జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం ● సిద్ధం సభకు భారీగా తరలిరావాలి ●ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ●పాల్గొన్న సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గార్లదిన్నె మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల "సిద్ధం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని ఈ సభకు నియోజకవర్గ నుంచి భారీ ఎత్తున జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియమితులైన శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులుకు అందరి దీవెనలు ఉండాలని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలంటే మరోసారి జగనన్న అధికారం పీఠమెక్కాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. అనంతరం "సిద్ధం" పోస్టర్లను వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో కలసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు,విద్యా సలహాదారు ఆలూరు ఆలూరు సాంబశివారెడ్డి
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న - జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగనన్న విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచారని శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, మదిరేపల్లి, గురుగుంట్ల, నాగులగుడ్డం, నాగులగుడ్డం తాండ, నరసాపురం, చిన్న జలాలపురం, నాయనవారిపల్లి, ఇరువెందుల, రాచేపల్లి, నిదనవాడ, ఆనందరావుపేట, తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. గ్రామాల్లోని వైస్సార్సీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. అందరి సహాయ సహకారాలతో సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచేలా శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగనన్నకు దక్కుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప పరిపాలన మళ్లీ మనకు రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి చల్లని దీవెనలతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న పాలనలో.. గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
జగనన్న పాలనలో గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ◆ పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇంటి దగ్గకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే అని జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ నూతన భవనాలను ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను కులమత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సంక్షేమ పాలన మళ్లీ రెట్టింపు అవ్వాలి అంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అనంతరం బోయ గిరిజమ్మమాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు జగనన్న పరిపాలనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు అని వాటిని తిప్పి కొడుతూ జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్లి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. *నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం* బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం దగ్గర ఉన్న రూ. 2.6 కోట్లతో నిర్మించిన నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని సాంబశివారెడ్డి, గిరిజమ్మ ప్రారంభించారు. ఈ ఉపకేంద్రం వల్ల చెన్నంపల్లి, వెంకటాపురం, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి గ్రామాల రైతులకు వ్యవసాయ ఫీడర్లపై ఓవర్ లోడ్ తగ్గి, లో వోల్టేజ్ సమస్య తీరనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామాల్లోని రైతులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన..
అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం నేతలు.
Hot Topic.. నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి తో పలువురు నాయకులు
డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి గారు నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశాల్లో తుంపెర పక్కిర్ రెడ్డి, దుగ్గుమర్రి నారాయణ రెడ్డి , గుగుడు శివ శంకర్ రెడ్డి నార్పల యరప రెడ్డి వెంకటంపల్లి , నాయనపల్లి, గొల్లపల్లి ,పప్పురు,మద్దలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది..
సంక్షేమ సారథికి మళ్ళీ పట్టం కడదాం.. సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కార్యక్రమంలో విద్యా సహాదారులుఆలూరు సాంబశివారెడ్డి జిల్లాఅధ్యక్షులు పైలా నరసింహయ్య
సంక్షేమ సారథికి మళ్ళీ పట్టం కడదాం - సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య నిరుపేదల సంక్షేమ సారథి ముఖ్యమంత్రి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు. శింగనమల మండల పరిధిలోని బండమీదపల్లి, చక్రాయపేట, పోతురాజుకాల్వ, పెరవలి, జలాలపురం, జులకాల్వ అలంకారాయునిపేట, కొరివిపల్లి, చిల్లేపల్లి, సలకంచెర్వు, ఈస్ట్.నరసాపురం, చిన్న మట్లగొంది, పెద్ద మట్లగొంది, సోదనపల్లి, గోవిందురాయని పేటగ్రామాలు, మండల కేంద్రంలోని కాలనీలలో ఆయన పర్యటించారు. గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పలకరిస్తూ, జగనన్న తనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని మీ అందరి దీవెనలతో గెలిపించాలని కోరారు. జగనన్నే మనందరి ధైర్యమని ఆయన చేసిన మంచే మనల్ని గెలిపిస్తుందని తెలిపారు. రాష్ట్రం బాగుండాలి అంటే నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామన్నారు. ఈనెల 10వ తేదీన జరగబోయే సిద్ధం సభకు భారీగా జనాలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో జయహో బీసీ కార్యక్రమం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో *ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కిష్టయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నా *శింగనమల నియోజకవర్గ అబ్జార్వ్ గుర్రప్ప నాయుడు గారు, టీడీపీ SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు* మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణ స్వామి, EX. MPP SK వెంకటేశు గారు, మల్లికార్జున రెడ్డి గారు, అదిశేషయ్య గారు,బెస్త నారాయణస్వామి,మాజీఎంపీటీసీ నారాయణ స్వామి, భూసి, హరి, బాబాయ్య, చిత్తంబారి,నరేంద్రయాదవ్, బోలె అక్కులప్ప గారు, రామకృష్ణ రెడ్డి గారు , తిప్పన్న గారు ,మలేష్ గారు , వన్నూర్ గారు, పరుశురాం గారు, కొయ్యగుర పెద్దన్న గారు మరియు తదితర టీడీపీ బీసీ నాయకులు, మండల టీడీపీ నాయకులు మరియు పెద్దయేతున్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రొత్త ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ రాకతో మారబోతోన్న ST గురుకుల పాఠశాల రూపరేకలు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ST గురుకుల పాఠశాల కు క్రొత్త ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ పెద్దలు రాకతో పాఠశాల దిశ మారబోతోన్నది ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ లో అద్భుతమైన స్పీచ్ తో అతని విధివిధానాలు పేరెంట్స్ క్లుప్తంగా వివిరించారు పేరెంట్స్ కూడా సానుకూలంగా స్పదించారు.. పేరెంట్స్ ద్వారా కూడా  ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.. ఇక నుంచి పాఠశాల దిశ మార్చుష్టాన్న ధీమా వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్
లక్ష్మీనారాయణమ్మ మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో నెట్టెం లక్ష్మీనారాయణమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. హత్యకు గురయిన మహిళ మృతదేహాన్ని గ్రామ సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు. బంధువుల పిర్యాదు మేరకు సమీప పొలాల్లో వెతకడంతో దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కటినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.ఆ గ్రామంలోని మహిళ రైతులు పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.తక్షణం నిందితులను తేల్చాలని పోలీసులను డిమాండ్ చేశారు.
వడియం పేట YCP సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము 3 బెడ్స్ ఆసుపత్రికి అందించిన.. ఎంపీపీ దాసరి సునీత
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి విభాగానికి మూడు బెడ్స్ ( పరుపులు) ఎంపీపీ దాసరి సునీత గారు మరియు ఎంపీడీవో శ్రీమతి శోభారాణి అందజేయడమైనది, గత నెలలో ఆస్పత్రి అభివృద్ధికి సమావేశంలో మెడికల్ ఆఫీసర్ గారి అభ్యర్థన మేరకు ఎంపీపీ గారు చొరవ తీసుకుని, ఎంపీపీ గారి అభ్యర్థన మేరకు వడియం పేట వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము మూడు బెడ్స్ ఆసుపత్రికి అందించడం జరిగింది. అందుకుగాను ఎంపీపీ గారు ఎంపీడీవో గారు ప్రత్యేక ధన్యవాదాలు అనంత వెంకట్ రెడ్డి గారికి తెలియజేశారు. త్వరలోనే ఆసుపత్రికి ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేస్తామని ఎంపీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ, స్టాఫ్ నర్స్ నారాయణ నాయక్, సూపర్వైజర్ ఈశ్వరమ్మ ఎఫ్ ఎన్ ఓ నాగలక్ష్మి, కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు