గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి- 16న జరిగే సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలి
![]()
[Streetbuzz News Crime journalist]
సిద్దిపేట జిల్లా:
(కొండపాక):- కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కి మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నర్సయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 /- వేలు నిర్ణయించి అమలు చేయాలని కార్మికుల్ని బానిస తత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మధ్యాహ్న భోజన నిర్వహణ స్వచ్చంద సంస్థలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం వాటాల అమ్మకం ప్రైవేట్ పరం చేయడం ఆపాలని,కేంద్ర స్కీంలకు బడ్జెట్ తగ్గించవద్దు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఆహారవస్తులపై జిఎస్టి ఉపసంహరించాలని నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలని గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అవసరమైన గ్యాస్ ను సబ్సిడీకి ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు గుడ్డుకు 8 రూపాయలు పెరిగినందున అధానంగా బడ్జెట్ ఇవ్వాలని కోరారు.లేనియెడల పిల్లలకు రెండే రోజులు గుడ్లు పెడదామని తెలియజేశారు. గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అక్రమ తొలగింపులు అరికట్టాలని రాజకీయ వేధింపులు ఆపాలని వంట షెడ్డు వంట పాత్రలు మౌలిక వసతులు కల్పించాలని కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలని సామాజిక భద్రత కల్పించాలని ప్రమాద బీమా పి ఎఫ్ ఈ ఈ ఎస్ ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ 16న జరిగే సమ్మెలో మేము సైతం పాల్గొంటున్నామని తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కృష్ణ,ఉప్పలయ్య,పుష్ప,అరుణ,కలవ్వ అనిత, అంసవ్వ, తదితరులు పాల్గొన్నారు.








ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రైవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ త్యాగాల తల్లి మాతా రామా భాయి కోట్లాది ప్రజల హక్కులు కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలకి ఏ మాత్రం ఆటంకం కలిగించ కుండా పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించి,అన్ని విధాలా అంబేద్కర్ కి అండగా ఉండి ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవించి తన బిడ్డల అనారోగ్యానికి మందులు కొనటానికి డబ్బులు లేక వైద్యం ఇప్పించలేక తన ముగ్గురు కొడుకులను కన్నా ఒక్క కుమార్తెను కోల్పోయి తను కూడా అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేక చనిపోతూచావులు నాకు కొత్త కాదు ఇప్పటికే ముగ్గురు కొడుకులను ఒక కుమార్తెను కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది కనీసం మిగిలిన ఒక్క కుమారుడనైన మంచిగా చూడు అని తన భర్త అంబేద్కర్ కి లేఖ వ్రాసి ప్రాణాలు విడిచిన త్యాగాల తల్లి మాత బాయీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సుతారీ కనుకయ్య, కాంటాస్టేడ్ ఎమ్మెల్యే మరాఠీ మణిదీప్, కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు పద్మారెడ్డి, గంగాధర్ రమేష్, తిరుపతి, బుమయ్య, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



Feb 08 2024, 08:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k