టీడీపీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..
టీడీపీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోనీ నిరుపేద టీడీపీ కార్యకర్త నాగరాజు గారి తల్లి దహనసంస్కరణ ఖర్చులకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమిరెడ్డి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ మల్లికార్జున, వడ్డే అంజి, గోపాల్, మూర్తి, రవి, తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత గారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కొర్రపాడు నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ను శ్రీమతి D.సునీత MPP అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశం లో అనంతపురం జిల్లా నుండి మందులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కొర్ర పాడు నకు తీసుకురావడానికి అగు రవాణా ఖర్చు గురించి, అలాగే ల్యాబ్ నందు పరీక్షలకు సంబందించిన పరికరాలు గురించి, మొదలగు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అమోదం జరిగినది. అలాగే గ్రామ నాయకులు శ్రీ D. విజయ భాస్కర్ రెడ్డి వారు ఆసుపత్రి పనితీరును ప్రశంసిస్తూ ఆసుపత్రి కి అవసరమగు NS 100 ml బాటిల్స్ ను స్వచ్చంగా ఇవ్వడం జరిగినది.అలాగే శ్రీమతి D.సునీత గారు,గ్రామ నాయకులు D. విజయ భాస్కర్ రెడ్డి గారు తో ఈ నెల 9 వ తేదీన జరుగు జాతీయ నులిపురుగుల కార్య క్రమం పోస్టర్స్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా.D.ఇందిరా ప్రియదర్శిని,డా.R.వినోద్ కుమార్,అలాగే గ్రామ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి గారు, T.మోహన్ బాబు CHO, M. పర్వీన్ HE, సూపర్ వైజర్ లు శ్రీదేవి,కేసవయ్య, స్టాఫ్ నర్స్ మంజుల, ఫార్మసీస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ కరుణాకర్, ఆరోగ్య కార్య కర్తలు రమేష్, రామలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు
వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరం కృషి చేద్దాం  నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు ◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి..
వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరం కృషి చేద్దాం  నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు ◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి . ◆ పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య. రానున్న ఎన్నికల్లో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు అన్నారు. గార్లదిన్నె మండల కేంద్రం, జంబులదిన్నె, ఓబుళాపురం, పాపినేపాళ్యం, గుడ్డాలపల్లి, సిరివరం, కల్లూరు, ఇల్లూరు గ్రామాల్లో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, జగనన్న మాత్రమే పేదల పక్షపాతి అని, ఈ సంక్షేమం కొనసాగాలంటే అది ఆయన వల్లే సాధ్యం అని వారికి వివరించారు. ఎం. వీరాంజినేయులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధే జగనన్న సంకల్పం అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. ఇలాంటి సంక్షేమ పాలన మళ్లీ మనకి అందాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking.... 6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం...
Breaking..

6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం... SGT - 2,280, School Assistant - 2,299, TGT - 1,264, PGT - 215, Principal - 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 12 నుండి DSC ప్రక్రియ ప్రారంభం... ఏప్రిల్ 7 న ఫలితాలు... ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన మంత్రి బొత్స .. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ .. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం. ఎస్‌జీటీ-2280, స్కూల్‌ అసిస్టెంట్స్‌-2299 పోస్టులు, టీజీటీ-1264, పీజీటీ-215, ప్రిన్సిపాల్ పోస్టులు-42. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తాం-మంత్రి బొత్స..
కంటైనర్ అదుపుతప్పి బోల్తా.. ఇద్దరు వ్యక్తులు, మరియు 30 ఆవులు మృతి..
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లో పెబ్బేరు నుండి అనంతపురం కు ఆవులను తరలిస్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి, 30 ఆవులు మృతి .. విచారణ చేపట్టిన పోలీసులు..
ఈనెల తొమ్మిదిన జాతీయ నులి పురుగుల దినోత్సవం..
ఈనెల తొమ్మిదిన జరగబోయే జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంపీడీవో ఆఫీస్ నందు జాతీయ నులిపురుగుల దినోత్సవం పోస్టర్లను ఎంపీడీవో శోభ రాణి గారు వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, ఎంఈఓ లింగానాయక్ గారు, సిహెచ్ఓ మోహన్ రావు గారు ప్రారంభించడం జరిగింది, అలాగే జాతీయ నులి పురుగుల దినోత్సవం సంబంధించి టాబ్లెట్లను ఎంపీడీవో గారికి అందజేసి వారి ద్వారా సచివాలయాల మహిళా ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఈ టాబ్లెట్లు స్కూళ్లకు అంగన్వాడి సెంటర్లకు ఇతర ప్రైవేట్ కాలేజీలకు అందించబడుతుందని తెలియజేశారు బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్ర పరిధిలో 9500 టాబ్లెట్లు అందించడం జరిగింది. ఈ టాబ్లెట్లను ఎంపీడీవో లాగిన్ లో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా పూర్తి చేయడమైనదని మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ శివానంద ఆనంద్ నాగరాజు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు పీహెచ్సీ అటెండర్ శివరాజు ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు..
మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు ఫిబ్రవరి ఒకటో తారీఖున నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు గ్రామంలో అరటి తోటలో మహిళను హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లడం జరిగింది ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రోజులలోనే చేదించిన పోలీసులు నేరం జరిగిన విధానము* ఫిబ్రవరి 3వ తారీఖున నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి తన చెల్లెలు అయిన లక్ష్మీనారాయణమ్మ బండ్లపల్లి పప్పూరు గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి కనిపించడం లేదు అని చెప్పడం జరిగింది, అంతలోనే పప్పూరు గ్రామం నుండి లక్ష్మీనారాయణమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టినట్టు పప్పూరు గ్రామం నుండి సమాచారం వచ్చింది అని నార్పల పోలీసులకు చెప్పగా వెంటనే అరటి తోటలోకి వెళ్లి శవాన్ని వెలికి తీసి పరిశీలించగా లక్ష్మీనారాయణమ్మగా బంధువులు గుర్తించడం జరిగింది...ఫిబ్రవరి ఒకటో తారీఖున లక్ష్మీనారాయణమ్మ చింతకాయల కోసము రామ నాయుడు అరటి తోటపక్కన ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టి వెళ్లి ఉండవచ్చు అని వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్పల పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది.. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసులో అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేన్ అంబురాజన్ సార్ గారి సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ విజయ భాస్కర్ రెడ్డి సారు గారి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో సింగనమల సిఐ శ్రీ వి శ్రీధర్, బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు ,నార్పల ఎస్సై n. రాజశేఖర్ రెడ్డి గార్లు మరియు సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును మూడు రోజుల్లోనే చేదించి ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది.. *ముద్దాయి అరెస్టు వివరాలు* చల్లా నరేంద్ర వయసు 29 సంవత్సరాలు తండ్రి రామానాయుడు b.పప్పూరు గ్రామం నార్పల మండలం అను వ్యక్తి బీకాం చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఈ మధ్యకాలంలో అతను షేర్ మార్కెట్లో వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయినాడు, దీనికోసం సుమారు 5 లక్షల వరకు వ్యక్తిగతంగా అప్పులు చేసినాడు, ఈ మొత్తాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏదైనా క్రైమ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు, ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున నరేంద్ర యొక్క అరటి తోటలోకి చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణమ్మ చింతకాయలు ఏరుకోవడానికి వచ్చినది, ఆ సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేనిది గమనించిన నరేంద్ర మృతురాలి మెడలోని బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నం చేసి నప్పుడు ఆమె కేకలు వేయగా నిందితుడు పదునైన అంచు గల రాయిని తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టి ఆమెను చంపివేసి ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, ఇత్తడి ఉంగరము, ఇత్తడి గాజు మరియు సెల్ ఫోను తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా చేయాలని ఉద్దేశంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సుమారు 2 అడుగుల లోతు గుంత తీసి కప్పి పెట్టడం జరిగింది... విశ్వసనీయ సమాచారం మేరకు ముద్దాయి చల్లా నరేంద్ర ను ఈ దినము మధ్యాహ్నము 3.30pm కి సింగనమల సీఐ శ్రీ శ్రీధర్ గారు, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది సహాయంతో b. పప్పూరు గ్రామంలోని స్కూలు దగ్గర అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారు గొలుసు, ఇత్తడి గాజు, ఉంగరము మరియు సెల్ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ముద్దాయిని రిమాండ్ పంపించడం జరుగుతుంది.. ఎటువంటి ఆధారాలు లేని కేసును అతితక్కువ సమయంలో చేదించిన రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారిని, సింగనమల సీఐ శ్రీధర్, bks ci వెంకటేశ్వర్లు, నార్పల si రాజశేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని అనంతపురం జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది...
నిరుపేద టీడీపీకార్యకర్తలకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

నిరుపేద టీడీపీకార్యకర్తలకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కార్యకర్త బోయ చెన్నమ్మ గడ్డి వాము కీ నిప్పు అంటించిన విషయం తెలుసుకొని మానవతహృదయంతో వారి కుటుంబానికి ₹5000/- రూపాయలు మరియు సిద్దారంపురం గ్రామంలో నివాసంఉంటూ ఆరోగ్యం సరిగా లేక చికత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త అమ్మవారిపేట రమేష్ కు ₹5000/- రూపాయలు చేయూత అందించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, బండారు పెద్దన్న,నరసింహులు, మాజీ స్టోర్ డీలర్ బండారు కొండన్న,బండారు వెంకటేష్, నారాయణ స్వామి, లక్ష్మినారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.

జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం ● సిద్ధం సభకు భారీగా తరలిరావాలి ●ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ●పాల్గొన్న సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గార్లదిన్నె మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల "సిద్ధం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని ఈ సభకు నియోజకవర్గ నుంచి భారీ ఎత్తున జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియమితులైన శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులుకు అందరి దీవెనలు ఉండాలని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలంటే మరోసారి జగనన్న అధికారం పీఠమెక్కాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. అనంతరం "సిద్ధం" పోస్టర్లను వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో కలసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు,విద్యా సలహాదారు ఆలూరు ఆలూరు సాంబశివారెడ్డి
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న - జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగనన్న విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచారని శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, మదిరేపల్లి, గురుగుంట్ల, నాగులగుడ్డం, నాగులగుడ్డం తాండ, నరసాపురం, చిన్న జలాలపురం, నాయనవారిపల్లి, ఇరువెందుల, రాచేపల్లి, నిదనవాడ, ఆనందరావుపేట, తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. గ్రామాల్లోని వైస్సార్సీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. అందరి సహాయ సహకారాలతో సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచేలా శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగనన్నకు దక్కుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప పరిపాలన మళ్లీ మనకు రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి చల్లని దీవెనలతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.