నారా లోకేష్ ని కలిసిన అనంతపురం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు
అనంతపురం లో శంఖారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన అనంతపురం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని అనంతపురంలోని పివికేకే కాలేజీలో శంఖారావం సభా ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్ రెడ్డి మరియు ప్రభుత్వ విద్యా సలహాదారు అలూరు సాంబశివా రెడ్డి.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికీ, కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాలు ఇలానే కొనసాగలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ "ఫ్యాన్" గుర్తు కు ఓటు వేయాలని వీరాంజనేయులు, శంకర్ నారాయణ పిలుపునిచ్చారు.
నార్పల మండలం మద్దలపల్లి, నాయనపల్లి, వెంకటాంపల్లి, గడ్డంనాగేపల్లి, నడిమిదొడ్డి, కేశేపల్లి, కురగానిపల్లి, కర్ణపుడికి, పులసలనూతల, బొందలవాడ, నిలువురాయి, చామలూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి వారు పర్యటించారు.
మద్దలపల్లిలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ, ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగనన్న ప్రభుత్వంలో మేలుని వివరించారు. రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
◆ బ్రిడ్జి నిర్మాణం కొరకు భూమి పూజ
●శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, మరియు శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యం ఎం. వీరాంజనేయులు.
శింగనమల మండలం సోదనపల్లి- పోతురాజుకాలువ మధ్య ఉన్న మరువవంక దగ్గర హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు వైఎస్సార్సీపీ నాయకులతో కలసి సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు భూమి పూజ చేశారు.
పి.ఎం.జి.ఎస్.వై.క్రింద దాదాపు రూ.6.32 కోట్లు నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
రెండు గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి,ఎంపీ తలారి రంగయ్యకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంక్షేమ కాంతులు
వెదజల్లుతున్నాయని వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలం చక్రాయపేట, పోతురాజుకాలువ గ్రామంలో ఆయన పర్యటించారు.
ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. ప్రజలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోడానికి వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. 2014 లో చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలని మోసం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని మోసం చేయటానికి మళ్లీ వస్తున్నారన్నారని వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని ప్రజల ఇంటి వద్దకే అందించారన్నారు. ప్రజల వద్దకే పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నార్పల మండల కేంద్రం లో నాగిరెడ్డి అనే వ్యక్తి పై కొడవళ్ళతో దాడి..
:అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని వేరుసెనగ మిల్లు వద్ద నాగిరెడ్డి అనే వ్యక్తి పై చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి..
తీవ్ర రక్తస్రావం కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు...
సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో, మరియు జమ్ములదిన్నె, జమ్ములదిన్నె కొట్టాలు,ఓబుళాపురం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
గడపగడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. అవ్వా,తాతలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... పేద ప్రజలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైస్సార్సీపీ పార్టీని స్థాపించారన్నారు. ప్రజలకు జగనన్న చేస్తున్న మేలును మరచి పోలేనిదన్నారు. వైఎస్సార్సీపీ ని ఓడించాడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తున్నాడన్నారు. సీఎం జగనన్నకు ప్రజల అండ ఉన్నంత వరకు ఏమి చేయలేన్నారు. జగనన్న మేలు మరువద్దని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి గా ఆయన్నే చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.
గార్లదిన్నె మండలం కోటంక, మార్తాడు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
ఇంటింటికీ వెళ్ళి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎం గా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో పొత్తులపై వస్తున్నారన్నారు. జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇంటింటికి చేకూర్చారన్నారు. ప్రజలు ఓటు రూపంలో ఫ్యాన్ కు ఓటు వేసి వైఎస్సార్సీపీ ని గెలిపించుకొని గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎల్బీ కాలనీ, జన చైతన్య కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
గడపగడపకు వెళ్లి ప్రజలను ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సంక్షేమ పాలనపై అరా తీస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగలంటే వైస్సార్సీపీ 'ఫ్యాన్' గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎంగా వైఎస్ జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని ప్రజలంతా ఆయనను ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల కోసం తప్పుడు వాగ్దానాలతో ఇంటింటికి వస్తు ప్రజలని మోసం చేయడానికి టీడీపీ జనసేన కలిసికట్టుగా వస్తున్నారనే విషయం గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంతకు మించిన సంక్షేమం, అభివృద్ధి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
-సీఎం జగనన్నతోనే గ్రామాభివృద్ధి
శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎల్బీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు.
యం. జి.యన్.ఆర్.ఇ. జి. యస్ క్రింద రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమానంగా చూస్తోందని, ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు జోరుగా చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీ పాలనలో చేయని అభివృద్ధిని నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలోని జన చైతన్య కాలనీలో ఉన్న మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆలూరు రమణారెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల సొంత నిధులను ముస్లిం పెద్దలకు అందజేశారు.
గత టిడిపి ప్రభుత్వ పాలనలో మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి నిర్మించిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వంత ఖర్చుతో గోడను నిర్మించుకున్నాము అని , గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంతో కాంపౌండ్ గోడ ఖర్చు తామే ఇస్తామని మాట ఇచ్చి నేడు మాట నిలుపుకున్నారని ముస్లిం పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తమ కాలనీల్లో అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు, అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇలాంటి పాలన మళ్ళీ రావడం కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు తెలిపారు.
అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివరెడ్డికి ఆలూరు రమణారెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 12 2024, 09:01