కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ
ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆదివారం(మార్చ్ 3) భేటీ అవనుంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది..
ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు..
![]()
మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో తుది కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది..

						









Mar 03 2024, 09:13
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
15.7k