కె.హ రి, జాని, మధు కోశాధి కారిగా ఇ. సందీప్, ప్రచార కార్యద ర్శిగా నరేష్, సాంస్కృతిక కార్యద ర్శిగా కె.సతీష్, కార్యనిర్వాహక సభ్యు లుగా కె.శివ, ఎం.కిరణ్ కుమార్ జె.సురేష్, చంద్ర శేఖర్ తది తరుల నూతన కమిటీలో నియామకమ య్యారు.

నిజందాగదుక్షణంఆగదు

May 02 2024, 13:26

నేటి నుంచి నల్గొండ కలెక్టరేట్లో నల్లగొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ...

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు, ఈ నెల 27న పోలింగ్‌, జూన్‌ 5న ఫలితాలు

నిజందాగదుక్షణంఆగదు

May 02 2024, 10:14

చంచల్‌గూడ జైలుకు బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌

చంచల్‌గూడ జైలుకు బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌, 14 రోజులు రిమాండ్‌ విధించిన జడ్జి. ఓయూ ఫేక్‌ సర్క్యులర్‌ పోస్ట్‌ కేసులో నిన్న క్రిశాంక్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. BRS సోషల్‌ మీడియా కన్వీనర్‌గా ఉన్న క్రిశాంక్‌.. ఆరు సెక్షన్ల కింద క్రిశాంక్‌పై కేసు నమోదు.