నిజంనిప్పులాంటిది

Feb 20 2024, 09:05

AP: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.రూ.78.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్‌..

2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేలా వారికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు "వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

Streetbuzz News

SB NEWS

నిజంనిప్పులాంటిది

Feb 20 2024, 08:57

మహా జాతరకు మేడారం ముస్తాబు

మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తు న్నాయి.

ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో..మేడారం కీకార ణ్యంలో…ప్రతి రెండేళ్ల కోసారి ఈ జాతర జరుగుతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవా రం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి..గోవింద రాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.

మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్ర దాయాల ప్రకారం తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.

శుక్రవారం దేవతలకు భక్తు లు మొక్కులు చెల్లించు కుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనా రణ్యాంగా మారిపో తుంది.

సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలు కొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి..

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 17:46

ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కాసేప‌టి క్రితం బేగంపేట్ విమానా శ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు పయనమయ్యారు.

సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వెళ్లడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు, ప్రచార వ్యూ హలు, చేరికల విషయంపై అధిష్టానంతో చర్చించను న్నట్లు టాక్.

వీటితో పాటుగా అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ గురించి కూడా పార్టీ పెద్ద లతో సీఎం చర్చించను న్నట్లు సమాచారం

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 13:27

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు..

Streetbuzz News

SB NEWS

STREETBUZZ NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 13:23

గ్రూప్ 1ఎగ్జామ్ నిర్వహణపై అయోమయంలో తెలంగాణ సర్కార్

హైకోర్టు తీర్పుతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్‌తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది. త్వరగా గ్రూప్ -1కు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్‌పి ఎస్‌సి ని ఆదేశించిన విష యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా…? లేక 2022 ఏప్రిల్ 26న విడుదలైన పాత నోటిఫికేషన్‌కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహి స్తారా..? అనే విషయంపై టిఎస్‌పిఎస్‌సి తీసుకునే నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.

ఫలితాల విడుదలపై దృష్టి…

రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడించ డంపై టిఎస్‌పిఎస్‌సి దృష్టి సారించింది. చైర్మన్, సభ్యులతో పాటు కమిష న్‌కు కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది.

ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన కమిషన్, ఇటీవల వివిధ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల చేసింది.

అంతకుముందు భూగర్భ జలవనరుల శాఖ ఉద్యోగ పరీక్షల ఫైనల్ కీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 20న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు...

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 13:21

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్ల లో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళా శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దు కునే సౌకర్యం ఉంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించన‌ న్నారు. ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాను న్నారు...

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 13:20

కరీంనగర్ జిల్లా లో రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

గుజరాత్ నుంచి వచ్చి కొద్ది సంవత్సరాల నుండి గోపాల్ పూర్ లో నివాసం ఉంటు న్నారు తండ్రి రాజీవ్ పటేల్.

మృతురాలు దియా పటేల్ ఆల్ ఫోర్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

కరీంనగర్ ఫ్లైఓవర్ కింద సర్కిల్ నుండి ఎలక్ట్రానిక్ స్కూటీపై బైపాస్ కి మలుపు తిరుగుతుండగా గోదావరి ఖని నుండి హైదరాబాద్ వెళుతున్న చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది...

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 13:17

మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అన్నీ ఏర్పాట్లు చేసిందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా 25వ తేది వరకు 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపు తోందని తెలిపారు.

గతంలో కంటే ఈసారి ఎక్కువ‌ బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉంద‌ని, ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ జాతరకు అందు బాటులో ఉన్నందున.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.

మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించు కుంటారని సంస్థ అంచనా వేస్తోందన్నారు.

భక్తులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు పెద్ద సంఖ్యలో 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు....

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 08:49

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,390.. 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,190.. 

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,900.

STREETBUZZ NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 08:47

Kalki Dham: నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు..

10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు..