నిజంనిప్పులాంటిది

Mar 14 2024, 08:47

నేటితో ముగియనున్న గ్రూప్ 1 పరీక్ష దరఖాస్తు గడువు

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నేటీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది.

అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ వచ్చాయి.

పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందు బాటులోకి వస్తాయి...

నిజంనిప్పులాంటిది

Mar 14 2024, 08:46

ఇక సర్కారు బడుల్ల్లో జిల్లా కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు!

ప్రైవేట్‌ స్కూళ్లకు 9 గంటల కే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కా రు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు

స్కూళ్లో ముగ్గురు టీచర్లుం టే వచ్చేది ఇద్దరే. ఇక షిప్టులు, వంతులు పెట్టుకొని ఒకరు స్కూళుకెళ్లి, మరొక రు డుమ్మాకొడుతున్న పరిస్థితులున్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకొంటారు.

ఇది ప్రైవేట్‌కు..సర్కారు బడులకున్న తేడా.ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అన్నింటిపై నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించం. ఫేషియ ల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను ఎఫ్‌ఆర్‌ఎస్‌ పటిష్టంగా అమలుచేయాలి.

అన్నిశాఖలు, కార్యాలయా ల్లో ఈ హాజరు అమలవు తుంది. సీఎం, సీఎస్‌ సహా ఐఏఎస్‌ అధికారులంతా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును నమోదుచేయాలి. ఇటీవలే విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికా రులతో అన్న మాటలివి.

అధికార వర్గాల కథనం ప్రకారం విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం ఇలా వ్యాఖ్యానిం చడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. సర్కారు బడులను గాడినపెట్టే పనిలో నిమగ్నమైంది

కలెక్టర్ల చేత ఆకస్మిక తనిఖీలు

సర్కారు బడులను గాడిలో పెట్టడంలో భాగంగా జిల్లా కలెక్టర్ల చేత ఆకస్మిక తని ఖీలు చేయించాలని ప్రభు త్వం నిర్ణయించింది. వారంలో రెండు చొప్పున బడులను తనిఖీచేసేలా త్వరలోనే ఆదేశాలివ్వను న్నది.

ఈ ఆకస్మిక తనిఖీ పూర్త యిన తర్వాత కలెక్టర్లు పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అటు విద్యాశాఖకు..ఇటు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సర్కారు బడులపై ప్రజల్లో సదాభి ప్రాయంలేదని, ఇందుకు టీచర్లు ఓ కారణమని ప్రభుత్వం గుర్తించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లు విధులకు గైర్హాజరవుతు న్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీల ద్వారా బడులను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వమున్నది.

కాగా, వచ్చే జూన్‌లోపు 'మన ఊరు -మన బడి' కార్యక్రమంలో చేపట్టిన స్కూళ్లే కాకుండా అన్ని స్కూళ్లలో సరిపడ నీటి వసతి, టాయిలెట్లు, తాగునీరు, బెంచీలు వంటి సౌకర్యాలను కల్పించాలని విద్యాశాఖ యోచిస్తున్నది

గతంలో వ్యతిరేకించిన సంఘాలు

పాఠశాల్లో టీచర్ల హాజరును పర్యవేక్షించేందుకు అమలు చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను హాజరు విధానాన్ని గతంలో పలు ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. టీచర్లపై పెత్తన మేంటని ప్రశ్నించాయి.

ఈ విధానంపై టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేప థ్యంలో విద్యాశాఖ వెనక్కితగ్గింది. దీంతో అరకొరగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలవుతున్నది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల తో పూర్తిస్థాయిలో ఎఫ్‌ఆర్‌ ఎస్‌ అమలుకు విద్యాశాఖ సమాయత్త మవుతున్నది

నిజంనిప్పులాంటిది

Mar 14 2024, 08:44

బిజెపి 72 మందితో రెండో జాబితా

లోక్ సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగు రికి ఇందులో చోటు దక్కింది.

మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్య ర్థిగా రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలా బాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్‌ పోటీ చేయను న్నారు.

మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, నల్లగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు.

ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించించగా.. వరంగల్‌, ఖమ్మం స్థానాల ను పెండింగ్‌లో ఉంచింది.

నిజంనిప్పులాంటిది

Mar 14 2024, 08:43

ఎమ్మెల్సీ కవితకు నో ఛాన్స్? కొత్తవారికి అవకాశం

జహీరాబాద్ మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిం చారు.

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ , నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు.

గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడినా కవితకు ఈసారి టికెట్ నిరాకరించారు.కాగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది.

వారిలో ముగ్గురు సిట్టింగ్ సభ్యులు మాలోతు కవిత, నామా నాగశ్వరరావు, మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నా రు. మిగిలిన ఆరు గురి లో ఐదుగురు తొలి సారి లోక్ సభకుపోటీ చేయను న్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 13 2024, 13:28

Election Commissioners: ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి..

ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం (మార్చి 15న) విచారణ జరుపుతామని వెల్లడించింది..

కేంద్ర ఎన్నికల సంఘం (EC)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు..

ఏంటీ కొత్త చట్టం..?

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి గతేడాది డిసెంబరులో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. ఈసీల నియామక బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. దీన్ని సవాల్‌ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి..

నిజంనిప్పులాంటిది

Mar 13 2024, 08:15

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలి : సీఎం రేవంత్

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహిం చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబా టులో లేకుండా చూడను న్నారు.

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లకుం డా, మాస్ కాపీయింగ్ జర గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తర గతి పరీక్షలు జరగను న్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 12:44

హర్యానా సీఎం రాజీనామా?

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు.

గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కాసేపట్లో బీజేఎల్పీ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు...

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 12:43

ఆస్ట్రేలియాలో మహిళ హత్య? ఇండియాకు తెచ్చేందుకు యత్నాలు

ఆస్ట్రేలియలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్వేత (36) మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేం దుకు కేంద్ర హోంశాఖ యత్నాలు చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్య చేసి చెత్త కుండీలో పడేసిన విషయం తెలిసిందే.

కాగా రాచకొండ పోలీసు లను కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. త్వరలోనే డెడ్ బాడీని నేడో, రేపో హైదరా బాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:16

తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది.

ఈ సభ వేదికగానే... మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరిం చనున్నారు గులాబీ బాస్ కేసీఆర్..

ఇప్పటికే సభకు సంబంధిం చిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:15

తెలంగాణకు మరోసారి మోడీ..5 రోజుల షెడ్యూల్ ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.

తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించను న్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యా ల, నాగర్ కర్నూల్, మల్కా జ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది..