Breaking.... 6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం...
Breaking..

6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం... SGT - 2,280, School Assistant - 2,299, TGT - 1,264, PGT - 215, Principal - 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 12 నుండి DSC ప్రక్రియ ప్రారంభం... ఏప్రిల్ 7 న ఫలితాలు... ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన మంత్రి బొత్స .. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ .. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం. ఎస్‌జీటీ-2280, స్కూల్‌ అసిస్టెంట్స్‌-2299 పోస్టులు, టీజీటీ-1264, పీజీటీ-215, ప్రిన్సిపాల్ పోస్టులు-42. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తాం-మంత్రి బొత్స..
కంటైనర్ అదుపుతప్పి బోల్తా.. ఇద్దరు వ్యక్తులు, మరియు 30 ఆవులు మృతి..
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లో పెబ్బేరు నుండి అనంతపురం కు ఆవులను తరలిస్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి, 30 ఆవులు మృతి .. విచారణ చేపట్టిన పోలీసులు..
ఈనెల తొమ్మిదిన జాతీయ నులి పురుగుల దినోత్సవం..
ఈనెల తొమ్మిదిన జరగబోయే జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంపీడీవో ఆఫీస్ నందు జాతీయ నులిపురుగుల దినోత్సవం పోస్టర్లను ఎంపీడీవో శోభ రాణి గారు వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, ఎంఈఓ లింగానాయక్ గారు, సిహెచ్ఓ మోహన్ రావు గారు ప్రారంభించడం జరిగింది, అలాగే జాతీయ నులి పురుగుల దినోత్సవం సంబంధించి టాబ్లెట్లను ఎంపీడీవో గారికి అందజేసి వారి ద్వారా సచివాలయాల మహిళా ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఈ టాబ్లెట్లు స్కూళ్లకు అంగన్వాడి సెంటర్లకు ఇతర ప్రైవేట్ కాలేజీలకు అందించబడుతుందని తెలియజేశారు బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్ర పరిధిలో 9500 టాబ్లెట్లు అందించడం జరిగింది. ఈ టాబ్లెట్లను ఎంపీడీవో లాగిన్ లో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా పూర్తి చేయడమైనదని మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ శివానంద ఆనంద్ నాగరాజు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు పీహెచ్సీ అటెండర్ శివరాజు ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు..
మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు ఫిబ్రవరి ఒకటో తారీఖున నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు గ్రామంలో అరటి తోటలో మహిళను హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లడం జరిగింది ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రోజులలోనే చేదించిన పోలీసులు నేరం జరిగిన విధానము* ఫిబ్రవరి 3వ తారీఖున నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి తన చెల్లెలు అయిన లక్ష్మీనారాయణమ్మ బండ్లపల్లి పప్పూరు గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి కనిపించడం లేదు అని చెప్పడం జరిగింది, అంతలోనే పప్పూరు గ్రామం నుండి లక్ష్మీనారాయణమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టినట్టు పప్పూరు గ్రామం నుండి సమాచారం వచ్చింది అని నార్పల పోలీసులకు చెప్పగా వెంటనే అరటి తోటలోకి వెళ్లి శవాన్ని వెలికి తీసి పరిశీలించగా లక్ష్మీనారాయణమ్మగా బంధువులు గుర్తించడం జరిగింది...ఫిబ్రవరి ఒకటో తారీఖున లక్ష్మీనారాయణమ్మ చింతకాయల కోసము రామ నాయుడు అరటి తోటపక్కన ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టి వెళ్లి ఉండవచ్చు అని వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్పల పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది.. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసులో అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేన్ అంబురాజన్ సార్ గారి సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ విజయ భాస్కర్ రెడ్డి సారు గారి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో సింగనమల సిఐ శ్రీ వి శ్రీధర్, బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు ,నార్పల ఎస్సై n. రాజశేఖర్ రెడ్డి గార్లు మరియు సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును మూడు రోజుల్లోనే చేదించి ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది.. *ముద్దాయి అరెస్టు వివరాలు* చల్లా నరేంద్ర వయసు 29 సంవత్సరాలు తండ్రి రామానాయుడు b.పప్పూరు గ్రామం నార్పల మండలం అను వ్యక్తి బీకాం చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఈ మధ్యకాలంలో అతను షేర్ మార్కెట్లో వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయినాడు, దీనికోసం సుమారు 5 లక్షల వరకు వ్యక్తిగతంగా అప్పులు చేసినాడు, ఈ మొత్తాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏదైనా క్రైమ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు, ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున నరేంద్ర యొక్క అరటి తోటలోకి చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణమ్మ చింతకాయలు ఏరుకోవడానికి వచ్చినది, ఆ సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేనిది గమనించిన నరేంద్ర మృతురాలి మెడలోని బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నం చేసి నప్పుడు ఆమె కేకలు వేయగా నిందితుడు పదునైన అంచు గల రాయిని తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టి ఆమెను చంపివేసి ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, ఇత్తడి ఉంగరము, ఇత్తడి గాజు మరియు సెల్ ఫోను తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా చేయాలని ఉద్దేశంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సుమారు 2 అడుగుల లోతు గుంత తీసి కప్పి పెట్టడం జరిగింది... విశ్వసనీయ సమాచారం మేరకు ముద్దాయి చల్లా నరేంద్ర ను ఈ దినము మధ్యాహ్నము 3.30pm కి సింగనమల సీఐ శ్రీ శ్రీధర్ గారు, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది సహాయంతో b. పప్పూరు గ్రామంలోని స్కూలు దగ్గర అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారు గొలుసు, ఇత్తడి గాజు, ఉంగరము మరియు సెల్ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ముద్దాయిని రిమాండ్ పంపించడం జరుగుతుంది.. ఎటువంటి ఆధారాలు లేని కేసును అతితక్కువ సమయంలో చేదించిన రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారిని, సింగనమల సీఐ శ్రీధర్, bks ci వెంకటేశ్వర్లు, నార్పల si రాజశేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని అనంతపురం జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది...
నిరుపేద టీడీపీకార్యకర్తలకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

నిరుపేద టీడీపీకార్యకర్తలకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కార్యకర్త బోయ చెన్నమ్మ గడ్డి వాము కీ నిప్పు అంటించిన విషయం తెలుసుకొని మానవతహృదయంతో వారి కుటుంబానికి ₹5000/- రూపాయలు మరియు సిద్దారంపురం గ్రామంలో నివాసంఉంటూ ఆరోగ్యం సరిగా లేక చికత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త అమ్మవారిపేట రమేష్ కు ₹5000/- రూపాయలు చేయూత అందించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, బండారు పెద్దన్న,నరసింహులు, మాజీ స్టోర్ డీలర్ బండారు కొండన్న,బండారు వెంకటేష్, నారాయణ స్వామి, లక్ష్మినారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.

జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం ● సిద్ధం సభకు భారీగా తరలిరావాలి ●ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ●పాల్గొన్న సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గార్లదిన్నె మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల "సిద్ధం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని ఈ సభకు నియోజకవర్గ నుంచి భారీ ఎత్తున జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియమితులైన శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులుకు అందరి దీవెనలు ఉండాలని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలంటే మరోసారి జగనన్న అధికారం పీఠమెక్కాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. అనంతరం "సిద్ధం" పోస్టర్లను వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో కలసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు,విద్యా సలహాదారు ఆలూరు ఆలూరు సాంబశివారెడ్డి
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న - జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగనన్న విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచారని శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, మదిరేపల్లి, గురుగుంట్ల, నాగులగుడ్డం, నాగులగుడ్డం తాండ, నరసాపురం, చిన్న జలాలపురం, నాయనవారిపల్లి, ఇరువెందుల, రాచేపల్లి, నిదనవాడ, ఆనందరావుపేట, తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. గ్రామాల్లోని వైస్సార్సీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. అందరి సహాయ సహకారాలతో సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచేలా శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగనన్నకు దక్కుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప పరిపాలన మళ్లీ మనకు రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి చల్లని దీవెనలతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న పాలనలో.. గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
జగనన్న పాలనలో గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ◆ పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇంటి దగ్గకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే అని జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ నూతన భవనాలను ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను కులమత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సంక్షేమ పాలన మళ్లీ రెట్టింపు అవ్వాలి అంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అనంతరం బోయ గిరిజమ్మమాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు జగనన్న పరిపాలనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు అని వాటిని తిప్పి కొడుతూ జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్లి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. *నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం* బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం దగ్గర ఉన్న రూ. 2.6 కోట్లతో నిర్మించిన నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని సాంబశివారెడ్డి, గిరిజమ్మ ప్రారంభించారు. ఈ ఉపకేంద్రం వల్ల చెన్నంపల్లి, వెంకటాపురం, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి గ్రామాల రైతులకు వ్యవసాయ ఫీడర్లపై ఓవర్ లోడ్ తగ్గి, లో వోల్టేజ్ సమస్య తీరనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామాల్లోని రైతులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన..
అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం నేతలు.
Hot Topic.. నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి తో పలువురు నాయకులు
డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి గారు నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశాల్లో తుంపెర పక్కిర్ రెడ్డి, దుగ్గుమర్రి నారాయణ రెడ్డి , గుగుడు శివ శంకర్ రెడ్డి నార్పల యరప రెడ్డి వెంకటంపల్లి , నాయనపల్లి, గొల్లపల్లి ,పప్పురు,మద్దలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది..